Monday, July 9, 2007

20 గంటలపాటు పోలీస్‌ స్టేషన్లో పీజేఆర్‌ andhra jyothy

(ఆన్‌లైన్‌, సిటీబ్యూరో) ముఖ్యమంత్రి సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డి, ఆయన కుమారుడు సుమధుర్‌రెడ్డిలతో ఆదివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలో జరిగిన గొడవ అనంతరం ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పీజేఆర్‌ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి, అల్లుడు గిరిసంతోష్‌రెడ్డి లను పోలీసులు అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 8.40గంటల సమయంలో పీజేఆర్‌ తన సతీమణి ఇందిరాదేవి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి అక్కడకు వచ్చారు.
ఇరుపక్షాలు కేసులు పెట్టినందున వై.ఎస్‌ సోదరుడిని కూడా స్టేషన్‌కు తీసుకురావాలని, అందరికీ ఒకే న్యాయం అమలు జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన కు న్యాయం జరిగేంతవరకు కదలబోనని భీష్మిం చిన ఆయన అప్పటినుంచి సోమవారం సాయం త్రం ఐదు గంటల వరకు అక్కడే ఉన్నారు. తమ నాయకుడికి బాసటగా వందలాది మంది కార్యకర్తలు పీజేఆర్‌ వెంటే ఉన్నారు.

తెల్లవారుజామున ఇంటికెళ్లిన ఇందిరాదేవి...

పిీజేఆర్‌తోపాటు రాత్రి మొత్తం పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్న ఇందిరాదేవి ఆరోగ్యం సరిగా లేకపోవటంతో సోమవారం తెల్లవారుజామున ఇంటికి వెళ్లిపోయారు. ఆ తరువాత పశ్చిమ మండలం డీసీపీతోపాటు పలువురు పోలీసు అధికారులు పిీజేఆర్‌ను కూడా వెళ్లిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మీ ఫిర్యాదుపై కూడా తగు చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పటా నికి ప్రయత్నించారు. అయితే పిీజేఆర్‌ మాత్రం పోలీస్‌స్టేషన్‌ నుంచి కదలలేదు. సోమవారం తెల్లవా రుజామున అక్కడే బ్రష్‌ చేసుకున్నారు. మధుమేహం ఉన్న నేపథ్యంలో ఉదయం నాలుగు పూరీలు తిన్న ఆయన మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే చేశారు. కొన్ని పళ్లు తీసుకున్నారు.
అధిష్ఠానం నుంచి ఆదేశాలు అందాయో లేక ఎవరు నచ్చజెప్పారో గానీ సోమవారం సాయంత్రం 5.15గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌ నుంచి ఇంటికి బయల్దేరి వెళ్లారు. స్టేషన్‌ నుంచి బయలుదేరిన సమయంలో అనుచరులు ఆయన వెనుక పది వాహనాలలో వెళ్లారు. అయితే పీజేఆర్‌ నివాసానికి చేరుకునేసరికి ఈ వాహనాల సంఖ్య దాదాపు రెండువందలకు చేరుకుంది. దారి పొడవునా ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పీజేఆర్‌ అనుచరులు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.


No comments: