Thursday, July 26, 2007

'610'పై ఆంధ్ర ఎమ్మెల్యేల ఆందోళన? Andhra Jyothy

హైదరాబాద్‌, జూలై 26 (ఆన్‌లైన్‌): 610 ఉత్తర్వును అమలు చేయాలంటూ ఇప్పటివరకూ తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తూ వస్తే.. ఇప్పుడు ఆంధ్ర-రాయలసీమ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళనకు సమయాత్తమవుతున్నారు. ఈ జీవో విషయంలో ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలపై పార్లమెంటు సభ్యుడు చేగొండి హరిరామజోగయ్య, సీనియర్‌ శాసనసభ్యుడు గాదె వెంకటరెడ్డి, తదితర నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతానికి చెందిన 60 మంది ఎమ్మెల్యేల సంతకాలను వీరు సేకరించారు. మరికొందరి సంతకాలను సేకరిస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఈ ప్రాంత ఎమ్మెల్యేలు సమావేశమై ఈ జీవో విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించి, తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి తెలపనున్నారు.

నష్టపోయేది తెలంగాణ ఒక్కటేనా...!
నష్టపోయేది తెలంగాణ ఒక్కటేనా...!ప్రభుత్వం ఇప్పటి వరకూ తెలంగాణ ప్రాంతానికే ప్రా ధాన్యతను ఇస్తోందని.. ఆంధ్ర, రాయలసీమ నేతల వాదనలు వినేందుకు సముఖతను వ్యక్తం చేయడం లేదన్న ఆగ్రహం ఆ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ ఉత్తర్వును అమ లు చేస్తున్నప్పుడు కేవలం తెలంగాణ ప్రాంతానికే అన్యా యం జరుగుతోందన్న భావం ప్రభుత్వంలోనూ, అధికారుల్లోనూ కన్పిస్తోందే తప్ప.. ఇతర ప్రాంతాలకు జరిగే నష్టాన్ని గురించి ఆలోచించడం లేదని వారంటున్నారు. 610పై తాము మాట్లాడిన ప్రతిసారీ, ఈ ఉత్తర్వు అమలుకు తాము వ్యతిరేకమన్న ప్రచారాన్ని తెలంగాణ నేతలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు.. దీన్ని అమలు చేయాలని కోరుకుంటున్నదే తా మని, అయితే.. రాష్ట్రపతి ఆదేశాలు, ఆరు సూత్రాల కార్యక్రమానికి లోబడి మాత్రమే ఇది జరగాలని వారు స్పష్టం చేస్తున్నారు.

Wednesday, July 25, 2007

610 జీవో కింద మాతృ సంస్థలకు 61 మంది ఇంజనీర్లు Andhra Jyothy

(ఆన్‌లైన్‌, సిటీబ్యూరో) మహా నగరపాలక సంస్థలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న 61 మంది అధి కారులను మాతృసంస్థలకు పంపారు. ప్రజారోగ్యం, పంచాయ తీరాజ్‌, గ్రామీణ నీటి సరఫరా, నీటి పారుదల, సాంఘిక సంక్షేమశాఖలకు చెందిన 59 మంది ఇంజనీర్లను, ఇద్దరు డిప్యూటీ ప్రాజెక్టు అధికా రులను వెనక్కి పంపుతూ గ్రేటర్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 610జీవో కింద స్థానికేతరులుగా గుర్తించిన ఇంజనీర్లను మాతృ శాఖలకు అప్పగించారు. కాగా 610 ప్రభావంతో వెనక్కివెళుతున్న ఇంజనీర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించి 'స్టే' పొందారు. 40 మంది ఇంజనీర్లు బదిలీని వ్యతిరేకిస్తూ కోర్టుకెక్కడంతో న్యాయస్థానం స్టే మంజూరు చేసింది.

ఇదిలావుండగా 610 జీవో కింద వెనక్కి వెళ్లిన వారంతా బల్దియాలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న వారే. డిప్యుటేషన్‌ కాలం పూర్తయినా 143 మంది ఇంజనీర్లు ఇంకా నగరపాలక సంస్థ లోనే తిష్ట వేశారని గత మే 27న 'జీతమెందుకు.. గీతం ఉందిగా!' శీర్షికన 'ఆంధ్రజ్యోతి' వార్తను ప్రచురించింది. దీనికి స్పందించిన ప్రభుత్వం వీరిలో ఎంతమంది 610 జీవోకు భిన్నంగా బల్దియాలో పనిచేస్తున్నారో నివేదిక సమర్పించాలని ఆయా శాఖలను ఆదేశిం చింది. ఈ మేరకు డిప్యుటేషన్‌పై జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న 59 మంది అసిస్టెంట్‌ ఇంజనీర్లను స్థానికేత రులుగా గుర్తించింది. వీరిని సొంత శాఖలకు తిప్పి పంపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
బల్దియాలో మరో 101 మంది...11 610 జీవో ప్రభావం 101 మంది ఉద్యోగులపై చూపనుంది. జీవోను కార్యరూపంలోకి తెస్తుండ టంతో ఈ ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలో పడ్డా రు. బల్దియాలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న స్థానికేతరులను ఈ జీవో అనుసరించి మాతృసం స్థలకు తిప్పి పంపే అవకాశం ఉంది. ఇటీవల గ్రే టర్‌లో విలీనమైన 12 మున్సిపాలిటీల పరిధిలో 84 మంది, పూర్వపు ఎంసిహెచ్‌ పరిధిలో 17 ఇ తర శాఖలకు చెందిన ఉద్యోగులు పనిచేస్త్తున్నా రు. వీరిని బదిలీచేసే అంశంపై జీహెచ్‌ఎంసీ ఇం కా తుది నిర్ణయం తీసుకోలేదు. ఒకేసారి ఇంతమంది ఇంజనీర్లు పోతే పనుల పర్యవేక్షణ ఇబ్బ ందవుతుందని ఉన్నతాధికారులు అంటున్నారు.

610 అమలుపై అనుమానాలొద్దు: డీఎస్‌ eenadu

610 జీవో అమలు ప్రక్రియ మొదలైందని ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదని మంత్రి డి.శ్రీనివాస్‌ తెలిపారు. బుధవారం శాసనసభ ప్రారంభం కాగానే ముల్కీ నిబంధనలు, 610 అమలుపై తెరాస వాయిదా తీర్మానాలను ఇచ్చింది. చర్చ జరగాలని పట్టుబట్టింది. ప్లకార్డులను ప్రదర్శించింది. దీనిపై జోక్యం చేసుకున్న డీఎస్‌ మాట్లాడుతూ జీవో అమలులో పొరపాట్లు జరిగి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

Tuesday, July 24, 2007

తెలంగాణ వాదులను రెచ్చగొట్టొద్దు Eenadu

జోగయ్యకు మధుయాష్కీ హెచ్చరిక
న్యూఢిల్లీ, న్యూస్‌టుడే: 610 జీవో అమలును వ్యతిరేకిస్తూ ఎంపీ హరిరామజోగయ్య చేసిన వ్యాఖ్యలపై నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ తీవ్రంగా మండిపడ్డారు. జోగయ్య వ్యాఖ్యలు తెలంగాణ వాదులను రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. ఇలాంటి మాటలు మానుకోవాలని హెచ్చరించారు. మంగళవారమిక్కడి ఏపీ భవన్‌లో మధుయాష్కీ విలేకరులతో మాట్లాడారు. దిగ్విజయ్‌సింగ్‌ కూడా ఈ అంశంపై తెలంగాణ ఉద్యోగులు, నాయకుల వాదనలు వినాలని డిమాండు చేశారు. '610కు వ్యతిరేకంగా పోరాడాలని హరిరామజోగయ్య, హర్షకుమార్‌ పిలుపునిచ్చారు. అధిష్ఠానం వద్ద మాత్రం తాము 610కి వ్యతిరేకం కాదని చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు. జయభారత్‌రెడ్డి నివేదిక ప్రకారం స్థానికేతర ఉద్యోగుల సంఖ్య 1985 నాటికే 55వేలు. తాజా ప్రభుత్వ లెక్కల ప్రకారం అది ఏడువేలకు తగ్గిపోవడం విచిత్రంగా కనిపిస్తోంది. ఇది పూర్తి అవాస్తవం. హరిరామ జోగయ్య వ్యాఖ్యలు చూస్తే శాంతియుతంగా జరుగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని హింసాత్మకం చేయడానికి ఇక్కడివారిని రెచ్చగొట్టినట్లు కనిపిస్తోంది. 610 జీవోను చిత్తశుద్ధితో అమలు చేయాలనుకుంటే సరైన లెక్కలు తీయాలి. అందులో తెలంగాణ ఉద్యోగ సంఘాలనూ భాగస్వాములను చేయాలి. తెలంగాణ ఉద్యోగ సంఘాలు తమ ప్రాంతంలో కనిపించే చిన్న పార్టీ నాయకుడినీ నిలదీసి వారి ఉద్యమానికి మద్దతిచ్చేలా ఒత్తిడి తేవాలి. ఆంధ్ర ప్రాంత ఉద్యోగ సంఘాల వెంట ఉంటానని హరిరామ జోగయ్య ప్రకటించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకుల మద్దతు తీసుకుని 610 అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నా' అని యాష్కీ పేర్కొన్నారు.

610 జీవోపై 'జానా'కు అవగాహన లేదు : చేగొండి Andhra Jyothi

హైదరాబాద్‌, జూలై 24 (ఆన్‌లైన్‌): హోం మంత్రి జానారెడ్డికి 610 జీవోపై సరైన అవగాహన లేదని , అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ ఎంపి చేగొండి హరిరామజోగయ్య ధ్వజమెత్తారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 1975 నగర పోలీసు చట్టం ప్రకారం ఎలాంటి రిక్రూట్‌ మెంట్లు జరగలేదని జానారెడ్డి ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయనకు జీవోపై సరైన అవగాహన లేదని, అందుకే తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పోలీసులు 610 జీవో పరిధిలోకి రారని, అక్రమంగా వారిని బదిలీ చేస్తున్నారని మండి పడ్డారు.
1975 తర్వాత రిక్రూట్‌ మెంట్లు జరిగినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. 'ముందు జీవో గురించి అవగాహన చేసుకున్నాక వ్యాఖ్యలు చేయండి లేదా... అడ్వకేట్‌ జనరల్‌తో మాట్లాడి పూర్తిగా తెలుసుకోండి'అని జానారెడ్డికి ఆయన హితవు పలికారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో జీవో అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆంధ్రా ప్రాంత వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, వారు చేపట్టే ఆందోళనలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.

610 జీవోపై 'జానా'కు అవగాహన లేదు : చేగొండి Andhra Jyothi

హైదరాబాద్‌, జూలై 24 (ఆన్‌లైన్‌): హోం మంత్రి జానారెడ్డికి 610 జీవోపై సరైన అవగాహన లేదని , అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ ఎంపి చేగొండి హరిరామజోగయ్య ధ్వజమెత్తారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 1975 నగర పోలీసు చట్టం ప్రకారం ఎలాంటి రిక్రూట్‌ మెంట్లు జరగలేదని జానారెడ్డి ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయనకు జీవోపై సరైన అవగాహన లేదని, అందుకే తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పోలీసులు 610 జీవో పరిధిలోకి రారని, అక్రమంగా వారిని బదిలీ చేస్తున్నారని మండి పడ్డారు.
1975 తర్వాత రిక్రూట్‌ మెంట్లు జరిగినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. 'ముందు జీవో గురించి అవగాహన చేసుకున్నాక వ్యాఖ్యలు చేయండి లేదా... అడ్వకేట్‌ జనరల్‌తో మాట్లాడి పూర్తిగా తెలుసుకోండి'అని జానారెడ్డికి ఆయన హితవు పలికారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో జీవో అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆంధ్రా ప్రాంత వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, వారు చేపట్టే ఆందోళనలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.

Monday, July 23, 2007

యోధులను మరచిన ప్రభుత్వం Andhra Jyothi

తెలంగాణ సాయుధ గెరిల్లా అచ్చమాంబకు అందని సాయం
చిరుప్రాయంలోనే పోరుబాట పట్టిన తెలంగాణ సాయుధ పోరాట నేత నెల్లుట్ల మోహన్‌రావును అజ్ఞాతంలో ఉన్నప్పుడే వివాహం చేసుకున్నారు. ఎంతో మందికి సమరయోధుల పింఛను రావడానికి సహకరించిన మోహన్‌రావు సైతం అచ్చమాంబను విస్మరించడం విశేషం. మోహన్‌రావు మృతి అనంతరం భార్యగా వచ్చే పింఛను మాత్రమే ఆమె పొందుతున్నారు. ఆమె పోరాటానికి మాత్రం ప్రత్యేక గుర్తింపు లేకుండా పోయింది. ఇతర సమరయోధుల కంటే ఆమెకు బలమైన సాక్ష్యాధారాలున్నాయి. పిండిప్రోలులో జరిగిన గెరిల్లా శిక్షణలో భాగంగా అధునాతన ఆయుధం (గైడర్‌) చేతబట్టిన ఫోటో ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది.
పోరాట విరమణ అనంతరం కేరళ నుంచి ఆ ఫోటోను మోహన్‌రావు తెప్పించారని అచ్చమాంబ తెలిపారు. అలాంటిది ఆమెకు సమరయోధు రాలిగా గుర్తింపు రాకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆమెతోపాటు అజ్ఞాతంలో కలిసి పని చేసిన నేనాల కమల, లలిత, లక్ష్మిలకు సైతం సమరయోధుల పింఛను చాలాకాలం కిందటే మంజూరైంది. పింఛన్‌ ఎందుకు రావడం లేదని అచ్చమాంబను 'ఆన్‌లైన్‌' ప్రశ్నిస్తే... 'అంతా నా భర్త మోహన్‌రావు చూసుకునేవారు. నేనా విషయాలు పట్టించుకోలేద'ని బదులిచ్చారు. కమలమ్మ సైతం అచ్చమాంబకు పింఛను రావడం లేదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
'పోరాటం గురించి తెలియని వాళ్లు సైతం నేడు సమరయోధులుగా చలామణి అవుతున్నారు. డబ్బుల కోసం కాదు, నా పోరాటానికి గుర్తింపు లేదన్న బాధ ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంద'ని అచ్చమాంబ చెప్పారు. 'భవిష్యత్తులో ఎవరో ఏదో చేస్తారన్న ఆశతో నాడు పోరాటం చేయలేదు. భూస్వా ములు, నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం పోరాటం చేశాం. గుర్తించాల్సింది ప్రభుత్వమే. కార్యాలయాల చుట్టూ తిరిగే ఓపిక నాకు లేదు. నాలా గుర్తింపునకు నోచుకోని వారు ఇంకా ఎందరో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి, వారందరినీ ఆదుకోవలసిన అవసరం ఉంది. అయినా ఇప్పుడంతా పైరవీలమయం. నాకు న్యాయం జరుగుతుందన్న ఆశ లేదు' అని ఆవేదన వ్యక్తం చేశారు అచ్చమాంబ.
వైద్యంతో మమేకంపిండిప్రోలులో జరిగిన శిబిరంలో అచ్చమాంబ వైద్య శిక్షణ పొందారు. గాయపడిన గెరిల్లాలకు గాయాలు శుభ్రం చేయడం, కట్లు కట్టడం, ఇంజక్షన్లు ఇవ్వడంలో తర్ఫీదు ఇచ్చారు. ఇద్దరు కొరియర్లతో పాటు ఒక గన్‌మెన్‌తో ఎక్కడ దళాలకు ప్రమాదం జరిగినా ఆమె అక్కడకు వెళ్లి చికిత్స చేసేవారు. దళాలకు చేయూతనిస్తున్న గిరిజన గూడేల్లోనూ వైద్య సేవ చేయడంతో అచ్చమాంబను ఆప్యాయంగా ఓడకాయ (టాబ్లెట్స్‌) అక్క, ఎర్రక్క అని అక్కడి వారు పిలుచుకునేవారు. దళాలకు పోలీసులు, రజాకార్ల నుంచే కాకుండా అడవి జంతువుల నుంచి ప్రమాదాలు పొంచి ఉండేవి. చిరుత దాడితో తీవ్రంగా గాయపడిన దళ సభ్యుడికి చికిత్స చేసి రక్షించారామె.
పోలీసుల దాడి నుంచి రక్షించు కొనేందుకు అనారోగ్యంతో ఉన్న తన భర్త మోహన్‌ రావును ఎత్తుకొని కిలోమీటర్ల దూరం పరుగె త్తారు. దాహంతో అల్లాడుతున్న మోహన్‌రావు దప్పిక తీర్చేందుకు ఉసిరి చెట్టు ఎక్కి కాయలను చూర్ణంగా దంచి, దాహం తీర్చానని అచ్చమాంబ తెలిపారు. ఎన్నోసార్లు పోలీసులు చుట్టుముట్టినా ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి రక్షించుకునేవారని చెప్పింది. 'మీరు పేపర్‌లో ఎంత రాసినా ప్రభుత్వం స్పందించి, న్యాయం చేస్తుందన్న ఆశ నాకు ఎంతమాత్రం నాకు లేద'ని అచ్చమాంబ చెప్పడం కొసమెరుపు.

Saturday, July 21, 2007

సర్కారుకు 'ఇరు'కాటం '610'పై భేటీని బహిష్కరించిన స్టాఫ్‌ కౌన్సిల్‌, eenadu

తెలంగాణ సంఘాలు వాళ్లు రావద్దని ఒకరు... వీళ్లెందుకు రాలేదని ఇంకొకరు... ముఖ్యమంత్రి సమక్షానికి వివాదం!
610 వ్యవహారంపై ఉద్యోగ సంఘాలు రెండుగా చీలిపోయాయి. ఈ జీవో అమలుపై ప్రభుత్వం శనివారం ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశానికి ఏపీఎన్జీవోలు, టీఎన్జీవోలు, పీఆర్‌టీయూ, ఎస్టీయూ తదితర ప్రధాన సంఘాలతో కూడిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ గైర్హాజరు కాగా, దీన్ని నిరసిస్తూ తెలంగాణా ఉద్యోగ సంఘాలు సమావేశాన్ని బహిష్కరించాయి. ఈ రెండు వర్గాలను సముదాయించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరినారాయణ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రెండు వారాల క్రితం జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌కు, తెలంగాణా సంఘాలకు వేర్వేరు సమావేశాలు ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. దీంతో ఈ వారం అన్ని సంఘాలకు ఉమ్మడిగా సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. శనివారం సాయంత్రం అయిదు గంటలకు ఈ భేటీ ఉన్నట్లు స్టాఫ్‌ కౌన్సిల్‌ సభ్య సంఘాలతో పాటు, ఏడు తెలంగాణా ఉద్యోగ సంఘాల నాయకులకూ సమాచారం పంపారు. తమకు విడిగా గాకుండా ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయడంపై కౌన్సిల్‌ నేతలు కినుక వహించారు. సాయంత్రం 4.30కి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆయన కార్యాలయంలో విడిగా కలిశారు. గతంలో వేర్వేరుగా సమావేశం ఏర్పాటు చేసి, మళ్లీ ఇప్పుడు ఉమ్మడి భేటీ ఏర్పాటు చేయడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ''వేర్వేరు సమావేశాలపై తెలంగాణా సంఘాల నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో మంత్రివర్గ ఉపసంఘం కూడా ఉమ్మడి భేటీయే జరపాలని ఆదేశించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం'' అని హరినారాయణ తెలిపారు. ''ఉమ్మడిగా జరిపే సమావేశంలో మాకు విలువ ఉండడం లేదు. చిన్నాచితక సంఘాలు ముందు వరుసలో కూర్చుంటుంటే మేం మూలగా కూర్చోవాల్సి వస్తోంది. ఎజెండాలో ఎన్నో ముఖ్యాంశాలున్నా ఒక్క 610 మీద చర్చించడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. మా సూచనలేవీ అమలు కావడం లేదు'' అని వారు అన్నారు. ''610ని నిజమైన స్ఫూర్తితో అమలు చేయాలనీ, స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారందరినీ స్వస్థలాలకు పంపించాలని మేం కోరినా పట్టించుకోవడం లేదు. ఇకనైనా దీన్ని అమలు చేయాలి. ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయాలి'' అని వారు సూచించారు. వీటిపై హరినారాయణ ఎలాంటి హామీ ఇవ్వలేదు. సమన్వయ కమిటీ సమావేశానికి రావాలనీ, అక్కడ వీటిని చర్చిద్దామని సూచించారు. ఇందుకు స్టాఫ్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు నిరాకరించారు. రాలేమంటూ లేచి బయటికి వెళ్లిపోయారు. వీరిలో టీఎన్జీవో నేత సుధాకర్‌తో పాటు, గతంలో తెలంగాణా సంఘాలకు ప్రాతినిధ్యం వహించిన స్వామిగౌడ్‌ సైతం ఉండడం విశేషం. అనంతరం స్టాఫ్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణా సంఘాలతో సంబంధం లేకుండా తమతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయించాలంటూ మంగళవారం ముఖ్యమంత్రిని కలసి కోరాలని నిర్ణయించారు.
సాయంత్రం ఐదున్నరకు సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభంకాగా, ఏడు తెలంగాణా సంఘాలే దానికి హాజరయ్యాయి. 610 జీవో అమలు ప్రగతిని హరినారాయణ వివరిస్తుండగా, తెలంగాణా సంఘాల నేతలు లేచి స్టాఫ్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తాము వారికి కూడా ఆహ్వానం పంపామని సీఎస్‌ చెప్పారు. అయినా వారు సమావేశానికి రాకుండా, సీఎస్‌ను కలిసి వెళ్లిపోవడం తమను అవమానించినట్లేనని తెలంగాణా సంఘాల నేతలు శ్రీనివాస్‌గౌడ్‌, గోపాల్‌రెడ్డి, ప్రభాకర్‌ విమర్శించారు. ''గతంలో స్టాఫ్‌ కౌన్సిల్‌ చేసిన ఏకపక్ష సూచనల మేరకు జీవోలు తేవడం వివాదాస్పదమైంది. ఈ సమయంలో సీఎం జోక్యం చేసుకొని కౌన్సిల్‌లో మాకు ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు. అయినా అధికారులు ఇప్పటి వరకు దాన్ని పాటించలేదు. చివరికి సమన్వయ కమిటీకీ స్టాఫ్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు హాజరుకావడం లేదు. మేం సహకరిస్తున్నా, వారు మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు. వారు గైర్హాజరు కావడం తెలంగాణా సంఘాల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమే. దీనికి నిరసనగా మేం సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం. ఈవిషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తాం'' అంటూ వారు తమ స్థానాల్లోంచి లేచారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణయ్య వారిని సముదాయించేందుకు ప్రయత్నించినా వారు విన్లేదు. 610 అమలుపై తమ డిమాండ్ల పత్రాన్ని హరినారాయణకు ఇచ్చి వెళ్లిపోయారు.

సచివాలయం లెక్క తేల్చాలి
సచివాలయం లెక్క తేల్చాలి సచివాలయంలో 53 శాతం తెలంగాణా ఉద్యోగులే ఉన్నారంటూ మంత్రి డి.శ్రీనివాస్‌ శుక్రవారం శాసన మండలిలో చేసిన ప్రకటనను తాము తిరస్కరిస్తున్నామని తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. కిందిస్థాయి ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌ ద్వారా నియమితులైన ఇతర ప్రాంతాల వారిని కలిపి 53 శాతం అధికారులు చూపించారని ఈ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు విఠల్‌, గోపాల్‌రెడ్డి, ఇతర ప్రతినిధులు శ్రీనివాస్‌గౌడ్‌, శ్రీధరరావు దేశ్‌పాండే, పద్మాచారి విమర్శించారు. నిజానికి అనేక సెక్షన్లలో నాలుగు శాతం వరకే తెలంగాణా ఉద్యోగులున్నారని వారు తెలిపారు.

Monday, July 16, 2007

కొత్త గడువు 610 అమలు జులై 31 వరకు పొడిగింపు eenadu

ఆన్‌లైన్‌లో స్థానికేతరుల నమోదు
మంత్రులకు సమీక్ష బాధ్యతలు
మరోసారి గడువు పెంచనివ్వొద్దని ముఖ్యమంత్రి
హెచ్చరిక
జీవో 610 అమలుపై రెండుసార్లు గడువు ప్రకటించి అమలు ప్రక్రియ పూర్తి చేయలేకపోయిన సర్కారు... మరోసారి గడువు పొడిగించింది. తాజా గడువు జులై 31. సోమవారం ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.
సోమవారం ఈ భేటీ తన షెడ్యూలులో లేనప్పటికీ, శాసనసభ వాయిదా పడిన వెంటనే ముఖ్యమంత్రి తన కార్యాలయానికి వచ్చి 610పై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, సభ్యులైన ఇతర మంత్రులు జానారెడ్డి, కోనేరు రంగారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) హరినారాయణ, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... వీలైనంత ఎక్కువ మందిని స్వస్థలాలకు పంపేందుకు వీలుగా స్వచ్ఛంద బదిలీలు కొనసాగించాలని, డిప్యుటేషన్లను రద్దు చేయాలని ఆదేశించారు. ఇందుకు మరో పదిహేను రోజులపాటు (ఈ నెలాఖరు వరకు) గడువు తీసుకోవాలని చెప్పారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జీవో అమలు తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ''నేను మొదటిసారిగా జూన్‌ 30న పూర్తి చేస్తానన్నాను. రెండోసారి ఈ నెల 15 వరకు గడువు చెప్పాను. మీరు మాత్రం పని పూర్తి చేయడం లేదు. ఎలాంటి సమస్య లేకున్నా ఎందుకు జాప్యం చేస్తున్నారు. జాప్యం చేస్తే ప్రభుత్వం ఏమీ చేయలేదనుకుంటున్నారు. మరోసారి గడువు పొడిగించే పరిస్థితి తీసుకురావద్దు'' అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ... ఇప్పటి వరకు ఏడు వేల మంది స్థానికేతరులను గుర్తించామని, 957 మందికి బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. శాఖాధిపతుల కార్యాలయాల గుర్తింపు, ఉద్యోగుల కేటగిరి విషయమై సమస్యలు ఏర్పడుతున్నాయని వివరించారు. కొన్ని ప్రాజెక్టుల ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్‌లో ఉండగా వాటిని దేని కింద పరిగణించాలనే విషయమై సందిగ్ధం ఏర్పడిందని తెలిపారు. దీనిపై సీఎం మాట్లాడుతూ... ప్రాజెక్టులున్న చోటనే కార్యాలయాలు పనిచేస్తున్నట్లుగా గుర్తించాలని, హైదరాబాద్‌లో ఉన్న వాటిని క్యాంపు కార్యాలయాలుగా పరిగణించాలని ఆదేశించారు. 1975లో నాన్‌గెజిటెడ్‌గా ఉన్న పోస్టులను ఆ తర్వాత గెజిటెడ్‌గా మార్చడంతో వారిని ఏ కేటగిరిలో చేర్చాలనే విషయమై సమస్య ఏర్పడిందని సీఎస్‌ చెప్పగా, ఆయా పోస్టులను నాన్‌గెజిడెట్‌ కేటగిరి కిందనే చూడాలని సీఎం సూచించారు. మానవతా దృక్పథంతో బదిలీలు సాగాలని, ఎవరికి ఎలాంటి సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు.
అధికారులమీదే వదిలేయవద్దు
జీవో అమలు బాధ్యత అధికారులపైనే వదిలివేయకుండా మంత్రులు దీనిపై శ్రద్ధ చూపాలని వైఎస్‌ సూచించారు. వెంటనే శాఖల వారీగా కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశమై స్థానికేతరుల బదిలీలు జరిగాయా, డిప్యుటేషన్లు రద్దయ్యాయా అనే అంశాలను సత్వరమే సమీక్షించాలని ఆదేశించారు. నెలాఖరు వరకు స్వచ్ఛంద బదిలీలకు అనుమతించాలన్నారు. ఆ తర్వాత, మిగిలిన వారి విషయంలో ఎలాంటి విధానం అవలంబించాలనే అంశంపై ఉద్యోగ సంఘాలతో శనివారం చర్చించాలని సీఎం ఆదేశించారు. 1975 నుంచి స్థానికేతర గుర్తింపు విషయం ఈ సమావేశంలో చర్చకు రాగా... బదిలీలు, డిప్యుటేషన్లు పూర్తయిన తర్వాత దాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. స్థానికేతరుల వివరాలు ఆన్‌లైన్‌లో ఎందుకు నమోదు చేయలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించగా... ఈ బాధ్యతను రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్‌ (ఏపీటీఎస్‌)కు అప్పగించామని, 3 రోజుల్లో ఇది పూర్తవుతుందని సీఎస్‌ చెప్పారు.
గడువును అధికారికంగా ప్రకటించొద్దు:ఇప్పటికే రెండుసార్లు గడువు ప్రకటించి, అమలు చేయలేకపోవడంతో విమర్శలు వస్తున్నాయని, తాజాగా నెలాఖరు వరకు గడువు పొడగిస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించవద్దని మంత్రి డి.శ్రీనివాస్‌ సీఎంను కోరారు. దీనికి సీఎం అంగీకరించినట్లు తెలిసింది. సమావేశం ముగిసిన తర్వాత మంత్రులెవరూ మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
అసెంబ్లీలో అభాసుపాలు కాకూడదనే: రెండు గడువులో జీవో అమలు చేయకపోయిన పరిణామం... ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఏదో ఒక రోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అభాసుపాలు కాకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం తాజా గడువుపెంపు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

డెప్యుటేషన్లపై 'యథాతథం' eenadu

ట్రైబ్యునల్‌ ఉత్తర్వులు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే:

610 జీవో అమలులో భాగంగా అన్ని డెప్యుటేషన్లనూ రద్దు చేయాలంటూ జారీ చేసిన సర్క్యులర్‌ అమలును రెండు వారాలపాటు యథాతథ స్థితిలో ఉంచాలంటూ సోమవారం ట్రైబ్యునల్‌ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డెప్యుటేషన్లను రద్దు చేయాలంటూ జులై 2న జారీ చేసిన సర్క్యులర్‌పై ఎం.చంద్ర ఓబుళరెడ్డి తదితరులు ట్రైబ్యునల్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. డెప్యుటేషన్‌ నియామకాలకు 610 జీవోతో సంబంధం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది కృష్ణయ్య ట్రైబ్యునల్‌కు తెలిపారు. కొన్ని శాఖల్లోని పోస్టులను డెప్యుటేషన్లపైనే భర్తీ చేయాలన్న నిబంధనలున్నాయని వివరించారు. తాత్కాలిక నియామకాలకు, 610 జీవోతో సంబంధంలేదన్నారు. పిటిషనర్ల డెప్యుటేషన్లను యథాతథంగా ఉంచాలంటూ ట్రైబ్యునల్‌ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

కాంగ్రెస్స్ వాళ్ళని మించిన నట చక్రవర్తులు ఈ శృష్టిలొ లేరని చెప్ప వచ్చును

చాన్నాళ్ళ క్రితం నాటకాలు వేయడంలోను , పాత్రలను పండించడంలోను సురభి నాటక మండలివారిది ఒక విశిష్టమైన శైలి. కాలక్రమేణా రంగస్థలం రంగువెలసి, కళాకారులు కనుమరుగయ్యారు. ప్రస్తుతం వాళ్ళు లేని లోటును మన రాజకీయనాయకులు తీర్చడమేకాదు వారికంటే అమోఘంగా నటిస్తూ నిత్య నూతనంగా వెలుగొందు తున్నారు. అందులో ఎలాంటి పాత్రనైన ముఖ్యంగా అమాయక సన్నివేషాలనుండి ఆరాచక సన్నివేషాలవరకు అవలీలగా పొషించడంలో కాంగ్రెస్స్ వాళ్ళని మించిన నట చక్రవర్తులు ఈ శృష్టిలొ లేరని చెప్ప వచ్చును. ఇలాంటి విషయాల్లో కడప కళాకారులు కాకలుతీరిన వారు.

అందుకే జూబిలీ పడక సీనులొ తండ్రి (రవీంద్రా రెడ్డి) కొడుకు(సుమధుర్ రెడ్డి) అద్బుతంగా నటించారు. అలా అనేకంటే జీవించారు అని చెప్పడం సబబుగా ఉంటుందేమో. మాయావి రాజశేఖర్ రెడ్డి దవాఖానల ప్రదర్శించిన పరామర్శ సీను తన గంభీర వదనంతో మరీ పండించారు. కీ.శే.వై.ఎస్స్.రాజా రెడ్డి కుటుంబానికి దాడులు చెయ్యడంలోను, శవాలను అదృశ్యం చెయ్యడలోను ఎంత ఘనమైన చరిత్ర వున్నదో అలనాటి కడప లోకసభ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన ఒక స్వతంత్ర అభ్యర్థి హత్య అనంతరం శవం అదృశ్య ఘట్టం మనకి వాస్తవాన్ని విశదీకరిస్తుంది. ప్రస్తుతం తెలంగాణ తెర మీద వారి నటన అమొఘంగా ఉన్నా ఒన్స్ మోర్లు మరియు నీరాజనాలు మాత్రం అందుకోజాలరని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మా నాయకుల నయవంచక అశ్లీల నటనలతో మా ప్రజలు ఎప్పుడో విసిగి వేసారిపోయి ఉన్నారు గనక మీ నటన పట్ల ఆసక్తి గాని, ఆకర్షణ గాని ఏ మాత్రం లేవని మనవి. మీ సమష్యలకు మా సమష్యలకు ప్రత్యేక రాష్ట్ర మొక్కటే పరిష్కారం.తద్వార మన సకల కుటుంబాలు సుఖ శాంతులతో కలకాలం వర్థిల్ల గలవు.


నయవంచనతో కూడిన నటనకు ఏదో ఒకనాడు తెర పడక తప్పదు.


తెలివి మీరి నటిస్తే తెర మరుగు గాక తప్పదు.


జై తెలంగాణా-జై హింద్,

అనీల్ మద్దిరాల

Sunday, July 15, 2007

వై ఎస్‌-పీ జే ఆర్‌ వివాదాన్ని పరిష్కరిస్తాం andhrajyothi

ఏ ఐసీసీ ప్రతినిధి సురేష్‌
హైదరాబాద్‌, జూలై 15(ఆన్‌లైన్‌): ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, సీఎల్పీ మాజీ నేత పి.జనార్దన్‌రెడ్డి కుటుంబాల మధ్య నెలకొన్న వివాదాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని ఏఐసీసీ ప్రతినిధి సురేష్‌ చెప్పారు. ఈ వివాదం కారణంగా సోమవారం నుంచి ఆమరణ దీక్షకు దిగేందుకు సిద్ధమైన పీజేఆర్‌ను శాంతింపజేసేందుకు ఆదివారం నగరానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.

'కారు' వివాదానికి సంబంధించి పూర్తి సమాచారం సేకరించానని చెప్పారు. ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రరావు, పీజేఆర్‌, వైఎస్‌ సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డిలను కలసి పరిస్థితిని సమీక్షించానని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణలో అధిష్ఠానం తలమునకలై ఉన్నందున ఆందోళనను వాయిదా వేసుకోవాలని పీజేఆర్‌కు సూచించానని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాలను కూడా పీజేఆర్‌కు వివరించానని చెప్పారు. తన సూచన మేరకు దీక్షను వాయిదా వేసుకున్న పీజేఆర్‌ను ఆయన అభినందించారు.

వారం రోజుల మా శ్రమ వృథాకాదు: వీహెచ్‌
వైఎస్‌-పీజేఆర్‌ కుటుంబాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించరించేందుకు వారం రోజులుగా చేస్తున్న శ్రమ వృథా కాదని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు చెప్పారు. పీజేఆర్‌తో భేటీ అనంతరం ఆయన కాంగ్రెస్‌ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాల మేరకు దీక్షను వాయిదా వేసుకున్న పీజేఆర్‌ను వీహెచ్‌ అభినందించారు.

'కారు' వివాదం పాలనకు అద్దం పడుతోంది : శశిధర్‌రెడ్డి
పీజేఆర్‌ తనయుడిపై, అల్లుడిపై పోలీసులు 307 సెక్షన్‌ కింద నమోదు చేసిన కేసులు రాష్ట్ర ప్రభుత్వ పాలనకు అద్దం పడుతున్నాయని సనత్‌నగర్‌ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నందునే పీజేఆర్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. పీజేఆర్‌ చేస్తున్న పోరాటం వ్యక్తిగతమైనది కాదని... పార్టీ ప్రతిష్ఠను పెంచడం ద్వారా 2009లో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాం గ్రెస్‌ అధికారంలోకి రావడానికేనని చెప్పారు.

లెక్క తప్పీంది 610 అమలులో ప్రతిష్టంభన eenadu


610 అమలులో ప్రతిష్టంభన
స్థానికేతరుల సంఖ్య ఏడువేలకే పరిమితం
21 శాఖల్లో 828 మందికే బదిలీ ఉత్తర్వులు
ఒక్క డెప్యుటేషన్‌ కూడా రద్దు కాలేదు
1975 నుంచీ పరిశీలన హుళక్కే
వెబ్‌సైట్‌లో వివరాలే లేవు
సీఎం హామీలూ బేఖాతరు
హైదరాబాద్‌- న్యూస్‌టుడే
''ఈ నెల 15 కల్లా 610 జీవో అమలు ప్రక్రియ పూర్తవుతుంది. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. 30 ఏళ్లుగా ఏ ప్రభుత్వమూ చేయని పనిని మేం చిత్తశుద్ధితో చేస్తున్నాం.''
- ఈ నెల 2న ముఖ్యమంత్రి వైఎస్‌ ప్రకటన
జూన్‌ నెలాఖరుకల్లా 610 జీవో అమలును పూర్తి చేస్తామని గతేడాది డిసెంబరు 12న ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఆ తరవాత వెలువడిన ప్రకటన... ఈ నెల 15వ తేదీని గడువుగా పేర్కొంది. ఇదే ఆఖరు గడువని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. వారం రోజుల్లో స్వచ్ఛంద బదిలీలు పూర్తి చేయాలని, 1975 నుంచి స్థానికేతర ఉద్యోగుల లెక్కలు తీయాలని, డెప్యుటేషన్లను రద్దుచేయాలని ఆదేశించారు. కానీ... వాటిలో ఏ ఒక్కటీ నెరవేరలేదు. చిత్రమేమిటంటే సీఎం ప్రకటన తరవాత 610 అమలుపై ఊహించని ప్రతిష్టంభన ఏర్పడింది. తరవాత జైభారత్‌రెడ్డి కమిటీ నివేదిక, 1975 నుంచి ఏపీపీఎస్సీ నియామకాల రికార్డుల గల్లంతు వంటి అనేక విస్మయకరమైన అంశాలు వెలుగుచూశాయి.
అరకొర సమాచారం
610 అమలులో భాగంగా అక్రమంగా నియమితులైనట్లు ఇప్పటి వరకు గుర్తించిన ఉద్యోగులు 7,089 మందే. 3,162 మంది పోలీసులు కాగా మరో 3,927 మంది ఇతర శాఖల ఉద్యోగులు. 2002లో జారీ అయిన 124 జీవో కింద 75 శాఖల నుంచి వీరిని గుర్తించారు. దేవాదాయ శాఖలో స్థానికేతరుల లెక్క ఇప్పటికీ తేలలేదు. కొన్ని న్యాయ విభాగాల నుంచి సమాచారం రాలేదు. అయినా ఇంతకు మించి లేరంటూ సాధారణ పరిపాలన శాఖ అధికారులు సీఎంకు, మంత్రివర్గ ఉపసంఘానికి, ఉద్యోగ సంఘాలకు, శాసనసభా సంఘానికి తేల్చి చెప్పేశారు. స్థానికేతరులుగా గుర్తించిన వారిని గత నెల మూడో వారం నుంచి స్వచ్ఛందంగా బదిలీ చేసేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల రెండో తేదీ వరకు 21 శాఖల్లో 828 మందికి ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో ఉపాధ్యాయులు, పోలీసులు పోనూ మిగిలింది 510 మందే. అదే రోజు సీఎం సమక్షంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నివేదికలను ఇవ్వగా, ఈ సంఖ్య మరీ తక్కువగా ఉందని, 15 వరకు గడువు పొడగించి మరిన్ని స్వచ్ఛంద బదిలీలు చేయాలని సీఎం ఆదేశించారు. కానీ, ఈ సంఖ్య ఏ మాత్రం పెరగలేదు. ఏ ఒక్క శాఖలోనూ స్వచ్ఛంద బదిలీలు జరగలేదు. వాస్తవానికి స్వచ్ఛంద బదిలీలకు గడువు పొడగించినా మళ్లీ దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించకపోవడం గమనార్హం. దీంతో గడువు పొడిగింపు నిష్ప్రయోజన తంతుగా మారింది. మరోవైపు స్వచ్ఛంద బదిలీలపై వెళ్లిన వారికి పోస్టింగులు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వారి స్థానాలను భర్తీ చేయడంలోనూ శ్రద్ధ చూపడం లేదు.

-డెప్యుటేషన్ల మాటేమిటి: నియామక నిబంధనలకు విరుద్ధంగా డెప్యుటేషన్లపై చేరి విధులను నిర్వర్తిస్తున్నవారిని స్వస్థలాలకు పంపిస్తామని గత నెలారంభం నుంచి ప్రభుత్వం చెబుతున్నా ఇప్పటివరకు అలా ఒక్కరినీ పంపించలేదు. ఈ నెల 2న సమావేశం సందర్భంగా వారం రోజుల వ్యవధిలో డెప్యుటేషన్లను రద్దు చేస్తామని సీఎం ప్రకటించినా ఏ ఒక్క శాఖలోనూ అది జరగలేదు. అసలింతవరకు డెప్యుటేషన్లపై వచ్చిన వారెందరనేదే తేలలేదు. ప్రాథమికంగా 900 మంది అంటూ అంచనా వేసినా వారిని తిప్పి పంపేందుకు ఏ శాఖా చొరవ చూపడం లేదు.

1975 నుంచి లెక్కలేవీ: 1975 నుంచీ నియమితులైన స్థానికేతరుల్ని గుర్తించే ప్రక్రియ ఏమాత్రం జరగడం లేదు. వారం రోజుల్లోనే ఇది పూర్తవుతుందని, ఇప్పటివరకు గుర్తించినవి కాకుండా మరో పది శాతం వరకు స్థానికేతరుల లెక్క తేలవచ్చని సీఎం రెండో తేదీన స్వయంగా చెప్పారు. ఈ కోణంలో ఏ ఒక్క శాఖలోనూ కసరత్తు జరగడం లేదు. సాధారణ పరిపాలన శాఖ కూడా దీనిపై ఏమాత్రం ఒత్తిడి చేయకపోవడం గమనార్హం. ఈ రికార్డులు లేవని పోలీసు శాఖ మొదట్లోనే చేతులెత్తేసింది. ఏపీపీఎస్సీ అధికారులు గత రెండేళ్లు మినహాయిస్తే 75 నుంచి రికార్డులు లేవని తెలంగాణా ఉద్యోగ సంఘాల నేతలకు చెప్పేశారు. విద్యాశాఖ సైతం డీఎస్సీల వారిగా వివరాలను సేకరించడానికి ప్రయత్నం చేయడం లేదు. వాస్తవానికి 1975 అక్టోబరు నుంచి 85 అక్టోబరు వరకు నియమితులైన 58,952 మంది స్థానికేతరులు గుర్తించి... 1985 డిసెంబరు 30న జారీ అయిన 610 జీవోలో ప్రభుత్వం ఈ సంఖ్యను పేర్కొంది. లెక్కలేవీ దీనికి విరుద్ధంగా లేవని ప్రభుత్వ శాఖలు చెబుతున్నాయి. 1984లో అప్పటి ముఖ్య కార్యదర్శి జైభారతరెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఈ నివేదిక ఇచ్చింది. ఇప్పుడా నివేదిక లేదంటూ ప్రభుత్వంచేతులెత్తేయడంపై శాసనసభా సంఘం విస్మయం వ్యక్తంచేసింది. 1985 నుంచి విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో మినహాయిస్తే మిగిలిన శాఖల్లో నియామకాలు అంతంత మాత్రమే. నియామకాల ప్రక్రియకు సంబంధించిన రికార్డులు అన్ని శాఖల్లోనూ భద్రంగా ఉన్నా ఈ లెక్కలు లేవని చెప్పడం ఉద్దేశపూర్వకంగానే జీవో అమలుకు తిలోదకాలు ఇచ్చే ప్రయత్నమేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

స్థానికేతరుల వివరాలపై అనుమానాలను తొలగించేందుకు వారి వివరాలు వెబ్‌సైట్‌లో పెడతామని నెల రోజులుగా ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటి వరకు అలాంటిదేదీ లేదు. మరోవంక శాసనసభ సమావేశాల్లో 610 కీలకాంశం కాబోతుండగా... దీని అమలుపై తాజా పరిస్థితిని సమీక్షించేందుకు గత సోమవారం జరగాల్సిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేశారు. జీవో అమలుపై నిర్లక్ష్యమే దీనికి కారణమని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి.

సీఎం అసంతృప్తితో ఉంటే...: 610ని జూన్‌ నెలాఖరులోగా అమలు చేస్తామని తాను హామీ ఇచ్చినా జరగలేదని శుక్రవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో సీఎం అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. దీంతో అధికారులు నెలాఖరుకల్లా దీన్ని పూర్తి చేస్తామని చెప్పారు. అప్పటివరకు శాసనసభా సమావేశాలు జరుగుతాయి కనక అప్పటిలోగా అమలు కావడం అసాధ్యమైన పనే.

Saturday, July 14, 2007

వై ఎస్ తో అమీతుమీ ? eenadu


రౌడీలకే కాదు.. మాకూ ఆయనే సీఎం
307 కేసు పెట్టించింది కేవీపీ
నా సస్పెన్షన్‌కు 2002 తరహాలో కుట్ర: పీజేఆర్‌
కాంగ్రెస్‌లో సంచలనం
దిగ్విజయ్‌ ఫోను చర్చలు
వీహెచ్‌ మలివిడత రాయబారం
..అయినా పట్టువీడని జనార్దన్‌
నేడు అధిష్ఠాన దూతగా సురేష్‌ రాక
వెనక్కి తగ్గని పీజేఆర్‌
వీహెచ్‌ మలివిడత రాయబారంవ్యవహారం ముదిరి పాకానపడింది. పీజేఆర్‌ అమీతుమీకి సిద్ధమయ్యారు. వైఎస్‌పై మరిన్ని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన రౌడీలకు ముఖ్యమంత్రి అనే అర్థం వచ్చేలా పరోక్ష విమర్శనాస్త్రాలూ సంధించారు. అంతటితో ఆగకుండా తాజాగా కేవీపీ పేరునూ వివాదంలోకి లాగారు. దీక్ష ప్రారంభించి తీరుతానని చెప్పడం ద్వారా.. అధిష్ఠానం (ఢిల్లీ) వద్దకెళ్లడం కంటే, దీక్షకే తన ప్రాధాన్యమని కుండబద్దలు కొట్టారు. తద్వారా తాను దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పకనే చెప్పారు. దీంతో పీజేఆర్‌ వ్యవహారం పార్టీలో పెనుసంచలనమై కూర్చుంది. అందుకే చిన్న వివాదాన్ని ఆయన అనవసరంగా పెద్దది చేస్తున్నారని అధిష్ఠానం పేర్కొంటున్నా.. గట్టిగా ముందడుగు మాత్రం వేయలేకపోతోంది. దిగ్విజయ్‌ శనివారం మరోమారు పీజేఆర్‌తో ఫోనులో మాట్లాడారు. ఇటు వీహెచ్‌ రాయబారమూ కొనసాగింది. ..అయినా ఇప్పటికైతే ఫలితం శూన్యం! గందరగోళం యథాతథం!!
హైదరాబాద్‌, న్యూఢిల్లీ - న్యూస్‌టుడే


తన కుటుంబంపై ముఖ్యమంత్రి వైఎస్‌ కక్ష సాధిస్తున్నారని ఆరోపిస్తున్న అసమ్మతి నేత పీజేఆర్‌ తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారా? పార్టీ అధిష్ఠానం రమ్మని పిలిచినా ఢిల్లీకి పోకుండా ఆమరణ దీక్షకు సన్నద్ధమవడం దానికి సంకేతమేనా? అవుననేదే పీజేఆర్‌ సన్నిహితుల సమాధానం! ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారన్నది వారు చెబుతున్న మాట. అయితే ఆయన కాంగ్రెస్‌ నుంచి బయటికిపోయే ప్రసక్తి ఉండదని.. పార్టీలోనే ఉంటూ వైఎస్‌పై రాజీలేని పోరు సాగిస్తారని వారు చెబుతుండటం గమనార్హం. మొత్తంమీద ఈ పరిణామాలు రాష్ట్ర కాంగ్రెస్‌లో వేడి పుట్టిస్తున్నాయి. ఇది ఎక్కడికి దారితీస్తుందోనన్న ఆందోళన పార్టీ వర్గాల్లో నెలకొంది. వైఎస్‌ సోదరుడితో కారు దగ్గర మొదలైన గొడవ.. ఇప్పటికే పార్టీని చాలామేరకు భ్రష్టు పట్టించిందని.. ఇక దీక్ష కూడా మొదలైతే పరిస్థితి మరింత చెయ్యి దాటిపోతుందన్నది పార్టీ నేతల విశ్లేషణ. పరిస్థితిని గమనిస్తున్న అధిష్ఠానం ఇప్పటికైతే పీజేఆర్‌కు నచ్చజెప్పేందుకే ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్రంలో పార్టీ నాయకత్వానికి ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడొద్దని.. ఆయనకు ఒకటికి రెండుసార్లు చెబుతోంది. అదేసమయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరుపై కొంత ఆగ్రహంతోనూ ఉంది. సోనియా సన్నిహితవర్గాలు ఢిల్లీలో స్పందిస్తూ.. ''జరిగింది చిన్న వీధి గొడవ. పార్టీ ప్రతిష్ఠను పణంగాపెట్టి పీజేఆర్‌ దాన్ని రాజకీయం చేయడమేమిటి? అయినా అది నాయకత్వంపై పోరుకు ఎంచుకోదగిన అంశం ఎంతమాత్రం కాదు. దీని ద్వారా ఆయన ఎవరి సానుభూతీ పొందజాలరు'' అని సూటిగా చెప్పాయి. పైగా పీజేఆర్‌ అంత బలమైన స్థితిలో ఏమీలేడనేది గ్రహించాలని వ్యాఖ్యానించాయి. సోనియా సన్నిహితుల అభిప్రాయాలకు అనుగుణంగానే.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ శనివారం మరోమారు పీజేఆర్‌తో ఫోనులో మాట్లాడారు. సంయమనం పాటించాలని సూచించారు.
అధిష్ఠానం వైఖరి ఇలా ఉన్నా పీజేఆర్‌ తన మానాన తాను ముందుకు సాగడం పార్టీ రాష్ట్ర పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాస్తవానికి అధిష్ఠానం జోక్యంతో దీక్ష విషయంలో పీజేఆర్‌ వెనక్కితగ్గుతారని వారు భావించారు. కానీ దీక్ష తర్వాతే ఢిల్లీ వెళతానంటూ ఆయన ఏర్పాట్లు చేస్తుండటంతో.. ఇది ఇంతటితోపోయే విషయం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. సోమవారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండగా.. అదేరోజు ఆయన దీక్ష మొదలుపెడుతున్నారు. జరుగుతున్న పరిణామాలు.. వైఎస్‌పై శనివారం తీవ్ర పదజాలంతో విరుచుకుపడటం చూస్తే.. ముఖ్యమంత్రితో అమీతుమీ తేల్చుకునేందుకే పీజేఆర్‌ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు పీజేఆర్‌కు అనుకూలంగా దీక్ష వద్దకు పెద్దఎత్తున జనాన్ని తరలించేందుకు అసమ్మతి వర్గం ప్రయత్నాలు చేస్తోంది. ఎమ్మెల్యేలు మర్రి శశిధర్‌రెడ్డి, శంకరరావులు ఆయనకు మద్దతుగా నిలవటం తెలిసిందే.

అసంతృప్తి నుంచి ఆందోళనదాకా..
వైఎస్‌కు, పీజేఆర్‌కు మధ్య రాజకీయవైరం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక పీజేఆర్‌తోపాటు గతంలో వైఎస్‌ను వ్యతిరేకించే పలువురు నేతలు మంత్రి పదవులను ఆశించారు. వారిలో కొందరు పాత వైరాన్ని మరచి వైఎస్‌తో రాజీపడ్డారు. దాంతో వారికి మంత్రి పదవులు దక్కాయి. పీజేఆర్‌ మాత్రం తన పంథా వీడలేదు. దాంతో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. తెదేపా హయాంలో కాంగ్రెస్‌ వ్యతిరేకించిన ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ వంటి కొన్ని వ్యవహారాలను అడ్డుకునేందుకు పీజేఆర్‌ ప్రయత్నించారు. తన నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకే పీజేఆర్‌ అలా చేస్తున్నారని వైఎస్‌ భావించారు. దాంతో ఇద్దరి మధ్యా దూరం పెరగడం మొదలైంది. ఆ తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంపు, కృష్ణా మూడో దశ, తదితర అంశాల్లో ఆయన వైఎస్‌ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో పీజేఆర్‌కు అవకాశమివ్వాలని అధిష్ఠానం సూచించినా.. వైఎస్‌ ససేమిరా అన్నారు. దీంతో ఇద్దరి మధ్యా మరింత అగాథం ఏర్పడింది. వీటన్నింటి నేపథ్యంలో చోటుచేసుకున్న జూబ్లీహిల్స్‌ కారు వివాదం.. ఇరువర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరాన్ని ఏర్పరచింది. వైఎస్‌పై తీవ్రస్థాయి విమర్శలు, ఢిల్లీ రమ్మన్మా వెళ్లకపోవడం వంటి చర్యల మూలంగా.. అధిష్ఠానం వద్ద పీజేఆర్‌ మరింతగా ఇబ్బందుల్లో పడతారనేది సీఎం వర్గీయుల అంచనా! పీజేఆర్‌ మాత్రం పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తనతో మాట్లాడుతున్నారంటూ.. పరోక్షంగా తనకూ బలముందని చెప్పే ప్రయత్నం చేస్తుండం విశేషం!

పీజేఆర్‌తో వీహెచ్‌, ఆమోస్‌, మర్రి భేటీ
పీజేఆర్‌తో సీనియర్‌ నేత, ఎంపీ వి.హనుమంతరావు శనివారం రాత్రి మలివిడత చర్చలు జరిపారు. దీక్షను విరమించుకోవాలని, లేదంటే కనీసం రాష్ట్రపతి ఎన్నికలవరకూ వాయిదా వేసుకోవాలని ఆయన సూచించారు. సుమారు గంటకుపైగా సాగిన చర్చల్లో.. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ఆమోస్‌, పీజేఆర్‌ సన్నిహితుడు మర్రి శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు. తన డిమాండ్లను వెనక్కి తీసుకునేది లేదని వీహెచ్‌కు పీజేఆర్‌ స్పష్టంచేసినట్లు తెలిసింది. తమ ఫిర్యాదే తప్పంటూ, సీఎం సోదరుడిపై కేసు మూసివేయడంపైనే పీజేఆర్‌ ఎక్కువసేపు మాట్లాడారు. తనపట్ల ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరిస్తోందని.. ఈ పరిస్థితుల్లో వెనకడుగువేయడం తనకు రాజకీయంగా నష్టం కలిగిస్తుందనే అభిప్రాయం వ్యక్తంచేశారు. చర్చల అనంతరం.. పీజేఆర్‌ వెలిబుచ్చిన అభిప్రాయాలను వీహెచ్‌ ఫోన్‌ ద్వారా అధిష్ఠానానికి(దిగ్విజయ్‌కు) తెలియజేశారు. ఆ తర్వాత వీహెచ్‌ విలేకరులతో మాట్లాడుతూ... చాలా అవమానం జరిగిందని పీజేఆర్‌ బాధపడుతున్నారని చెప్పారు. దీక్షను ఆపడానికి తన ప్రయత్నాలు కొనసాగుతాయని.. ఇంకా 48 గంటల సమయం ఉందని పేర్కొన్నారు.

శశిధర్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ... పీజేఆర్‌ కుటుంబంతో పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. తెలంగాణ ఉద్యమం నాడు, తెదేపా హయాంలో కూడా ఇలా వ్యవహరించలేదన్నారు.

ఇక సురేష్‌ వంతు
రాష్ట్రంలో రాష్ట్రపతి ఎన్నిక వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు నియమితుడైన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత సురేష్‌ ఆదివారం హైదరాబాద్‌ వస్తున్నారు. శనివారం రాత్రి వీహెచ్‌ అందించిన సమాచారం నేపథ్యంలో సురేష్‌ను కేరళ నుంచి ఆదివారమే హైదరాబాద్‌ పంపాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం. వాస్తవానికి ఆయన సోమవారం రావాల్సి ఉంది. ఆయన వీహెచ్‌తో కలిసి వెళ్లి పీజేఆర్‌తో భేటీ అవుతారు. అధిష్ఠానం వైఖరిని ఆయనకు తెలియజెప్పి దీక్ష చేపట్టకుండా చూసేందుకు ప్రయత్నిస్తారు.

పీజేఆర్‌తో ఫోన్‌లో చర్చించిన అనంతరం దిగ్విజయ్‌సింగ్‌ విలేఖరులతో మాట్లాడారు. సమస్య పరిష్కారంలో పీజేఆర్‌ రాజకీయ విజ్ఞత ప్రదర్శిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ వివరాలను చెప్పేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. జూబ్లీహిల్స్‌ సంఘటన రాజకీయ అంశమే కాదని, అదో చిన్నపాటి వివాదం మాత్రమేనని దిగ్విజయ్‌ పునరుద్ఘాటించారు. వైఎస్‌ సోదరుడికి వైద్య పరీక్షలు జరిపిన తర్వాతే పీజేఆర్‌ తనయుడిపై 307 కేసు నమోదైందని వివరించారు.

మధ్యవర్తిత్వం నెరపాలని వీహెచ్‌ను కోరలేదు: వేరే పనిలో తీరికలేకుండా ఉన్నందున పీసీసీ అధ్యక్షుడు కేకేను ఈ వ్యవహారంలో రంగంలోకి దించలేదని దిగ్విజయ్‌ చెప్పారు. మధ్యవర్తిత్వం నెరపాలని ఎంపీ వి.హనుమంతరావుకు పార్టీ ఎటువంటి అధికారం కట్టబెట్టలేదన్నారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా తనంత తానుగా వీహెచ్‌ చొరవ తీసుకున్నారన్నారు.

రౌడీలకే కాదు.. మాకూ ఆయనే సీఎం! eenadu

307 కేసు పెట్టించింది కేవీపీ
కేసు ఎత్తివేతపై కోర్టుకెళతా
ఆమరణ దీక్ష చేసి తీరుతా
ఇంట్లోనే చేపడతా: పీజేఆర్‌
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే


కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే పి.జనార్దనరెడ్డి శనివారం మరింత తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ''కాంగ్రెస్‌ నుంచి నా సస్పెన్షన్‌కు ముఖ్యమంతి కుట్రపన్నారు. 2002లో అప్పటి రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ వాయలార్‌ రవి వచ్చినపుడు కూడా ఆయన తన ఉద్దేశపూర్వక చర్యల ద్వారా నన్ను సస్పెండ్‌ చేయించారు. ఇప్పుడూ అలాగే చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రయత్నాలను సాగనివ్వను. అన్ని విషయాలూ సోనియా దృష్టికి తీసుకెళ్తాను'' అంటూ ఘాటుగా స్పందించారు. సోమవారం నుంచి తాను ఆమరణ నిరాహార దీక్ష చేసి తీరుతానని.. ఇందులో ఎలాంటి మార్పులూ ఉండబోవని తేల్చిచెప్పారు. దీక్షకు సంబంధించిన పోస్టర్‌ను విడుదలచేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. న్యాయం కోసం, ప్రజల కోసం చావడానికైనా సిద్ధమని ఉద్ఘాటించారు. గతంలో చెప్పినట్లు ఇందిరా పార్కువద్ద కాకుండా తన ఇంటిలోనే సోమవారం ఉదయం దీక్ష ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఉల్టా చోర్‌...
రాష్ట్రంలో పరిస్థితులపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు పీజేఆర్‌ చెప్పారు. ''రాష్ట్రం మొత్తం దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. అమాయక ప్రజలు బతకడమే కష్టమైపోయింది. పార్టీకి, ప్రజలకు నష్టం కలుగుతోందని.. పరిస్థితిని చక్కదిద్దాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాను కూడా. ఆయన రౌడీలకే కాదు.. మాకు కూడా ముఖ్యమంత్రే కదా?'' అంటూ ఆగ్రహంగా స్పందించారు. పోలీసులు రెచ్చగొట్టేలా వ్యవహరించారన్నారు. తమ ఫిర్యాదును పోలీసులు తోసిపుచ్చి, కేసు ఎత్తివేయడాన్ని కోర్టులో సవాల్‌ చేయనున్నట్లు తెలిపారు. ''మా ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసును రద్దు చేస్తున్నట్లు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. కమిషనర్‌ పత్రికలకు ప్రకటన విడుదల చేయడంలో ఆంతర్యమేమిటి? ఈ అంశంలో మమ్మల్ని కనీసం విచారించరా? మాకు నోటీసు కూడా ఇవ్వరా? 'ఉల్టా చోర్‌ కొత్వాల్‌ డాంటే' అంటే ఇదే'' అంటూ ఆయన మండిపడ్డారు.

మూడేళ్లుగా భరిస్తున్నా..
''ప్రభుత్వ సలహాదారు కె.వి.పి.రామచంద్రరావు నా కుమారుడిపై 307 సెక్షన్‌ కింద కేసు పెట్టించారు. మేము ఇచ్చిన ఫిర్యాదును పక్కన పెట్టి.. తన సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డిపై కేసు లేకుండా ముఖ్యమంత్రి చేసుకున్నారు'' అంటూ పీజేఆర్‌ తాజా ఆరోపణలు చేశారు. తనను మూడేళ్లుగా ఎన్నో ఇబ్బందులు పెడుతున్నా భరిస్తున్నానని చెప్పుకొచ్చారు.

వాళ్లనలా.. మమ్మల్నిలానా?
''గత ఏడాది ఆగస్టు 22న స్వాతంత్య్ర సమరయోధుడు వందేమాతరం రామచంద్రరావు కుమారుడు ఆదిత్య ప్రతాప్‌ ఇంటికి రాయలసీమ గూండాలొచ్చారు. ఆయన భార్యను కొట్టి, ఆయన్ను తుపాకితో బెదిరించి.. నార్సింగ్‌ వద్ద ఉన్న భూములు అమ్మాలని హెచ్చరించారు. దీనిపై ఆరోజే కేసు పెడితే 307 సెక్షన్‌తోసహా పలు సెక్షన్ల కింద నమోదు చేశారు. రాయలసీమకు చెందిన ప్రతాపరెడ్డి అనే వ్యక్తితోబాటు మరికొందరు ఈ సంఘటనకు బాధ్యులని పోలీసులే తేల్చారు. కానీ నిందితులను మాత్రం ఇప్పటికీ అరెస్టు చేయలేదు. అదే మాపై ఇచ్చిన ఫిర్యాదు విషయంలోనైతే.. అప్పటికప్పుడు అరెస్టు చేసి జైలుకూ పంపేస్తారా'' అంటూ పీజేఆర్‌ సూటిగా ప్రశ్నించారు.

అమ్ముకోవడమే పనా: ''ఔటర్‌ రింగురోడ్డును మూడుసార్లు మార్చారు. పేదల భూములను అతి తక్కువ ధరలకు బలవంతంగా తీసుకుని ప్రభుత్వమే కంపెనీలకు ఎక్కువ ధరలకు అమ్ముకుంటే ఎలా? ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కోసం ఒక్కో ఎకరం రూ.6.5 లక్షలు చొప్పున తీసుకుని ప్రభుత్వం రూ.29 లక్షలకు అమ్ముకుంది. ఆనక ఆ సంస్థవాళ్లేమో వెయ్యి గజాలను పది కోట్లకు అమ్ముకున్నారు'' అని పీజేఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.

నేనే తొలి ఓటు వేస్తా: రాష్ట్రపతి ఎన్నికల్లో తానే మొదటి ఓటు వేస్తానని పీజేఆర్‌ చెప్పారు. ''మాది ధర్మ పోరాటం. దీనికి సైన్యంతో పని లేదు. ధర్మంతోనే పని'' అని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిణామాల ప్రభావం ఎలా ఉంటుందని అడగ్గా 2009 ఎన్నికల్లో తెలుస్తుందన్నారు.

Friday, July 13, 2007

వైఎస్‌ సోదరుడిపై కేసు మూసివేత eenadu

పీజేఆర్‌ భార్యది తప్పుడు ఫిర్యాదు: కమిషనర్‌

పీజేఆర్‌-వైఎస్‌ సోదరుడి కుటుంబాల మధ్య తలెత్తిన వివాదం సరికొత్త మలుపు తిరిగింది. ఒకవైపు తన భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముఖ్యమంత్రి సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డి, ఆయన కుమారుడిపై 307 సెక్షన్‌ కింద కేసు నమోదు చేయాలని పీజేఆర్‌ డిమాండ్‌ చేస్తుండగా.. అసలామె ఇచ్చిన ఫిర్యాదే తప్పని పోలీసులు పేర్కొన్నారు. అందులోని అంశాలు వాస్తవం కాదన్నారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా రవీంద్రనాథ్‌ రెడ్డిపై పెట్టిన కేసును మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ బల్వీందర్‌సింగ్‌ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ''గత ఆదివారం (8న) రాత్రి 9.30కి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పి.జనార్దనరెడ్డి భార్య ఇందిర అలియాస్‌ సులోచన జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. భారీ సంఖ్యలో జనం రాడ్లు, కర్రలు, పదునైన ఆయుధాలతో తమను అడ్డుకున్నారని.. తమపై దాడి చేసి చంపుతామంటూ బెదిరించారన్నవి ఆ ఫిర్యాదులోని ఆరోపణలు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు వై.ఎస్‌.రవీంద్రనాథ్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుకు ప్రతిగా ఈ ఫిర్యాదు చేశారు. సులోచన ఇచ్చిన ఫిర్యాదుపై జూబ్లీహిల్స్‌ పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరిపారు. ఘటనాస్థలిలో, చుట్టపక్కల అనేక మంది సాక్షుల్ని విచారించారు. సమగ్ర విచారణ అనంతరం ఆమె చేసిన ఆరోపణలు వాస్తవంకాదని వెల్లడైంది. అంతేగాక ఘటన జరిగిన చాలా సమయం తర్వాత ఫిర్యాదు చేయడంతో.. అది రవీంద్రనాథ్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుకు ప్రతిగా చేశారని తేలింది. ఈ నేపథ్యంలో సులోచన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రవీంద్రనాథ్‌రెడ్డిపై నమోదుచేసిన కేసును ఎత్తివేస్తున్నాం'' అని బల్వీందర్‌ ప్రకటనలో వివరించారు.

ఆదివారం రాత్రి జరిగిన గొడవకు సంబంధించి ఇరు వర్గీయులూ పోలీసుల్ని ఆశ్రయించడం తెలిసిందే. ఆ ఫిర్యాదుల ఆధారంగా పీజేఆర్‌ తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి, మేనల్లుడు సంతోష్‌రెడ్డిలపై హత్యా యత్నం కేసును నమోదు చేశారు. పీజేఆర్‌ భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రవీంద్రనాథ్‌రెడ్డి, ఆయన కుమారుడు సుమధుర్‌రెడ్డిలపై అటకాయించడం, దాడి తదితర సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఇది వివాదానికి ఆజ్యం పోసింది. రవీంద్రనాథ్‌ రెడ్డి, ఆయన కుమారుడిపై కూడా 307 సెక్షన్‌ (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేయాలని, డీసీపీని సస్పెండ్‌ చేయాలని, నిష్పాక్షిక విచారణ జరిపించాలని పీజేఆర్‌ డిమాండ్‌ చేశారు. ఆ 3 డిమాండ్లపై స్పందించకుంటే.. సోమవారం నుంచి ఆమరణ దీక్షచేస్తాననీ ఆయన హెచ్చరించారు. ఇలాంటి నేపథ్యంలో.. పోలీసులు కేసే ఎత్తేస్తున్నట్లు ప్రకటించడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.

Thursday, July 12, 2007

పీజేఆర్‌కు ఢిల్లీ పిలుపు! eenadu

రేపు మాట్లాడదాం
మేడంతోనూ చర్చిద్దాం
రాజకీయం చేయొద్దని దిగ్విజయ్‌ హితవు
రాష్ట్రంలో వీహెచ్‌ రాజీ యత్నాలు
రెండు కుటుంబాలతోనూ భేటీ
సీఎంతో చర్చ
న్యాయం జరక్కుంటే దీక్ష తప్పదు: పీజేఆర్‌
హైదరాబాద్‌, న్యూఢిల్లీ -న్యూస్‌టుడే
పీజేఆర్‌ ఆమరణ దీక్ష హెచ్చరిక ప్రకంపనలు సృష్టించింది. అధిష్ఠానాన్నీ కదిలించింది. అటు దిగ్విజయ్‌.. ఇటు వీహెచ్‌ రంగంలోకి దిగారు. అధికారికంగా రాజీ యత్నాలు షురూ చేశారు. చర్చల కోసం ఢిల్లీ రావాలని దిగ్విజయ్‌ ఆహ్వానించారు. మేడమ్‌తోనూ మాట్లాడుదురు గాని అంటూ బుజ్జగించే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ సమావేశాల ముంగిట ఇబ్బందికర పరిస్థితిని నివారించే లక్ష్యంతో సాగిన ఈ రాజీ యత్నాలు.. పీజేఆర్‌పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఆయనే మాత్రం రాజీ పడకపోగా... వైఎస్‌ ప్రభుత్వంపై దాడిని మరింత ఉద్ధృతం చేశారు. మరోసారి సర్కారుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆమరణ దీక్షపై వెనక్కి తగ్గేది లేదని కుండబద్దలు కొట్టారు. ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు. వైఎస్‌ సోదరుడూ ఘాటుగానే స్పందించారు. దెబ్బలు తిని కూడా బతికి ఉన్నందుకే తమపై హత్యాయత్నం కేసు పెట్టాలా అంటూ మండిపడ్డారు. దిగజారుడు డిమాండ్లొద్దని పీజేఆర్‌కు హితవు పలికారు.

ఇప్పటిదాకా దాన్నో చిన్నసమస్యగా అభివర్ణించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం గురువారం నేరుగా రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి వైఎస్‌, సీనియర్‌ ఎమ్మెల్యే పి.జనార్దనరెడ్డి కుటుంబాల మధ్య రేగిన చిచ్చు పార్టీకి నష్టం కలిగించనుందని గ్రహించి.. దానికి సత్వరం ముగింపు పలకాలని నిర్ణయించింది. ముఖ్యంగా తన డిమాండ్లను నెరవేర్చకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని పీజేఆర్‌ హెచ్చరించడంతో పరిస్థితి పూర్తిగా చేయి దాటుతోందని అది గ్రహించింది. అదీగాక అసెంబ్లీ సమావేశాలు 16న ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈ వివాదాన్ని ప్రతిపక్షాలు హైజాక్‌చేసే ఆస్కారముందనీ ఆందోళన చెందింది. అదుకే హుటాహుటిన నష్టనివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌ సింగ్‌ గురువారం పీజేఆర్‌తో ఫోనులో మాట్లాడారు. రెండు కుటుంబాల మధ్య వివాదాన్ని రాజకీయం చేయొద్దని ఆయనకు సూచించారు. శనివారంనాడు (14న) ఢిల్లీకొస్తే.. నేరుగా చర్చిద్దామని దిగ్విజయ్‌ సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాతో కూడా మాట్లాడదామని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.
రవీంద్ర సౌమ్యుడు:పీజేఆర్‌తో చర్చించిన తర్వాత దిగ్విజయ్‌ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డి సౌమ్యుడని ఆయన కితాబిచ్చారు. రవీంద్ర ముఖ్యమంత్రికి సోదరుడన్న సంగతి ఆయన నివసించే ప్రాంతంలో చాలా మందికి తెలియదని.. దాన్నిబట్టే ఆయనెలాంటి వ్యక్తో తెలుస్తోందన్నారు. అలాంటి వ్యక్తిపై చిన్న విషయం గురించి దాడిచేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై వైఎస్‌, పీసీసీ అధ్యక్షుడు కేకే, పీజేఆర్‌లతోసహా హైదరాబాద్‌లోని పలువురు పార్టీ నేతలతో మాట్లాడినట్లు తెలిపారు. పోలీసులు తమంతట తామే కేసులు నమోదు చేశారని, నిష్పాక్షికంగా వ్యవహరించారని పేర్కొన్నారు. 307 సెక్షన్‌ (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేయడంపై పీజేఆర్‌ అభ్యంతరం వ్యక్తంచేశారన్నారు. వైద్య పరీక్షల నివేదికలు పరిశీలించి, గాయాలు తీవ్రమైనవి కాకుంటే శిక్ష తగ్గుతుందని వివరించారు.

వైఎస్‌ జోక్యం అవసరంలేదు: ఈ వివాదంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తుందని, ముఖ్యమంత్రి వైఎస్‌ జోక్యం చేసుకోవాల్సిన పనిలేదని లేదని దిగ్విజయ్‌ స్పష్టంచేశారు. వీధి గొడవను రాజకీయ అంశంగా మార్చవద్దని ఆయన సూచించారు. ఈ విషయంలో ఆయన మీడియాను తప్పుపట్టారు. రవీంద్రనాథ్‌కు పీజేఆర్‌ క్షమాణలు చెప్పారని తెలిపారు. ఈ వివాదంలో పలువురు ఎమ్మెల్యేలు పీజేఆర్‌ను సమర్థించడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు కాదా అని అడగ్గా.. రాష్ట్రం నుంచి పూర్తి నివేదిక వచ్చాకే స్పందిస్తానని చెప్పారు. ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం తెలంగాణ అంశంగా ఎలా మారుతుందంటూ ఎద్దేవా చేశారు.

నేనుంటే ఇలా జరిగేది కాదు: ఇటు హైదరాబాద్‌లో సీనియర్‌ నేత వి.హనుమంతరావు రాజీ యత్నాలకు శ్రీకారం చుట్టారు. అమెరికా నుంచి ఆయన గురువారం ఉదయమే హైదరాబాద్‌ చేరుకున్నారు. వచ్చిన కొద్దిగంటల్లోనే పీజేఆర్‌ ఇంటికెళ్లారు. పీజేఆర్‌తోను, ఆయన భార్యతోను, కుమారుడితోను మాట్లాడారు. సంఘటన వివరాలను, తదనంతర పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌ రెడ్డి, ఆయన కుమారుడు సుమధుర్‌రెడ్డి తమపై దాడి జరిగిన తీరును వివరించారు. ఇలా రెండు కుటుంబాల అభిప్రాయాలూ తెలుసుకున్న వీహెచ్‌.. ఆనక సచివాలయానికి వెళ్లి ముఖ్యమంత్రిని సైతం కలసి మాట్లాడారు. జరిగిన వివాదంపై తక్షణం దృష్టిసారించకపోతే పార్టీకి మరింత నష్టం కలుగుతుందని భావించి.. తానే స్వయంగా రంగంలోకి దిగినట్లు వీహెచ్‌ ప్రకటించారు. ఆదివారం తాను హైదరాబాద్‌లో ఉండిఉంటే ఇంతవరకూ వచ్చి ఉండేది కాదన్నారు. ఆరోజే ఎవరైనా మధ్యవర్తిత్వం చేసి ఉంటే సరిపోయేదన్నారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేస్తే పార్టీకి మంచిదని చెప్పారు. చిన్న పిల్లల తగాదా పెద్ద కాకుండా ఉండాల్సిందన్నారు. సీఎంను కలిసిన అనంతరం ఆయన సచివాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ఎలాచేస్తే బాగుంటుందనే అంశంపై సీఎంతో చర్చించినట్లు తెలిపారు. మొదట పీజేఆర్‌ ఆమరణ దీక్షను విరమింపజేయడం.. లేదంటే వాయిదా వేయిస్తే మిగతా అంశాలను పరిష్కరించేందుకు అవకాశముంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్య రెండు మూడు రోజుల్లో సర్దుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. పోలీసుల తీరు గురించి తానేమీ మాట్లాడబోనన్నారు. మొత్తంమీద పీజేఆర్‌ డిమాండ్ల సాధ్యాసాధ్యాలను ఓవైపు పరిశీలిస్తూనే.. మరోవైపు దీక్ష చేపట్టకుండా చూడటమనే లక్ష్యంతో కాంగ్రెస్‌ నేతల రాజీయత్నాలు సాగుతున్నాయి. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా వివాదానికి ముగింపు పలకాలన్నది వారి లక్ష్యం!

కొన్ని గెజిటెడ్‌ పోస్టులకూ 610 eenadu

వంద శాఖాధిపతుల ఆఫీసులకు కూడా
ప్రభుత్వం అంగీకరించింది
ఉత్తమ్‌కుమార్‌ వెల్లడి

నాన్‌ గెజిటెడ్‌ నుంచి గెజిటెడ్‌గా మారిన పోస్టుల్లోనూ 610 అమలు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. 1975 తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ జరిగిన నియామకాలన్నింటినీ సరిచేయాలని నిశ్చయించింది. ఈ జీవోపై ఏర్పాటైన శాసనసభా సంఘం ఛైర్మన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ విషయాలు ప్రకటించారు. సభాసంఘం గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమై, జీవో అమలును సమీక్షించింది. ''అదనంగా సృష్టించిన వంద పైచిలుకు శాఖాధిపతుల కార్యాలయాలను మళ్లీ జోనల్‌ పరిధిలోకి తేవాలి. వాటిలోనూ 610 జీవోను అమలు చేయాలి. దీనిపై ఏమి చర్యలు తీసుకున్నదీ వారంలోగా నివేదిక ఇవ్వాలి. న్యాయశాఖకూ దీన్ని వర్తింపజేయాలి. ఈ జీవోపై కాంగ్రెస్‌ ఎంపీలు హైకోర్టులో వేసిన కేసుకు వ్యతిరేకంగా ప్రభుత్వం గట్టిగా వాదించాలి. 610 సంబంధిత కేసులన్నింటిలోనూ ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ స్వయంగా వాదనలు వినిపించాలి. సభాసంఘం తదుపరి భేటీకి ఆయన కూడా హాజరవ్వాలి. గతంలో రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలో ఉండి, అనంతరం గెజిటెడ్‌గా మారిన పోస్టులకూ ఈ జీవోను వర్తింపజేయాలి. స్వచ్ఛందంగా స్వస్థలాలకు వెళ్లదలచుకున్న స్థానికేతర ఉపాధ్యాయులందరి నుంచీ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించాలి. బదిలీ చేసిన ఉద్యోగులను తక్షణం రిలీవ్‌ చేయాలి'' అంటూ ప్రభుత్వానికి పలు సిఫారసులు చేసింది. సమావేశం తర్వాత ఉత్తమ్‌కుమార్‌ విలేఖరులతో మాట్లాడారు. న్యాయ, ఆదాయపు పన్ను శాఖలు మినహా మిగతా అన్ని శాఖల్లో మొత్తం 6,714 మంది స్థానికేతర ఉద్యోగులను ఇప్పటిదాకా గుర్తించినట్టు చెప్పారు. పోలీసు శాఖలో 2,406 మంది ఉన్నారన్నారు. ''అయితే ఇవి 20 శాతాన్ని స్థానికేతర కోటా (సీలింగ్‌) గా భావించి సేకరించిన వివరాలు. సీలింగ్‌ను తీసేస్తే ఈ సంఖ్య పెరగవచ్చు. కానీ కొన్ని పార్టీలు చెబుతున్నట్టు అది లక్ష దాకా ఉండే అవకాశం మాత్రం లేదు'' అని ఆయన వివరించారు. 5, 6 జోన్లలోని ప్రభుత్వోద్యోగుల స్థానికత వివరాలను త్వరలో వెబ్‌సైట్లో ఉంచి, అభ్యంతరాలను స్వీకరిస్తామని వివరించారు. ఇకనుంచి ప్రభుత్వ రంగ సంస్థల్లో అన్ని నియామకాల్లో 610ని అమలు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని తెలిపారు. విశ్వవిద్యాలయాలకూ వర్తింపజేయాలని తాము సూచించామన్నారు. కాగా 610 అమలులో అధికారులు, ప్రభుత్వం తీరుపై సభాసంఘం సభ్యులు పెదవి విరిచారు. దీన్ని సమగ్రంగా ఆచరణలోకి తేవాలంటూ తామూ కోర్టుకెళ్తామని ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు తెలిపారు. ఇతర సభ్యుల అభిప్రాయాలు వారిమాటల్లోనే..
నాలుగడుగులు వెనక్కి: దేవేందర్‌ గౌడ్‌ (తెదేపా)
610 అమలు రెండడుగులు ముందుకు, నాలుగడుగులు వెనక్కు చందంగా జరుగుతోంది. జీవో అమలు కాకుండా ప్రభుత్వం ప్రతిదానికీ మసిపూసి మారేడుకాయ చేస్తోంది. చివరికి సభాసంఘం పని స్వచ్ఛంద బదిలీలను పర్యవేక్షించే వ్యవహారంగా మారుతోంది. 610 అమలు ఆగకుండా కోర్టులో కెవియట్‌ వేయాలంటే సమాధానం లేదు. అధికారుల్లోనూ అంతా అయోమయం, అస్పష్టత. న్యాయపరంగా చిక్కులున్న అంశాలకు చర్చను పరిమితంచేసి, అర్థరహితంగా మార్చారు.

ముల్కీ అమలు చేయాలి: పీజేఆర్‌ (కాంగ్రెస్‌)
ఈ జీవో సమస్య ఉద్యోగుల పరిధి దాటి ప్రజల దాకా వెళ్లింది. పలు కాలనీల్లో స్థానిక, స్థానికేతర విభేదాలు తలెత్తుతున్నాయి. ఇది నానాటికీ ముదిరి ఇండియా- పాకిస్థాన్‌ గొడవ మాదిరిగా తయారవుతోంది. జీవో అమలులో ఎన్నో చిక్కులు వస్తున్నాయి. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ మాట కూడా వినకుండా మా ఎంపీలు కొందరు దీనిపై కోర్టుకు వెళ్లారు. మరి ప్రభుత్వం, సభాసంఘం, మంత్రివర్గం, వైఎస్‌ ఏం చేస్తున్నట్టు? దీనిపై కెవియట్‌ ఎందుకు వేయడం లేదు? అధికారులను అడిగితే షరామామూలుగా 'ప్రాసెస్‌లో' ఉందంటున్నారు. జీవో స్ఫూర్తికి విరుద్ధంగా తెలంగాణలోనే ఆరో జోన్‌ నుంచి ఐదో జోన్‌కు ఉద్యోగులను బదిలీలు చేస్తున్నారు. అందువల్ల దీనికి బదులు తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నట్టుగా ముల్కీ నిబంధనలను అమలు చేయాలి. దీనిపై వైఎస్‌ ఆలోచించడం మంచిది.

వారే హీరోలూ, విలన్లూ: జూలకంటి రంగారెడ్డి (సీపీఎం)
610 విషయంలో కాంగ్రెస్‌ నేతలే హీరోలుగా, విలన్లుగా వ్యవహరిస్తున్నారు. అమలు చేయాల్సిందేనని కొందరు, అస్సలు కూడదని మరికొందరు వాదిస్తున్నారు. శాఖలవారీగా స్థానికేతర ఉద్యోగుల సంఖ్య, పేర్ల జాబితాను ఈ భేటీలో సమర్పించాలని, ఇంటర్‌నెట్లో కూడా పెట్టాలని క్రితంసారి సూచిస్తే అధికారులు స్పందించలేదు. గిర్‌గ్లానీ సిఫార్సులను పట్టించుకోకుండా ఇష్టంవచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఇలాగైతే ప్రాంతీయ అసమానతలు పెరుగుతాయి.

సమన్వయమేది: హరీశ్‌రావు (తెరాస)
610 అమలులో అధికారుల మధ్య సమన్వయమే లేదు. పాఠశాల విద్యాశాఖలో 20 శాతం పరిమితికి మించిన స్థానికేతరులను మాత్రమే పంపినట్టు విద్యాశాఖ కార్యదర్శి చెప్పారు. ఇది నిబంధనలకు విరుద్ధం. ఆ శాఖలో 518 మందే ఉన్నారని గత భేటీలో, 1,105 మంది ఉన్నారని ఇప్పుడు చెప్పారు. స్థానికత విషయమై ఏ శాఖ నుంచీ పూర్తి సమాచారం లేదు. దిగువ స్థాయి కోర్టుల్లోని స్థానికేతరుల సమాచారం తెప్పించాలని నిర్దేశిస్తే అధికారులు స్పందించలేదు.

రౌడీయిజం నశించేదాకా పోరు eenadu

ఒక వ్యక్తి పేరుతోనే రాష్ట్రంలో గూండాయిజం నడుస్తోంది
ప్రాణాలు పోయినా లెక్కచేయను
గాంధీ మార్గంలో ఉద్యమిస్తా
న్యాయం జరగకుంటే దీక్ష తప్పదు
మా ప్రభుత్వంలో మాకు రక్షణలేదు
నా కుటుంబానికి భద్రత కల్పించాలి: పీజేఆర్‌

రౌడీయిజం నశించే వరకూ తన పోరాటం కొనసాగుతుందని, ఈ ప్రయత్నంలో తన ప్రాణాలుపోయినా లెక్కచేసేదిలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే పి.జనార్దనరెడ్డి స్పష్టం చేశారు. 'రాష్ట్రంలో ప్రస్తుతం ఒక వ్యక్తి పేరు చెప్పుకుని నడుస్తున్న గూండాయిజం పోవాలి' అని అన్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో శాంతిభద్రతలను కాపాడాలన్న డిమాండ్‌తో ఉద్యమిస్తానని అన్నారు. గాంధేయవాద పద్ధతిలో తన పోరాటం ముందుకు సాగుతుందని చెప్పారు. జూబ్లీహిల్స్‌ వివాదంలో ప్రభుత్వం న్యాయం చేయకుంటే సోమవారం నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేపడతానని ప్రకటించిన నేపథ్యంలో... పీజేఆర్‌ గురువారం అసెంబ్లీ వద్ద విలేఖరులతో మాట్లాడారు. 'కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వి.హనుమంతరావు తన ఇంటికి వచ్చి జరిగిన విషయం తెలుసుకున్నారు. నాకు న్యాయం జరిగేవరకూ పోరాటం ఆపేదిలేదని చెప్పాను. ఆయన గాయపడిన నా కుమారుణ్ని పరామర్శించారు' అని పీజేఆర్‌ అన్నారు. అయితే ఎవరి పేరిట గూండాగిరీ నడుస్తోందన్న ప్రశ్నకు మాత్రం పీజేఆర్‌ సమాధానం ఇవ్వలేదు. తెదేపాపై 30 ఏళ్ల పోరాటంలో తాను రక్తం చిందించిన సందర్భాలున్నా... తన భార్య, చెల్లి పోలీస్‌స్టేషన్‌కు ఎప్పుడూ వెళ్లలేదన్నారు. కానీ మొన్నటి గొడవలో వెళ్లాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పశ్చిమ మండలం డీసీపీ మధుసూదన్‌రెడ్డే కారణమనీ, ఆయన్ను తక్షణం సస్పెండ్‌ చేయాలని మరోసారి డిమాండ్‌ చేశారు. 'వస్తావా, లేపి తీసుకెళ్లాలా?' అంటూ తన బంధుమిత్రుల ముందే ఆయన దౌర్జన్యంగా వ్యవహరించారన్నారు. ఎవరో చెప్పిన ప్రకారం మధుసూదన్‌రెడ్డి నడుచుకున్నారని వ్యాఖ్యానించారు. 'పైగా నన్ను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. ఒక ఎమ్మెల్యేనైన నాకే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితేంటి? నన్ను నేనే కాపాడుకోలేకపోతే నియోజకవర్గ ప్రజలనెలా కాపాడుకుంటాను? అందుకే ఈ విషయంలో న్యాయం జరిగే దాకా నిరాహార దీక్ష చేస్తాను' అన్నారు.
జూబ్లీహిల్స్‌లోని తన కుమార్తె అనురాగిణి రెడ్డి ఇంటివద్ద కూడా పీజేఆర్‌ గురువారం విలేఖరులతో మాట్లాడారు. 'మా ప్రభుత్వ పాలనలో మాకే రక్షణ లేకుండా పోయింది' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. జూబ్లీహిల్స్‌ ఘటన జరిగినప్పటినుంచి తనకు, తన కుటుంబానికి రక్షణ కరువైందని, పోలీసులు కూడా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత రెండు రోజులుగా కొందరు అపరిచితులు తన కుమార్తె అనురాగిణిరెడ్డి ఇంటి పరిసరాల్లో అనుమానస్పదంగా తిరుగుతున్నారని చెప్పారు. ఈ విషయం తెలుసుకుని తాను ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. తమ చేతికి మట్టి అంటకుండా తీవ్ర స్థాయిలో నేరాలు చేసే వ్యక్తులు తన కుటుంబ సభ్యులపై దాడికి పథకం వేశారని ఆయన ఆరోపించారు. పశ్చిమ మండల డీసీపీ మధుసూదన్‌రెడ్డిని వెంటనే సస్పెండ్‌ చేయాలని, సీఎం సోదరుడిపై కూడా 307 కేసును నమోదు చేయాలనే డిమాండ్లను పునరుద్ఘాటించారు. తనకు న్యాయం జరగని పక్షంలో ఎన్ని బెదిరింపులు వచ్చినా 16వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేపడతానని హెచ్చరించారు.

పీజేఆర్‌ కుమార్తె ఇంటివద్ద పోలీసు భద్రత
తమ ఇంటి పరిసరాల్లో అనుమానితుల తిరుగుతున్నారని పీజేఆర్‌ అల్లుడు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పీజేఆర్‌ కుమార్తె అనురాగిణి రెడ్డి ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

610 జీవోపై శాసన సభా కమిటీ సమావేశం andhra jyoth

హైదరాబాద్‌, జూలై 12 ః 610 జీవో పై శాసన సభా కమిటీ గురువారం సమావేశమైంది. 610 జీవో అమలు, స్థానికేతరుల బదిలీ తదితర విషయాలపై సమావేశం సమీక్ష నిర్వహించనుంది. కాగా ఈ సమావేశానికి ఆంధ్ర ప్రాంత శాసన సభ్యులు గైర్హాజరయ్యారు. ఈ సమావేశంలో స్థానికేతరుల గుర్తింపు, సరైన విధి విధానాలు, పారదర్శకత తదితర అంశాలు చర్చించే అవకాశం వుంది. జీవో అమలుకు సంబంధించి టిఆర్‌ఎస్‌ శాసన సభ్యుడు హరీష్‌ రావు కోర్టులో పిటీషన్‌ దాఖలు చేయడాన్ని కూడా కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం వున్నట్లు సమాచారం. హౌస్‌ కమిటీ సమావేశం కారణంగా అసెంబ్లీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు

Tuesday, July 10, 2007

ఇది కుటుంబ సమస్య కానేకాదు eenadu

సీఎంకు ఫోన్‌ కూడా చేయాలన్పించలేదా?

ఇంత అమర్యాదగా ప్రవర్తిస్తారా?

క్షమాపణ చెబుతానన్నా కేసులు పెట్టారే

తెదేపా పాలనలోనూ ఇంత దారుణం లేదే

కార్లో కత్తులు పెడతారని భయపడ్డా

ఎమ్మెల్యేలు, మంత్రులతో చర్చిస్తా

భావి కార్యాచరణ నిర్ణయిస్తా: పీజేఆర్‌

ముఖ్యమంత్రి వైఎస్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే పి.జనార్దనరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం ధ్వజమెత్తారు. ప్రస్తుతం కుటుంబ సమస్యో కానే కాదని స్పష్టంచేశారు. భార్య సులోచనమ్మతో కలిసి మంగళవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ''ముఖ్యమంత్రి రాష్ట్రానికే సీఎం. వైఎస్‌ విమానాశ్రయం నుంచి నేరుగా ఆస్పత్రికివెళ్లి సోదరుణ్ని, ఆయన కుమారుడిని పరామర్శించారు. 1978 నుంచి ఎమ్మెల్యేను, పార్టీ కోసం కృషి చేస్తున్నాను.. నాకు కనీసం ఫోన్‌చేసి మాట్లాడాలని కూడా ఆయనకు అనిపించలేదు. ఇంత అన్యాయమా?'' అంటూ మండిపడ్డారు. కనీసం తానో ఎమ్మెల్యేనని కూడా చూడకుండా పోలీసులు అత్యుత్సాహంతో అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించారు. ''నేను హంతకుడినా, క్రిమినల్‌నా, రౌడీషీటర్‌నా? ఎమ్మెల్యేతో పోలీసులు ప్రవర్తించే తీరు ఇదేనా?'' అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్‌, చంద్రబాబులకు వ్యతిరేకంగా తాను పలు కార్యక్రమాలు చేపట్టినా.. ఏనాడూ తనపట్ల ఇంత దారుణంగా వ్యవహరించలేదన్నారు. తన సభా హక్కులకు భంగం కలిగించారనే అంశంపై ఫిర్యాదుచేసేందుకూ ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

నా కొడుకు భవిష్యత్‌ పాడుచేసేందుకే...


కాంగ్రెస్‌కు నష్టం జరక్కుండా చూసేందుకు తాను తీవ్రంగా ప్రయత్నించానని పీజేఆర్‌ పేర్కొన్నారు. ''సంఘటన జరిగిన తర్వాత ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీ అరవిందరావు, ముఖ్యమంత్రి కార్యదర్శి భాను ఇద్దరికీ నేనే స్వయంగా ఫోన్‌ చేసి మాట్లాడాను. జరిగిందేదో జరిగిపోయింది.. నేను క్షమాపణ చెబుతాను. కేసులొద్దని చెప్పాను. కానీ వైఎస్‌ సోదరుడు కేసు పెట్టాలనే పట్టుబట్టినట్లు వారిద్దరూ చెప్పారు'' అని తెలిపారు. ''నా కొడుకు గతమెలాంటిదో చూశారా? అతడేమైనా నేరస్తుడా? ఎవరినైనా కొట్టాడా? భూవివాదాల్లో చిక్కుకున్నాడా? ఎన్‌ఎస్‌యూఐ కోశాధికారి అయిన అతడి భవిష్యత్‌ పాడుచేయాలని ప్రయత్నం చేశారు'' అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. వెస్ట్‌ జోన్‌ డీసీపీ మధుసూదన్‌రెడ్డిని సస్పెండ్‌ చేసి, జరిగిన దానిపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ''డీసీపీ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రవర్తించారు. నేను హోంమంత్రికి కూడా చెప్పాను. అయితే ఆయన్ను మాత్రం ఎంతవరకు నడవనిస్తారు? ఎవరి మాటా వినొద్దనే కదా కడప జిల్లాకు చెందిన ఈ డీసీపీని తెచ్చారు. ఆయన్ను సెంట్రల్‌ జోన్‌ నుంచి వెస్ట్‌జోన్‌కు ఎందుకు తెచ్చుకున్నారో అందరికీ తెలుసు'' అని వ్యాఖ్యానించారు.

మారణాయుధాలు పెడతారని..
''నా భార్యపట్ల మహిళ అనే సానుభూతిని కూడా పోలీసులు చూపలేదు. క్రూరంగా ప్రవర్తించారు. మొదట నా కారును సీజ్‌ చేస్తున్నట్లు చెప్పారు. నేను అంగీకరించలేదు. ఆర్టీఏ ఆఫీసుకు ఫోన్‌ చేసి, కారు నెంబరిచ్చి ఎవరి పేరు మీదుందో క్షణాల్లో తెలుసుకున్నారు. నా కారులో కత్తులు, మారణాయుధాలు పెట్టి.. కేసులు పెడతారని భయపడ్డాం. అందుకే విలేకరుల సమక్షంలో కారు తలుపులు తీసి, పోలీసులకు చూపించా'' అని పీజేఆర్‌ వివరించారు. ''పోలీసుస్టేషన్‌లో 20 గంటలు కాదు.. ఎన్ని రోజులున్నా పోలీసులు వైఎస్‌ సోదరుడిపైనా, ఆయన కుమారుడిపైనా 307 సెక్షన్‌(హత్యాయత్నం) కింద కేసు నమోదు చేయరని నిర్ధారణ అయిన తర్వాతే వెనక్కి వచ్చేశా. స్టేషన్‌ నుంచి వచ్చిన తర్వాతే నా కార్యకర్తలను పోలీసుస్టేషన్ల నుంచి విడుదల చేశారు. హైదరాబాద్‌లో మొత్తం 10 వేల మంది పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసి జైళ్లలో పెట్టారు. నన్ను చూద్దామని వచ్చిన వాళ్లనూ జైళ్లలో ఉంచారు. ఇంతకంటే అన్యాయం ఉంటుందా'' అని మండిపడ్డారు.

ప్రాణ త్యాగానికైనా..
''నా మిత్రులు అయిన ఎమ్మెల్యేలు శశిధర్‌రెడ్డి, శంకరరావు బుధవారం వస్తున్నారు. వీరితోబాటు నా పట్ల సానుభూతి ఉన్న కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా నాతో మాట్లాడుతున్నారు. వారందరితో చర్చించి బుధవారం భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయిస్తా'' అని పీజేఆర్‌ తెలిపారు. ''నేను, నా కుటుంబం నాశనమైనా పర్వాలేదు. నన్ను, పార్టీని నమ్ముకున్నవారికి నష్టం జరగకూడదనేదే నా అభిమతం. ఈ క్రమంలో ప్రాణత్యాగం చేసేందుకూ నేను సిద్ధంగా ఉన్నాను'' అంటూ ఆవేశంగా స్పందించారు. రాజు ఎవరైతే వారిదే కదా శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యతంటూ.. వైఎస్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. ''వైఎస్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నవారిలో నేనూ ఒకడిని. అలాంటిది.. నా కొడుక్కి ఎన్‌ఎస్‌యూఐ పదవి వచ్చాక సీఎంను కలిసేందుకు ఆయన సెక్రటేరియట్‌లో స్వయంగా అపాయింట్‌మెంట్‌ అడిగాం. ఇంత వరకూ టైం ఇవ్వలేదు'' అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.

దత్తాత్రేయ, శ్రీనివాసయాదవ్‌ల రాక

భాజపా నేత బండారు దత్తాత్రేయ, తెదేపా నేత తలసాని శ్రీనివాసయాదవ్‌లు మంగళవారం పీజేఆర్‌ను కలుసుకున్నారు. జరిగిన వివాదం, గత రెండు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలపై పీజేఆర్‌తో వారు చర్చించారు.

పీజే ఆర్‌ తనయుడు విడుదల andhrajyothi

సైదాబాద్‌, జూలై 10 (ఆన్‌లైన్‌): ఖైరతాబాద్‌ శాసనసభ్యుడు పి.జనార్దన్‌రెడ్డి తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి, అల్లుడు సంతోష్‌రెడ్డిలు మంగళవారం సాయంత్రం చంచల్‌గూడ కేంద్ర కారాగారం నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. వీరికి బెయిల్‌ మంజూరైందన్న విషయాన్ని తెలుసుకున్న పీజేఆర్‌ మద్దతుదారులు, ఎన్‌ఎస్‌యుఐ విద్యార్థులు సుమారు 70 వాహనాల్లో భారీ ఎత్తున జైలు వద్దకు తరలివచ్చారు.
బెయిల్‌ మంజూరు పత్రాలు చంచల్‌గూడ జైలు అధికారులకు సాయంత్రం 5.45 గంటలకు అందించారు. వీరిద్దరిని 6.15 నిముషాలకు బయటకు పంపించారు. విష్ణువర్ధన్‌రెడ్డి జైలు గేటు నుంచి బయటకు రాగానే కాంగ్రెస్‌ కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. విష్ణును పూలదండలతో ముంచెత్తారు. నినాదాలు చేస్తూ ఉగ్వేదంతో ఊగిపోయారు. పెద్ద ఎత్తున రోడ్లపై కార్యకర్తలు బాణాసంచా పేల్చడంతో అరగంటపాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్కార్పియో వాహనంపై విష్ణును కూర్చోబెట్టి ఊరేగింపుగా తోడ్కొని వెళ్ళారు.


కక్షకట్టి కేసులో ఇరికించారు...
ప్రభుత్వం తమ కుటుంబంపై కక్షకకట్టి కేసులో ఇరికించారని పిజెఆర్‌ తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. జైలు నుంచి విడుదలైన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తన తల్లిని కారులో తోడ్కొని వెళుతున్న సందర్భంలో అకారణంగా వై ఎస్‌ రవీంద్రరెడ్డి, అతని కుమారుడు, కారులో ఉన్న మరో ఇద్దరు తమను తీవ్ర పదజాలంతో ధూషించి దాడిచేశారని తెలిపారు. తనపై దాడి చేసిన వారిపై బెయిలబుల్‌ కేసు నమోదు చేసి తనపై 307 సెక్షన్‌ కేసు నమోదు చేయడం దారుణమన్నారు. తమకు మద్దతిస్తున్న ప్రజలకు తాము రుణపడి ఉంటామన్నారు.

కెపిహెచ్‌బిలో వినూత్న నిరసన
కెపిహెచ్‌బి కాలనీ, జూలై10 (ఆన్‌లైన్‌) : పిజెఆర్‌ తనయుని విషయంలో న్యాయం తారుమారైందని ఎత్తి చూపుతూ కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డులో పిజెఆర్‌ వర్గీయులు గొట్టిముక్కల దేశాల్‌ ఆధ్వర్యంలో వినూత్నంగా శాంతియుత నిరసనకు దిగారు. చెప్పులు చేతులకు తొడుక్కోవడంతో పాటు కాళ్లకు గడియారాలు ధరించి చొక్కాలను వెనుక వైపునకు వేసుకొని న్యాయం తారుమారైందని ఎత్తి చూపారు. ఇక్కడ వైఎస్‌ దిష్టిబొమ్మకు పూలమాల వేసి శాలువా కప్పి సన్మానించారు
మీడియాలపై విరుచుకు పడడం,అక్రమ కేసులు బనాయించడం లాంటి పనులకు వైఎస్‌ పాల్పడుతున్నాడని ఆయన దిష్టిబొమ్మకు ఈ రకమైన సన్మానం చేసి తమ నిరసన తెలియజేస్తున్నట్లు దేశాల్‌ పేర్కొన్నారు. కూకట్‌పల్లి పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు కర్కె పెంటయ్య,వెంగళరావు, బ్రహ్మానంద్‌రెడ్డి తదితర నాయకులు నిరసన కార్యక్రమానికి విచ్చేసి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ నాయకులు రామాంజన్‌రెడ్డి,కళ్యాణ్‌ చక్రవర్తి,
రాందాస్‌,బాస్కర్‌,రమేష్‌,వెంకట్‌రెడ్డి,బాబు, అంజన్‌కుమార్‌ చౌదరి,టి. ఆర్‌.గౌడ్‌, ఎమ్‌.క్రిష్ణారావు పాల్గొన్నారు.
ఖైరతాబాద్‌లో ఆగని ఆందోళన

యూసుఫ్‌గూడ, జూలై 10 (ఆన్‌లైన్‌): జూబ్లీహిల్స్‌ సంఘటన పై పీజేఆర్‌ అనుచరులు, కాంగ్రెస్‌ నాయకుల, ఎన్‌ఎస్‌యుఐ నాయకుల ఆందోళనలు మంగళవారం కూడా కొనసాగాయి. పోలీసులు వ్యవహరించిన తీరుపై, ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కక్షసాధింపు చర్యలపై ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ నాయకులు చాలాచోట్ల నిరసన ప్రదర్శనలు చేశారు. ఎన్‌ఎస్‌యుఐ నాయకులు సిఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. చాలాచోట్ల కాంగ్రెస్‌ నాయకులు స్వచ్ఛందంగా తమ వ్యాపార సంస్థలను మూసివేశారు. ఎమ్మెల్యే పి. జనార్దన్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యుల పట్ల డిసిపి మధుసూదన్‌రెడ్డి ప్రవర్తించిన తీరుపై కాంగ్రెస్‌ నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ నల్ల జెండాలతో వాహనాల ర్యాలీలు నిర్వహించారు.

కళాశాలల బహిష్కరణ
సంజీవరెడ్డినగర్‌, అమీర్‌పేట, బేగంపేట, దోమల్‌గూడ, నారాయణగూడ తదితర ప్రాంతాలలో పీజేఆర్‌ యువసేన నాయకులతో పాటు ఎన్‌ఎస్‌యుఐ నాయకులు విష్ణువర్ధన్‌ పై పోలీసులు అక్రమ కేసులు పెట్టింనందుకు నిరసనగా కళాశాలలను మూయించివేశారు. దోమల్‌గూడలోని ఎ.వి. కాలేజీ నుంచి ర్యాలీగా బయలుదేరి నిజాం కాలేజీ, నారాయణగూడ ప్రాంతంలోని కళాశాలలను మూయించివేసి ఎస్‌ఆర్‌నగర్‌ చౌరస్తాలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

Monday, July 9, 2007

ఇది ఆటవిక పాలన మా వాళ్ళు జైల్లో... ఆయన ఏసీ గదిలోనా?

మేమేమైనా నక్సలైట్లా... దొంగలమా? నాపై కక్ష ఉంటే నా కుటుంబ సభ్యులు ఏం చేశారు? ప్రాణాలకు ముప్పుందన్నా పోలీసులకు పట్టలేదు తెలుగుదేశం హయాంలోనూ ఇలా జరగలేదు
అన్యాయంపై ప్రజల్లోకి వెళ్తా: పీజేఆర్‌
''రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం హాయాంలో కూడా ఇలాంటివి జరగలేదు, నేనేమైనా నక్సలైట్‌నా? మా వాళ్లు నక్సలైట్లా? లేదంటే మేం దొంగలమా? మా వాళ్లపై లాఠీఛార్జీ చేసి వేర్వేరు జైళ్లలో పెట్టారు. ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనా? కార్యకర్తల తలలే పగలగొడుతారా?'' - పి.జనార్దనరెడ్డి

20 గంటలపాటు పోలీస్‌ స్టేషన్లో పీజేఆర్‌ andhra jyothy

(ఆన్‌లైన్‌, సిటీబ్యూరో) ముఖ్యమంత్రి సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డి, ఆయన కుమారుడు సుమధుర్‌రెడ్డిలతో ఆదివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలో జరిగిన గొడవ అనంతరం ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పీజేఆర్‌ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి, అల్లుడు గిరిసంతోష్‌రెడ్డి లను పోలీసులు అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 8.40గంటల సమయంలో పీజేఆర్‌ తన సతీమణి ఇందిరాదేవి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి అక్కడకు వచ్చారు.
ఇరుపక్షాలు కేసులు పెట్టినందున వై.ఎస్‌ సోదరుడిని కూడా స్టేషన్‌కు తీసుకురావాలని, అందరికీ ఒకే న్యాయం అమలు జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన కు న్యాయం జరిగేంతవరకు కదలబోనని భీష్మిం చిన ఆయన అప్పటినుంచి సోమవారం సాయం త్రం ఐదు గంటల వరకు అక్కడే ఉన్నారు. తమ నాయకుడికి బాసటగా వందలాది మంది కార్యకర్తలు పీజేఆర్‌ వెంటే ఉన్నారు.

తెల్లవారుజామున ఇంటికెళ్లిన ఇందిరాదేవి...

పిీజేఆర్‌తోపాటు రాత్రి మొత్తం పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్న ఇందిరాదేవి ఆరోగ్యం సరిగా లేకపోవటంతో సోమవారం తెల్లవారుజామున ఇంటికి వెళ్లిపోయారు. ఆ తరువాత పశ్చిమ మండలం డీసీపీతోపాటు పలువురు పోలీసు అధికారులు పిీజేఆర్‌ను కూడా వెళ్లిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మీ ఫిర్యాదుపై కూడా తగు చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పటా నికి ప్రయత్నించారు. అయితే పిీజేఆర్‌ మాత్రం పోలీస్‌స్టేషన్‌ నుంచి కదలలేదు. సోమవారం తెల్లవా రుజామున అక్కడే బ్రష్‌ చేసుకున్నారు. మధుమేహం ఉన్న నేపథ్యంలో ఉదయం నాలుగు పూరీలు తిన్న ఆయన మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే చేశారు. కొన్ని పళ్లు తీసుకున్నారు.
అధిష్ఠానం నుంచి ఆదేశాలు అందాయో లేక ఎవరు నచ్చజెప్పారో గానీ సోమవారం సాయంత్రం 5.15గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌ నుంచి ఇంటికి బయల్దేరి వెళ్లారు. స్టేషన్‌ నుంచి బయలుదేరిన సమయంలో అనుచరులు ఆయన వెనుక పది వాహనాలలో వెళ్లారు. అయితే పీజేఆర్‌ నివాసానికి చేరుకునేసరికి ఈ వాహనాల సంఖ్య దాదాపు రెండువందలకు చేరుకుంది. దారి పొడవునా ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పీజేఆర్‌ అనుచరులు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.


నేను నక్సలైట్‌నా? దోపిడీ దొంగనా?: పీజేఆర్‌ andhra jyothy


హైదరాబాద్‌, ఆన్‌లైన్‌ (సిటీబ్యూరో), జూలై 9: 'నేనేమన్నా నక్సలైట్‌నా? లేక దోపిడీ దొంగనా? ఇరవై నాలుగు గంటల పాటు నన్ను పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. మీరు ముఖ్యమంత్రికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. నేను స్థానిక ఎమ్మెల్యేను. అయి నా కనీస మర్యాద లేకుండా వ్యవహరించారు.' అంటూ ఖైర తాబాద్‌ ఎమ్మెల్యే పి.జనార్దనరెడ్డి పోలీసులపై విరుచుకు పడ్డా రు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు జూబ్లీహిల్స్‌ పోలీ స్‌స్టేషన్‌ నుంచి ఇంటికి వెళ్లిపోతూ ఆయన విలేకరులతో మా ట్లాడారు. తాను ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నానని, ప్ర భుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వేలెత్తి చూపుతున్నందుకే ముఖ్యమంత్రి తనపై కక్ష కట్టారని ఆయన ఆరోపించారు.
'నా కూతురు ఇంట్లో శుభ కార్యం జరుగుతున్న విషయం ముఖ్య మంత్రి తమ్ముడైన రవీంద్రనాథ్‌ రెడ్డికి తెలుసు. ఆ ఇల్లు నాకూతురుదన్న విషయం కూడా వారికి తెలుసు. అయినా నా కుమా రుడు కారు పక్కకు జరపలేదన్న కారణంతోనే రవీంద్రనాథ్‌రెడ్డి, అతని కుమారుడు సుమధుర్‌రెడ్డిలు పచ్చిబూతులు తిట్టడంతో పాటు కొట్టడానికి వచ్చారంటే నా కుటుంబంపై వైఎస్‌ కుటుం బానికి ఎంత కక్ష వుందో అర్థమవుతోంది.' అని పీజేఆర్‌ అన్నారు. పైగా తన కుమారుడే దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.
జరిగిన గొడవను సర్దుబాటు చేశానని, చిన్న విషయం కోసం పార్టీ పరువును బజారుకీడ్చరాదని భావించానని పీజేఆర్‌ అన్నారు. అయినా కావాలని రవీంద్రనాథ్‌రెడ్డి తన కొడుకుపై ఫిర్యాదు చేశారని అన్నారు. పై నుంచి వచ్చిన ఒత్తిళ్లతో పోలీసులు అత్యు త్సాహం ప్రదర్శించారని ఆరోపించారు. జరిగిన సంఘటన పై రవీంద్రనాథ్‌రెడ్డి, అతని కుమారుడిని పోలీస్‌ స్టేషన్‌కు రప్పిం చకుండా నన్ను పోలీస్‌ స్టేషన్‌కు రమ్మని ఒత్తిడి చేశారని అన్నారు. తాను రానని చెప్తే చేతులీడ్చి తరలించండి అంటూ డీసీపీ మధుసూదన్‌రెడ్డి సీఐకి ఆదేశాలుజారీ చేశారని అన్నారు. తన కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించి, కావాలనే సెక్షన్‌ 307 కింద కేసు బుక్‌ చేస్తారని ముందే ఊహించానని పీజే ఆర్‌ అన్నారు. ఈ విషయాన్ని పోలీసులకు కూడా ముందే చెప్పానని అన్నారు.
అంతకు ముందు పోలీసులు తన కారును స్టేషన్‌కు తరలించాలని ప్రయత్నించారని, తాను ముందు జాగ్రత్తగానే మీడియా ముందు కారు డిక్కీ తెరిచి ఫోటోలు తీయించానని అన్నారు. తర్వాత పోలీసులు కారు తీసుకుపోవడానికి నిరాకరించారని చెప్పారు. తనపై పథకం ప్రకారమే కుట్ర జరుగుతోందని పీజేఆర్‌ ఆరోపించారు. తనను చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని, తనకు ప్రాణహాని వుందనీ గతంలో అడిషనల్‌ కమిషనర్‌ అరవిందరావుకు, తర్వాత వ చ్చిన పోలీస్‌ కమిషనర్‌ మహంతికి, ప్రస్తుత కమిషనర్‌ బల్వీందర్‌సింగ్‌కు కూడా ఫిర్యాదు చేశానని ఆయన వెల్లడించారు. తనకు వస్తున్న బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వివరాలు, నెంబర్లను పోలీసులకు ఇచ్చానని అన్నా రు. అయినా ఇప్పటి వరకూ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
ఆదివారం జరిగిన సంఘటనలో తన కుమారుడిని అరెస్టుచేసి 307 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారని మరి రవీంద్రనాథ్‌రెడ్డి, అతని కుమా రుడిని ఎందుకు అరెస్టు చేయలేదని పీజేఆర్‌ ప్రశ్నించారు. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడు ఒకవైపు వారినే స్టేషన్‌కు తీసుకొచ్చారంటేనే పైనుంచి ఒత్తిళ్లు వస్తున్నట్టు స్పష్టమవుతోం దని అన్నారు. గొడవ జరిగినప్పుడు స్థానిక ఎమ్మెల్యేనైన నా ఇంటికి రాకుండా, ఏమీ కాని రవీంద్రనాథ్‌ ఇంటికి పోలీస్‌ కమి షనర్‌ వెళ్లి పరామర్శించారని, కేవలం ముఖ్యమంత్రి సోదరు డైనందుకే ఇలా జరిగిందని అన్నారు.
ప్రభుత్వంలోని అధికారుల నుంచి కానీ, పోలీసుల నుంచి తనకు న్యాయం జరగదని స్పష్టమైందని అన్నారు. సంఘటన జరిగిన తర్వాత ఏ మంత్రి కానీ తనను కనీసం పరామర్శించలేదని, పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తన కోసం వచ్చిన వందలాది మంది కార్యకర్తలను కొట్టి పోలీస్‌ స్టేషన్‌లలో పెట్టారని, ప్రజల కోసం పోరాటం చేస్తున్న తనపై అక్రమకేసులు బనాయిస్తున్నారని, కుటుంబ సభ్యుల పై కేసులు పెడుతున్నా రని ఆరోపించారు. న్యాయం కోసం ప్రజల ముందుకే వెళ్తానని పీజేఆర్‌ స్పష్టం చేశారు. భవిష్యత్‌ కార్యాచరణను మంగళవారం ప్రకటిస్తానని అన్నారు.

Sunday, July 8, 2007

పోలీసులు పక్షపాతధోరణితో వ్యవహరిస్తున్నారు: పీజేఆర్‌ eenadu

హైదరాబాద్‌, జులై 9: పీజేఆర్‌ ఇంకా జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్నారు. రవీంద్రరెడ్డి వర్గంపై కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన అక్కడే భీష్మించుకు కూర్చున్నారు. రవీంద్రరెడ్డి, సుమధుర్‌రెడ్డిలపై పోలీసులు 143, 144, 341, 506 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. వారిపై 307 కేసు కూడా నమోదు చేయాలని పీజేఆర్‌ స్టేషన్‌లోనే బైఠాయించారు. వివాదంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును పీజేఆర్‌ తప్పుబట్టారు. వైఎస్‌ సోదరుడు రవీంద్రరెడ్డి ఇంటికి వెళ్లి కమీషనర్‌ పరామర్శించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేనైన తనను పోలీసు స్టేషన్‌లో నిర్భందిచారన్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని ఆయన విమర్శించారు. తెదేపా హయాంలో కూడా తనను పోలీసు స్టేషన్‌లో నిర్భందించలేదని పీజేఆర్‌ చెప్పారు. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. రవీంద్రరెడ్డి వర్గాన్ని అరెస్టు చేసేంతవరకు ఠాణా నుంచి కదిలేది లేదని ఆయన తెలిపారు. పీజేఆర్‌తో డీసీపీలు మధుసూదన్‌రెడ్డి, కమల్‌హాసన్‌ రెడ్డి మంతనాలు జరుపుతున్నారు. పీజేఆర్‌కు మద్దతుగా భారీ ఎత్తున అనుచరులు జూబ్లీహిల్స్‌ స్టేషన్‌ వద్దకు వచ్చారు. పోలీసులు వారిని అరెస్టు చేసి తరలించారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే అన్ని రోడ్లని పోలీసులు మూసేశారు.

పోలీస్‌స్టేషన్‌లోనే పీజేఆర్‌ eenadu

హైదరాబాద్‌, జులై 9: పీజేఆర్‌, వైఎస్‌ వర్గాల ఘర్షణ కారణంగా తలెత్తిన ఉద్ధ్రిక్తత కొనసాగుతూనేఉంది. వైఎస్‌ సోదరుడు రవీంద్రరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పీజేఆర్‌ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి, అల్లుడు సంతోష్‌లపై ఐదు సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. సెక్షన్‌ 147, 307, 427, 506, 149ల కింద వారిపై కేసులు నమోదు చేశారు. వారిద్దరిని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచేందుకు తరలించారు. వైఎస్‌ సోదరుడు రవీంద్రరెడ్డి, ఆయన కుమారుడు అపోలో ఆసుపత్రిలో ఉన్నారు. మరోవైపు తనపై ఎటువంటి ఫిర్యాదు లేకున్నా పీజేఆర్‌ ఇంకా పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్నారు. తామిచ్చిన ఫిర్యాదు ఆధారంగా అవతలి వారిపై ఎందుకు చర్య తీసుకోలేదని ఆయన పోలీసులను ప్రశ్నిస్తున్నారు. రవీంద్రరెడ్డి వర్గంపై కూడా నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేయాలని పీజేఆర్‌ పోలీస్‌స్టేషన్‌లోనే కూర్చున్నారు. పీజేఆర్‌ అనుచరులు భారీ ఎత్తున స్టేషన్‌ వద్దకు చేరుతుండటంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

పీజేఆర్‌ కుమారుడు, అల్లుడుకి 20 వరకు రిమాండ్‌ eenadu

హైదరాబాద్‌, జులై 9: పీజేఆర్‌ కుమారుడు విష్ణువర్ధన్‌ రెడ్డి, అల్లుడు సంతోష్‌ రెడ్డికి నాంపల్లి కోర్టు ఈ నెల 20 వరకూ రిమాండ్‌కు ఆదేశించింది. పోలీసులు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అంతకుముందు పోలీసులు వారిని సికింద్రాబాద్‌ మారేడుపల్లిలోని మూడో అదనపు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. అయితే నేరుగా కోర్టుకే తీసుకెళ్లాలని మేజిస్ట్రేట్‌ సూచించడంతో పోలీసులు వారిని నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు

మూసీ కంపు... సొంపవుతుందా!? andhra jyothy

(ఆన్‌లైన్‌ , సిటీబ్యూరో) చైనాలోని 'ప్యూ అండ్‌ నాన్‌' నది తరహాలోనే మూసీని బాగు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక లు సిద్ధం చేసింది. మూసీ నది తరహాలోనే ఆ నది సైతం కాలుష్యంతో నిండిపోయింది. చైనా ప్రభుత్వం దాన్ని శుద్ధిచేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. కలుషిత నదిని బాగుచేయడంలో చైనా ప్రభుత్వం కనబరిచిన కౌశలాన్ని ప్రపంచ పర్యావరణవేత్తలు ముక్తకంఠంతో ప్రశంసిం చారు. ప్యూ అండ్‌ నాన్‌ మాదిరిగానే భాగ్యనగర చరిత్రతో పెనవేసుకున్న 'మూసీ' నదిని మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది.
లక్ష్య సాధనలో ఇప్పటికే ఆయా శాఖలు తమ పనులు ప్రారంభించాయి. 'మూసీ ఇక కంపు కాదు... సొంపు' అంటూ అధికారులు ప్రకటనలు గుప్పించేశారు. అయితే మూసీ ప్రక్షాళనకు పరిశ్రమల కాలుష్య జలాలు పెద్ద సవాళ్లను సృష్టిస్తున్నాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏమంటే ఆయా ప్రాంతాలల్లో 'సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్స్‌' ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి రసాయన వ్యర్ధాలు మూసీలోకి రావని వారి వాదన. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.
మూసీలోకి పారిశ్రామిక వ్యర్ధజలాలు వివిధ నాలాల గుండా ప్రవహించడం అటుంచితే, ఏకంగా కొన్ని పరిశ్రమల నిర్వాహకులు అత్యంతగాఢత ఉన్న యాసిడ్‌ అవశేషాలను అక్రమంగా మూసీలోకి కుమ్మరిస్తున్న సంఘటనలు తాజాగా కాలుష్య నియంత్రణ మండలి అధికారుల దాడులల్లో వెలుగుచూశాయి. మరో పక్క మహానగర నీటి సరఫరా, సివరేజ్‌ బోర్డు అత్యంత ప్రతిష్టాత్మకంగా 'సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు' నిర్మిస్తోంది. అయితే ఈ ప్లాంట్లు పరిశ్రమల వ్యర్ధజలాలను శుద్ధి చేసేవి కాదు. ఇటువంటి పరిస్థితిలో నిజంగా 'మూసీ సొంపు' అవుతుందా... వెచ్చిస్తున్న కోట్లరూపాయలకు ఫలితం ఉంటుందా... లేదా... అనేది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్న...


ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఇవే...
మూసీలోకి వస్తున్న మురికి నీటిని శుద్ధి చేసేందుకు గాను వాటర్‌ బోర్డ్‌ సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ప్లాంట్స్‌ను 340 కోట్లరుపాయలు ఖర్చు పెట్టి నిర్మిస్తోంది. అంబర్‌పేట్‌, నాగోల్‌, నల్లచెరువు, అత్తాపూర్‌లలో వీటిని నిర్మిస్తున్నారు. వీటి సామర్ధ్యం అంబర్‌పేట్‌లో 339 ఎం ఎల్‌డి(మిలియన్‌ లీటర్స్‌ ఫర్‌ డే) నాగోల్‌లో 172, నల్లచెరువులో 30 , అత్తాపూర్‌లో 51 ఎంఎల్‌డి ఉంది. ఇటువంటి పరిస్థితిలో పరిశ్రమల రసాయన వ్యర్ధజలాల శుద్ధికి ఇక్కడ నిర్మిస్తున్న సివరేజ్‌ట్రీట్‌మెంట్‌ ప్లాంట్స్‌ శక్తి సరిపోదు. అని శాస్త్రీయంగా మాట్లాడితే పరిశ్రమల వ్యర్ధజలాలతో గృహా వ్యర్ధాలను కలపడం ద్వారా వాటి గాఢత తగ్గిస్తాం అని పేర్కొంటున్నారు. వాస్తవానికి రసాయన వ్యర్ధజలాలో ఉండే భారీలోహాలు ఎటువంటి వ్యర్ధాలతో కలిపినా వాటి స్వరూపం మారవన్న భౌతిక శాస్త్ర నియమాన్నే కాదనే అధికారులను చూసి జాలిపడాలో .. ఇటు వంటి అధికారులు చరిత్ర ఆనవాళ్లు ఉన్న మూసీనదికి మంచి రోజులు తెస్తామంటే సంబరపడాలో అర్ధం కావడం లేదు.

610 బదులు మల్కీ కోసం డిమాండ్‌ vaartha

610 అమలు చేయలేకపోయిన కారణంగా ముల్కీ నిబంధనలు అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు, టిఆర్‌ఎస్‌ పేర్కొన్నాయి రాష్ట్రపతి ఉత్తర్వులు కాకుండా అంతకు ముందు ఉన్న ముల్కీ నిబందనలను అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసారు.

వేర్వేరు భేటీలపై గుర్రు eenadu

ఉద్యోగుల మధ్య చిచ్చుకోసమే తెలంగాణ సంఘాల ఆగ్రహం సమావేశం నుంచి సగంలో బయటకు అడిగితేనే ఇలా నిర్వహించాం మరోసారి అలా చేయం: సీఎస్‌

రాష్ట్రంలో 610 జీవో అమలు వ్యవహారం మరో వివాదంలో చిక్కుకుంది. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌, తెలంగాణ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరినారాయణ శనివారం వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడం ఇందుకు కారణం. దీన్ని జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమర్థించగా.. తెలంగాణ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి. సీఎస్‌ ఎదుటే నిరసన తెలిపాయి. వచ్చే సమావేశాన్ని ఉమ్మడిగా నిర్వహించకుంటే తాము హాజరుకాబోమని స్పష్టంచేసి, అర్ధాంతరంగా వెళ్లిపోయాయి. విడివిడిగా చర్చలు జరిపినా, శనివారం కీలక నిర్ణయాలేమీ తీసుకోకపోవడం విశేషం.
గత వారం ఉద్యోగుల సమన్వయ కమిటీ సమావేశం ముగిశాక స్టాఫ్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు సీఎస్‌ను విడిగా కలిశారు. తమకు, తెలంగాణ సంఘాలకు వేర్వేరు సమావేశాలు నిర్వహించాలని కోరారు. దీంతో శనివారం ఉదయం స్టాఫ్‌ కౌన్సిల్‌ ప్రతినిధులతో సీఎస్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీనికి ఏపీ ఎన్జీవో, టీఎన్జీవో నేతలతోపాటు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. విడి భేటీ నిర్వహించినందుకు ప్రతినిధులు సీఎస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై ఇలాగే జరపాలని సూచించారు. 610తో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా వెళ్లేందుకు ముందుకొచ్చే వారందరినీ బదిలీ చేయాలని మరోసారి కోరారు. టీఏ, డీఏలను, సీనియారిటీని అడక్కుండానే వెళ్లడానికి వారు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘంతో, సీఎంతో చర్చించాక దీనిపై నిర్ణయం తీసుకుంటానని సీఎస్‌ హామీ ఇచ్చారు. ప్రభుత్వరంగ సంస్థలపై మార్గదర్శకాలు లేకపోవడంవల్ల అమలు కష్టసాధ్యంగా మారిందని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పగా, త్వరలో వాటిని ఇస్తామని హరినారాయణ అన్నారు. 1975 నుంచి ఉద్యోగుల జాబితా దొరకడం అసాధ్యమని సంఘాలు చెప్పగా, అందుబాటులో ఉన్నవన్నీ సేకరించాల్సిందిగా అన్ని శాఖలను ఆదేశించామన్నారు. స్థానికేతరుల జాబితాపై అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదని సంఘాలు ఫిర్యాదు చేయగా వారి వివరాలను త్వరలో వెబ్‌సైట్‌లో పెడతామని హామీ ఇచ్చారు.
అనంతరం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సంఘాలతో సీఎస్‌ విడిగా సమావేశమయ్యారు. దీనిపై ఆ సంఘాల నేతలు తీవ్ర నిరసన తెలిపారు. ''తెలంగాణ, తెలంగాణేతర సంఘాల మధ్య చిచ్చు పెట్టేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోంది. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను ఉమ్మడిగా చర్చిస్తేనే, ఒకరి అభిప్రాయం మరొకరు తెలుసుకొని, తుదకు ఏకాభిప్రాయం, పరిష్కారం సాధించే వీలుంది. వేర్వేరు సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమిటి? జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌, తెలంగాణ సంఘాలతో ఉమ్మడిగా సమావేశాలు నిర్వహించాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఆదేశాలిచ్చారు. దానిని బేఖాతరు చేయడం మాకు అవమానకరం. దీనికి బాధపడుతున్నాం. ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తాం. స్టాఫ్‌ కౌన్సిల్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే సంఘాలు లేవు. దాంతో సమావేశం జరపడం వల్ల మా ప్రాంతానికి ఒరిగేదేమీ లేదు. వచ్చే సమావేశాన్ని ఉమ్మడిగా నిర్వహించకుంటే మేం హాజరుకాబోం. లేదంటే మాకూ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ హోదా కల్పించాలి'' అని ప్రతినిధులు వాదులాడారు. సంఘాలను తాము వేర్వేరుగా చూడడంలేదని సీఎస్‌ వివరణ ఇచ్చారు. ''స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ప్రత్యేకంగా జరపాలని దాని ప్రతినిధులు కోరడం వల్లే అందుకు అనుమతిచ్చాం. సాయంత్రం సమన్వయ కమిటీ భేటీకి హాజరు కావాలని వారికి సూచించినా ఎవరూ రాలేదు. మరోసారి ఇలా జరగనివ్వం'' అని హరినారాయణ వివరించారు. అనంతరం జీవో అమలుకు తీసుకుంటున్న చర్యల గురించి ఆయన వివరించబోగా... తెలంగాణ నేతలు మధ్యలోనే లేచి వెళ్లిపోయారు.

నేడు రౌండ్‌ టేబుల్‌ భేటీ
కాగా బదిలీలను నిషేధిస్తూ ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వుల పరిధిలోంచి 610 జీవో బదిలీలను ప్రభుత్వం మినహాయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయనుంది. అన్ని శాఖల్లో కాంట్రాక్టు నియామకాల్లో సైతం విధిగా 610ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు ముల్కీ నిబంధనల అమలు కోసం ఆదివారం ఉదయం పది గంటలకు నాంపల్లిలోని మదీనా ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 610 అమలులో ప్రభుత్వం విఫలమైందని, ఆరు సూత్రాలలో అయిదింటిని ఇప్పటికీ అమలు చేయకపోవడం వల్లనే.. ముల్కీ నిబంధనలు అమలు చేసి, తెలంగాణ మొత్తాన్ని ఒక జోన్‌గా పరిగణించాలని కోరుతున్నామని చెప్పారు.

Friday, July 6, 2007

610 బదిలీలపై ఎల్లుండి హైకోర్టులో పిటిషన్‌ eenadu

ముల్కీ కాలం చెల్లిపోయింది రాష్ట్రపతి ఉత్తర్వులను 2007 నుంచి అమలు చేయాలి హరిరామజోగయ్య వ్యాఖ్యలు

ముల్కీ కాలం చెల్లిపోయిందని, దాన్ని 1975లోనే రద్దు చేసి ఆరు సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారని ఎంపీ హరిరామజోగయ్య వ్యాఖ్యానించారు. అసలు ముల్కీ విధానమే సరైంది కాదని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ''1975లో తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు అమలు చేయాలనడం సరికాదు. నాడు స్థానికేతరులుగా ఉద్యోగాల్లో చేరిన సిబ్బంది ఇప్పుడు స్థానికులు అయిపోయారు. అందువల్ల వారిని బదిలీ చేయాలనడం న్యాయ సమ్మతం కాదు'' అని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి ఉత్తర్వులను 2007 నుంచి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సిబ్బందిని స్థానికేతరుల పేరుతో ప్రభుత్వం బదిలీ చేస్తోందని, దీనికి వ్యతిరేకంగా తాను, ఎంపీ హర్షకుమార్‌ సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తామని ఆయన వెల్లడించారు. ''రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల ఆంధ్ర ప్రాంత ఉద్యోగులకు అన్యాయం జరుగుతోంది. సర్కారు ఉత్తర్వులకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం కానేకాదు. ప్రభుత్వాన్ని సరైన దారిలో నడిపించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులుగా మాపై ఉంది. ఆంధ్ర ప్రాంతంలో పార్టీని రక్షించుకునే చర్యల్లో భాగంగానే నేను జీవో అమలును వ్యతిరేకిస్తున్నాను'' అని ఆయన వివరించారు. కేవలం కొందరి ఒత్తిళ్ల వల్లే వైఎస్‌ 610 జీవోను అమలు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ''బదిలీ చేస్తున్న ఉద్యోగులను ఆంధ్ర ప్రాంతంలోని ఖాళీల్లోనూ, సూపర్‌ న్యూమరరీ పోస్టుల్లోనూ నియమిస్తే అక్కడ మా వాళ్లకు ఉద్యోగావకాశాలు తగ్గుతాయి. అందువల్ల బదిలీ అయ్యే వారికి ఇక్కడే సూపర్‌ న్యూమరరీ పోస్టులు ఏర్పాటు చేయాలి. ఆంధ్ర ప్రాంతంలో ఖాళీగా ఉన్న పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేయాలి'' అని ఆయన డిమాండ్‌ చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఇరు ప్రాంతాల నేతలను పిలిచి దీనిపై చర్చించాల్సి ఉందని జోగయ్య అభిప్రాయపడ్డారు.

610పై మరో రగడ eenadu

పాఠశాల విద్యాశాఖలో తాజా వివాదం
43ని సవరిస్తూ కొత్త జీవో
కలెక్టర్లకు పోస్టింగ్‌ అధికారం
కోర్టుకెక్కనున్న ప్రభుత్వ టీచర్లు
రాష్ట్రపతి దృష్టికి వివాదం
టీఆర్‌టీయూకు అందిన పిలుపు
ఏకీకృత సర్వీసుకు ఎసరు!
పాఠశాల విద్యాశాఖలో స్థానికేతర ఉపాధ్యాయుల బదిలీపై మరో వివాదం చెలరేగింది. 610 అమలు కోసం ఇచ్చిన జీవో 43లో కొన్ని సవరణలు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో 45ను జారీ చేసింది. ఇందులో డీఈవో, సీఈవోలకు బదులుగా జిల్లా కలెక్టర్లకు పోస్టింగు అధికారాలివ్వడం వివాదాస్పదమైంది. ఇది అటు తిరిగి, ఇటు తిరిగి ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసుకే ఎసరు పెట్టే ప్రమాదం కనిపిస్తోంది. తాజా జీవో హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకమని ప్రభుత్వ టీచర్ల సంఘం ఆరోపించింది. ''గతంలో జారీ చేసిన 529 జీవో ఉపాధ్యాయుల నియామక అధికారి డీఈవో అని చెప్పింది. కానీ తాజా జీవోలో ఈ అధికారాలను కలెక్టర్‌కు అప్పగించారు. ఇది సమస్యగా మారనుంది'' అని నిపుణులు అంటున్నారు. ఇదే వాదనతో పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు అప్పుడే కోర్టుకు వెళ్లే ప్రయత్నాల్లో పడ్డారు. ప్రస్తుతం 610 ప్రకారం స్వచ్ఛంద బదిలీలు మాత్రమే జరుగుతున్నాయి. ఒకవేళ భవిష్యత్తులో నిర్బంధ బదిలీలు చేసినా... కలెక్టర్లకే నియామకాల అధికారాన్ని ఇస్తూ జీవో ఇవ్వాల్సి ఉంటుంది. అలా బదిలీ అయ్యేవారు కోర్టును ఆశ్రయించే అవకాశం, ఫలితంగా 610/రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు సందిగ్ధంలో పడే వీలు కనిపిస్తున్నాయి. ఏకీకృత సర్వీసు కోసం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వ యత్నాలకు ఇది గండికొట్టే అవకాశం ఉంది.
610 అమలుకై జారీ చేసిన జీవో 43లో పేర్కొన్న అంశాలు ఉపాధ్యాయుల వేర్వేరు సర్వీస్‌ను సూచిస్తున్నాయని, ఇది ఇన్నాళ్ల తమ పోరాటానికి గండి కొడుతుందంటూ ఉపాధ్యాయ సంఘాల సంయుక్త పోరాట సమితి (జాక్టో) ఆందోళనకు దిగింది. ముఖ్యమంత్రినీ కలిసి ఈ జీవోను సవరించాలని కోరింది. కానీ ఇలా చేస్తే మరిన్ని ఇబ్బందులు వస్తాయంటూ సంబంధిత మంత్రి దామోదర రాజనర్సింహతోపాటు న్యాయ విభాగం, ఉన్నతాధికారులు అభ్యంతరపెట్టారు. అయినా జాక్టో ఒత్తిడితో, ముఖ్యమంత్రి ఆదేశాలతో సవరణ జీవో జారీ అయింది. ఈ జీవో పట్ల న్యాయవిభాగం అసంతృప్తితో ఉంది. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఏకీకృతానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని జాక్టో నేతలు గురువారం ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన తీరు... ఇన్నాళ్లూ కాస్తో కూస్తో సానుకూలంగా దీనికై యత్నించిన అధికార వర్గాల్నీ, మంత్రినీ తీవ్ర నిరుత్సాహంలో పడేసింది.
ఢిల్లీ పయనమూ ప్రశ్నే
ఈనెల 9న ఢిల్లీకి మూకుమ్మడిగా వెళ్లి ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు కోసం ప్రయత్నాలు చేయాలనేది ఇటీవల తీసుకున్న నిర్ణయం. కానీ కేంద్రం వ్యక్తీకరించిన సందేహాలకు ఇప్పటికీ రాష్ట్రం సమాధానాలను పంపించలేదు. ఆ ఫైల్‌ ఢిల్లీ చేరక ముందే వెళ్లి ఏం చేయాలనే ప్రశ్న తాజాగా తలెత్తింది. అందుకని 9న ఢిల్లీలో ఎంపీలందరూ ఉండటం లేదనే సాకుతో ప్రయాణాన్ని వాయిదా వేయనున్నట్లు తెలిసింది. కేంద్రానికి సమాధానాలు ఏమని పంపాలో అర్థం గాక ఉన్నతాధికారులు తలలు పట్టుకున్నారు. ఇంకోవైపు సుప్రీంకోర్టులో అదనపు పిటిషన్‌ వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం భావించినా... అది మరిన్ని చిక్కులకు దారితీయవచ్చునని న్యాయవాదులు హెచ్చరించడంతో ఆ ప్రయత్నమూ వాయిదా పడినట్లు సమాచారం. ''ఈ స్థితిలో ఢిల్లీ వెళ్లి ఏం చేస్తాం?'' అని ఓ నేత ప్రశ్నించారు.
రాష్ట్రపతి రమ్మన్నారు!
ఏకీకృత సర్వీస్‌ కోసం రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు తీసుకొచ్చే ప్రతిపాదన భవిష్యత్తులో తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు ప్రమాదకరం అయ్యే అవకాశాలున్నాయని వాదిస్తున్న టీఆర్‌టీయూ ఈసారి ఏకంగా రాష్ట్రపతినే కలిసి తన వాదనను వినిపించడానికి తయారవుతోంది. ఈ మేరకు రాష్ట్రపతికి అపాయింట్‌మెంట్‌ కోసం దరఖాస్తు పెట్టుకోగా, ఆయన ఈనెల 16న రావాలంటూ సమ్మతి తెలిపారు. ''రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలోని కనీసం అయిదు అంశాలు రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తిని నిండా ముంచేస్తాయి. అదే రాష్ట్రపతికి వివరిస్తాం'' అని టీఆర్‌టీయూ చెబుతోంది. వెరసి 610 అమలు వ్యవహారంతో ఏకీకృత వివాదం ముదిరి పాకానపడుతోంది!

610 జీఓపై అనవసర రాద్ధాంతం eenadu

హైదరాబాద్‌, జులై 6 : 610 జీఓపై ఆంధ్ర నాయకులు చేస్తున్న ప్రకటనలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయని రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌కు పాల్వాయి గోవర్థనరెడ్డి ఫిర్యాదు చేశారు. పీసీసీ కూడా దీనికి వంతపాడటం తెలంగాణాలి,ా్‌్‌X

నెలాఖర్లోగా జాబితా eenadu

20% ఓపెన్‌ కేటగిరిగా పరిగణించాలి
1975 నుంచీ నియామకాల పరిశీలన
సత్వరమే డెప్యుటేషన్ల రద్దు
610పై హరినారాయణ ఆదేశాలు
రికార్డుల్లేవన్న అధికారులు
మరో 70 మంది కానిస్టేబుళ్ల బదిలీ

రాష్ట్రంలో 610 జీవో అమలు కోసం... 1975 నుంచీ జరిగిన నియామకాలను పరిశీలించి, అందులో స్థానికేతరుల జాబితాను నెలాఖరుకు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జె.హరినారాయణ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. డెప్యుటేషన్లను వెంటనే రద్దు చేసి, ఆయా అభ్యర్థులను వారి సొంత ప్రాంతాలకు పంపించాలన్నారు. 610 జీవో అమలుపై గురువారం ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అన్ని శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ''610ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యాంశంగాపరిగణిస్తోంది. దీని అమలుకు అందరూ ప్రత్యేక శ్రద్ధ చూపాలి. 1975 నుంచీ జరిగిన నియామకాల్లో జిల్లా స్థాయి పోస్టుల్లో 20 శాతాన్ని ఓపెన్‌ కోటా కింద పరిగణించి అవి మెరిట్‌ అభ్యర్థులతో భర్తీ అయ్యాయా, లేదా అనేది పరిశీలించాలి. మిగతా 80 శాతం స్థానిక అభ్యర్థులతో భర్తీ అయ్యాయా, లేదా చూడాలి. ఓపెన్‌ కేటగిరీ స్థానికేతరుల కేటగిరీ అనే భావన ఉంటే దానిని మీ మనసులోంచి తొలగించండి'' అంటూ ఉద్బోధించారు. జోనల్‌, కొన్ని గెజిటెడ్‌ పోస్టుల భర్తీ 30:70, 40:60 ప్రాతిపదికగా జరిగిందీ, లేనిదీ పరిశీలించాలన్నారు. ''1975 నుంచి విద్య, వైద్య, పోలీసు శాఖల్లో దాదాపు ప్రతి ఏటా నియామకాలు జరిగాయి. ఇతర శాఖల్లో 8 నుంచి 9 దఫాల నియామకాలు జరిపారు. కొన్ని నియామకాల్లో ఓపెన్‌ కేటగిరీని స్థానికేతరుల కోటాగా పరిగణించి నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలను భర్తీ చేశారు. అలాంటివారిని గుర్తించి సొంత జిల్లాలకు పంపాల్సిఉంది'' అని చెప్పారు.
గెజిటెడ్‌ కేటగిరీలో
స్థానికులకు కేటాయించిన పోస్టుల్లో ఇతర ప్రాంతాల వారిని డెప్యుటేషన్‌పై నియమించడం అక్రమమంటూ, వారిని వెంటనే వెనక్కి పంపాలని హరినారాయణ ఆదేశించారు. కొన్ని గెజిటెడ్‌ పోస్టుల విషయంలో సంబంధిత అధికారులు పనిచేసే పోస్టు స్థానిక కేటగిరీలోనిది అయితేనే ఈ ఆదేశాలను అమలు చేయాలని సూచించారు. ఆ పోస్టు ఓపెన్‌ లేదా రాష్ట్రస్థాయి కేటగిరి పరిధిలోనిది అయితే మినహాయించాలని ఆయన అన్నట్లు తెలిసింది. జీవో అమలుకు సంబంధించి మరికొన్ని మార్గదర్శకాలను మరో మూడు రోజుల్లో జారీ చేస్తామని ఆయన చెప్పారు.
రికార్డులుంటేగా?
1975 నుంచి ఉద్యోగ నియామాలకు సంబంధించి రికార్డులు అందుబాటులో లేవంటూ ఈ సందర్భంగా పలు శాఖల అధికారులు హరినారాయణకు వివరించారు. పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌ గౌతంకుమార్‌ మాట్లాడుతూ... గడిచిన నాలుగైదు దఫాలవి మినహాయిస్తే ఇతర నియామకాలకు సంబంధించిన రికార్డులు తమ వద్ద లేవని వివరించినట్లు తెలిసింది. జిల్లా స్థాయిలో జరిగిన నియామకాలకు సంబంధించి రికార్డులు సేకరించడం కష్టమని ఆయన పేర్కొన్నారు. మరికొన్ని శాఖల అధికారులు కూడా ఇదే విధమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై సీఎస్‌ స్పందిస్తూ... అందుబాటులో ఉన్న వివరాలను పరిగణనలోనికి తీసుకొని జాబితాలు రూపొందించాలని సూచించారు.
మరిన్ని బదిలీలు
610 జీవో అమలులో భాగంగా స్వస్థలాలకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్న మరో 70 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ బల్వీందర్‌ సింగ్‌ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కమిషనరేట్‌ నుంచి రెండు దఫాలుగా 248 మంది కానిస్టేబుళ్లు బదిలీ అయ్యారు.
డెప్యుటేషన్లలో ఆర్మీ, నేవీలకు మినహాయింపు
కారుణ్య పోస్టులకూ 610 వర్తింపు
కారుణ్య, మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌ (ఆరోగ్యపరమైన అనర్హత) కేటగిరీ నియామకాలకు సంబంధించి కూడా 610 జీవోను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే డెప్యుటేషన్ల రద్దులో ఆర్మీ, నేవీ ఉద్యోగులకు మాత్రం మినహాయింపు ఇవ్వాలని తీర్మానించింది. గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరినారాయణ ఈ మేరకు సంకేతాలను అందించారు. ''దేశానికి సేవలందిస్తున్న ఆర్మీ, నేవీ ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరిస్తాం. హైదరాబాద్‌లో పనిచేస్తున్న వారి జీవిత భాగస్వాముల విషయమై ప్రత్యేక జాబితాను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలి. దానికి అనుగుణంగా తగిన ఉత్తర్వులు జారీ చేస్తాం'' అని చెప్పారు. కారుణ్య, మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌ విభాగాల్లో జరిగిన నియామకాల గురించి ప్రస్తావిస్తూ... వాటినీ స్థానిక, స్థానికేతర కేటగిరీగా విభజించి ప్రత్యేక జాబితా రూపొందించాలని ఆయన ఆదేశించారు. వాటిపైనా త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు.

Wednesday, July 4, 2007

నా వ్యాఖ్యాల్ని వక్రీకరిస్తున్నారు: లగడపాటి andhra jyothi

విజయవాడ, జూలై 4 (ఆన్‌లైన్‌): రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధ్దికోసం ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య విద్వేషా లను పెంచడానికి ప్రయత్నిస్తుండడం సబబుకాదని విజయవాడ పార్లమెంట్‌ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. 610 జీవో అమలు విషయంలో ఇటీవల రాజ గోపాల్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తెలంగాణ నాయకులు రాజగోపాల్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపధ్యంలో బుధవారం ఆయన ఒక ప్రకటన చేస్తూ, తనపై వ్యాఖ్యలు చేస్తున్న నాయకులను తీవ్రంగా విమర్శించారు.
వివిధ జిల్లాలోని ప్రజలను రెచ్చగొడుతూ, ఈ సమస్యను ఇండియా-పాకిస్థాన్‌ మధ్య ఉన్న సమస్య లా చీత్రీకరించడం తగదన్న ఉద్దేశంతోనే తాను కొన్ని వ్యా ఖ్యలు చేసినట్లు తెలిపారు. అయితే కొందరు ఉద్దేశపూర్వ కంగా వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. మనదేశ సంస్కృతి, తెలుగు సంస్కృతికి విరుద్ధంగా విధి విధానాలకు దూరంగా ప్రజలను తీసుకువెళ్లి, వారిని రెచ్చ గొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడం ఎంతవరకు సబబో చెప్పాలన్నారు. ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఇంకొక ప్రాంతానికి చెందిన వ్యక్తులను దూషించడం తగదని చెప్పారు.
ఆంధ్రా-తెలంగాణ ప్రాంతాలను పాకిస్థాన్‌- భారత్‌ సమస్యతో పోల్చడాన్ని దయచేసి వక్రీకరించవద్దని రాజగోపాల్‌ విజ్ఞప్తి చేశారు. శాంతికి, సహజీవనానికి భం గం కలిగించకూడదన్నదే తన తపన అన్నారు. కొంతమం ది రాజకీయ నాయకులు ప్రజల మధ్య లేనిపోని అపోహ లు సృష్టించి అవగాహన లేమితో మాట్లాడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. కొన్ని జిల్లాలలో స్థానికేతరులలో కూడా ముఖ్యంగా టీచర్లు 20 శాతం మంది సొంత ప్రాం తాలకు వెళ్ళేందుకు దరఖాస్తు చేసుకున్నారని, వీరంతా వెళ్ళిపోతే ప్రభుత్వం కొత్తగా సిబ్బందిని నియమించుకో వాల్సి వస్తుందన్నారు.
సిబ్బందిని కొత్తగా నియమించడానికి కనీసం ఒక ఏడాది పడితే ఈ లోపల విద్యార్థుల భవి ష్యత్‌ ఏమిటన్న ఉద్దేశంతోనే తాను మాట్లాడినట్లు స్పష్టం చేశారు. తెలంగాణలో చదువు చెప్పేవారు దొరకరని అన డం వాస్తవం కాదన్నారు. కొంతమంది నేతలు తాను అహంకారంతో మాట్లాడానని వక్రీకరించడం విచారకర మని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ ఏ ప్రాంతానికి, ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్నారు. కుల, మత, ప్రాంతీయ విభేదాలకు వ్యతిరేకినని స్పష్టం చేశారు. తెలుగు సంస్కృ తి, దేశ సంస్కృతిని కాపాడడంతో బాటు సంస్కారం, సభ్యతలను పాటిస్తూ ర్రాష్టాన్ని, దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్నదే తన అభిమతమని చెప్పారు.

జీవో 43ను రద్దు చేయాలి andhrajyothy

హైదరాబాద్‌, జూలై 4 (ఆన్‌లైన్‌): స్థానికేతర టీచర్లను సొంత జిల్లాలకు పంపించే ప్రక్రియలో భాగంగా పాఠశాల విద్యా శాఖ జారీ చేసిన జీవో 43ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పీఆర్‌టీయూ నేతలు బుధవారంనాడిక్కడ పాఠశాల విద్యా డైరెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయ సిబ్బంది లోపలికి వెళ్ళకుండా అడ్డుకొని,పాఠశాల విద్యా డైరెక్టర్‌ బాలసుబ్రహ్మణ్యాన్ని ఘెరావ్‌ చేశారు. దీంతో పోలీసులు ఎంఎల్‌సీలు మోహన్‌రెడ్డి, సుధాకరరెడ్డి, శ్రీనివాసులు నాయుడు, పీఆర్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట రెడ్డి, రవికిరణ్‌లతో సహా పలువురిని అరెస్టు చేసి తర్వాత సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు.

అంతకు ముందు మోహన్‌రెడ్డి, వెంకటరెడ్డిలు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ కార్యాలయానికి వెళ్ళి ధర్నా నిర్వహించారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదలకోసం పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సీబీ ఎస్‌ వెంకటరమణ, డైరెక్టర్‌ బాలసుబ్రహ్మణ్యం అక్కడకు వస్తారని ఉపాధ్యాయ నేతలు భావించారు. అయితే, ఉన్నతాధికారులిద్దరూ పాఠ్య పుస్తకాల సరఫరాపై డీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించే పేరిట పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదల కార్యక్రమానికి హాజరు కాలేదు.

దీంతో నేతలంతా పాఠశాల విద్యా డైరెక్టరేట్‌ చేరుకొని, అక్కడ డైరెక్టర్‌ను ఘెరావ్‌ చేయడంతో అరెస్టులు జరిగాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలనుంచి సొంత జిల్లాలకు బదిలీ అయినవారిలో పంచాయతీరాజ్‌ టీచర్లకు జిల్లా పరిషత్‌ సీఈఓలు, ప్రభుత్వ టీచర్లకు డీఈఓలు పోస్టింగ్‌ ఉత్తర్వులు ఇవ్వాలని జీవో 43లో నిర్దేశించడం వివాదాస్పదమైంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ఈ నెల 17వ తేదీన చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

స్వచ్ఛందానికి స్పందన కరవు eenadu

20 శాఖల్లో 802 మంది బదిలీ
55 శాఖల్లో ఒక్క ఉత్తర్వూ జారీ కాలేదు
రాష్ట్రంలో 610 జీవో అమల్లో భాగంగా స్వచ్ఛంద బదిలీలకు గడువు పెంచినా ఆశించిన స్పందన లేదు. 7వేల మందికి పైగా స్థానికేతరులను గుర్తించినప్పటికీ ఇప్పటిదాకా 802 మందికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు 1975 నుంచీ ఉన్న స్థానికేతర ఉద్యోగుల జాబితా గుర్తింపు ప్రక్రియపై సవాలక్ష సందేహాలు తలెత్తటంతో ఏ ఒక్క శాఖలోనూ దీన్ని ప్రారంభించలేదు. పదిహేను రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినా నత్తనడకన సాగుగుతోంది. చాలా శాఖలు పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం... గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని నిర్ణయించింది.

స్వచ్ఛంద బదిలీలకు దరఖాస్తుల స్వీకరణ గతనెల రెండో వారం నుంచి మొదలయింది. 27 నుంచి ఉత్తర్వులివ్వడం మొదలుపెట్టారు. బుధవారం వరకూ 20 శాఖల నుంచే బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పోలీసు, విద్యా శాఖలు జారీ చేసిన ఉత్తర్వులపై వివాదాలు నెలకొని బదిలీలు నిలిచిపోయాయి. సాంఘిక సంక్షేమ, వ్యవసాయ, పశు సంవర్థక, నీటిపారుదల, రెవెన్యూ, రవాణా- రోడ్లు- భవనాలు, యువజన సంక్షేమం, పరిశ్రమలు, కార్మిక, ఉన్నత విద్య, ఆర్థిక, ఇంధన, పురపాలక, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పౌర సరఫరాలు, జీఏడీ, ప్రణాళిక శాఖల నుంచి 573 మందికే ఉత్తర్వులిచ్చారు. స్వచ్ఛంద బదిలీలకు ఈ నెల 16 వరకే గడువును నిర్దేశిస్తూ మూడురోజుల క్రితం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత కేవలం నాలుగు శాఖల నుంచే ఉత్తర్వులు ఇచ్చారు. మొత్తం 75 శాఖలకు గాను ఇంకా 55 శాఖల నుంచి ఒక్క ఉత్తర్వు జారీ గాకపోవడం సాధారణ పరిపాలన వర్గాల్లో విస్మయం కలిగించింది. సీఎం నిర్దేశించిన గడువుకు మరో పది రోజులే ఉండగా ఈ లోపే అన్ని శాఖల నుంచి ఉత్తర్వులు జారీ చేయించాలనే ఉద్దేశంతో సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహణకు పూనుకున్నారు. మరోవైపు 1975 నుంచి స్థానికేతరుల గుర్తింపు ప్రక్రియకు ఉత్తర్వులు ఇచ్చినా ఇది ఎక్కడా జరగలేదు. కొన్ని శాఖలు తమ వద్ద జాబితాలు లేవని చెప్పగా, మరికొందరు మార్గదర్శకాలపై సందేహాలు వ్యక్తంచేశారు.
ముల్కీ నిబంధనల్ని పునరుద్ధరించాలి : ఆరు సూత్రాల పథకంలో మొదటి ఐదు నిర్వీర్యమయినందున చివరి సూత్రంలో చెప్పినట్లు ముల్కీ నిబంధనల్ని పునరుద్ధరించి, తెలంగాణ ప్రాంతం మొత్తాన్ని ఒకే జోన్‌గా పరిగణించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం డిమాండ్‌ చేసింది.