Monday, July 9, 2007

నేను నక్సలైట్‌నా? దోపిడీ దొంగనా?: పీజేఆర్‌ andhra jyothy


హైదరాబాద్‌, ఆన్‌లైన్‌ (సిటీబ్యూరో), జూలై 9: 'నేనేమన్నా నక్సలైట్‌నా? లేక దోపిడీ దొంగనా? ఇరవై నాలుగు గంటల పాటు నన్ను పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. మీరు ముఖ్యమంత్రికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. నేను స్థానిక ఎమ్మెల్యేను. అయి నా కనీస మర్యాద లేకుండా వ్యవహరించారు.' అంటూ ఖైర తాబాద్‌ ఎమ్మెల్యే పి.జనార్దనరెడ్డి పోలీసులపై విరుచుకు పడ్డా రు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు జూబ్లీహిల్స్‌ పోలీ స్‌స్టేషన్‌ నుంచి ఇంటికి వెళ్లిపోతూ ఆయన విలేకరులతో మా ట్లాడారు. తాను ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నానని, ప్ర భుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వేలెత్తి చూపుతున్నందుకే ముఖ్యమంత్రి తనపై కక్ష కట్టారని ఆయన ఆరోపించారు.
'నా కూతురు ఇంట్లో శుభ కార్యం జరుగుతున్న విషయం ముఖ్య మంత్రి తమ్ముడైన రవీంద్రనాథ్‌ రెడ్డికి తెలుసు. ఆ ఇల్లు నాకూతురుదన్న విషయం కూడా వారికి తెలుసు. అయినా నా కుమా రుడు కారు పక్కకు జరపలేదన్న కారణంతోనే రవీంద్రనాథ్‌రెడ్డి, అతని కుమారుడు సుమధుర్‌రెడ్డిలు పచ్చిబూతులు తిట్టడంతో పాటు కొట్టడానికి వచ్చారంటే నా కుటుంబంపై వైఎస్‌ కుటుం బానికి ఎంత కక్ష వుందో అర్థమవుతోంది.' అని పీజేఆర్‌ అన్నారు. పైగా తన కుమారుడే దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.
జరిగిన గొడవను సర్దుబాటు చేశానని, చిన్న విషయం కోసం పార్టీ పరువును బజారుకీడ్చరాదని భావించానని పీజేఆర్‌ అన్నారు. అయినా కావాలని రవీంద్రనాథ్‌రెడ్డి తన కొడుకుపై ఫిర్యాదు చేశారని అన్నారు. పై నుంచి వచ్చిన ఒత్తిళ్లతో పోలీసులు అత్యు త్సాహం ప్రదర్శించారని ఆరోపించారు. జరిగిన సంఘటన పై రవీంద్రనాథ్‌రెడ్డి, అతని కుమారుడిని పోలీస్‌ స్టేషన్‌కు రప్పిం చకుండా నన్ను పోలీస్‌ స్టేషన్‌కు రమ్మని ఒత్తిడి చేశారని అన్నారు. తాను రానని చెప్తే చేతులీడ్చి తరలించండి అంటూ డీసీపీ మధుసూదన్‌రెడ్డి సీఐకి ఆదేశాలుజారీ చేశారని అన్నారు. తన కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించి, కావాలనే సెక్షన్‌ 307 కింద కేసు బుక్‌ చేస్తారని ముందే ఊహించానని పీజే ఆర్‌ అన్నారు. ఈ విషయాన్ని పోలీసులకు కూడా ముందే చెప్పానని అన్నారు.
అంతకు ముందు పోలీసులు తన కారును స్టేషన్‌కు తరలించాలని ప్రయత్నించారని, తాను ముందు జాగ్రత్తగానే మీడియా ముందు కారు డిక్కీ తెరిచి ఫోటోలు తీయించానని అన్నారు. తర్వాత పోలీసులు కారు తీసుకుపోవడానికి నిరాకరించారని చెప్పారు. తనపై పథకం ప్రకారమే కుట్ర జరుగుతోందని పీజేఆర్‌ ఆరోపించారు. తనను చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని, తనకు ప్రాణహాని వుందనీ గతంలో అడిషనల్‌ కమిషనర్‌ అరవిందరావుకు, తర్వాత వ చ్చిన పోలీస్‌ కమిషనర్‌ మహంతికి, ప్రస్తుత కమిషనర్‌ బల్వీందర్‌సింగ్‌కు కూడా ఫిర్యాదు చేశానని ఆయన వెల్లడించారు. తనకు వస్తున్న బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వివరాలు, నెంబర్లను పోలీసులకు ఇచ్చానని అన్నా రు. అయినా ఇప్పటి వరకూ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
ఆదివారం జరిగిన సంఘటనలో తన కుమారుడిని అరెస్టుచేసి 307 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారని మరి రవీంద్రనాథ్‌రెడ్డి, అతని కుమా రుడిని ఎందుకు అరెస్టు చేయలేదని పీజేఆర్‌ ప్రశ్నించారు. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడు ఒకవైపు వారినే స్టేషన్‌కు తీసుకొచ్చారంటేనే పైనుంచి ఒత్తిళ్లు వస్తున్నట్టు స్పష్టమవుతోం దని అన్నారు. గొడవ జరిగినప్పుడు స్థానిక ఎమ్మెల్యేనైన నా ఇంటికి రాకుండా, ఏమీ కాని రవీంద్రనాథ్‌ ఇంటికి పోలీస్‌ కమి షనర్‌ వెళ్లి పరామర్శించారని, కేవలం ముఖ్యమంత్రి సోదరు డైనందుకే ఇలా జరిగిందని అన్నారు.
ప్రభుత్వంలోని అధికారుల నుంచి కానీ, పోలీసుల నుంచి తనకు న్యాయం జరగదని స్పష్టమైందని అన్నారు. సంఘటన జరిగిన తర్వాత ఏ మంత్రి కానీ తనను కనీసం పరామర్శించలేదని, పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తన కోసం వచ్చిన వందలాది మంది కార్యకర్తలను కొట్టి పోలీస్‌ స్టేషన్‌లలో పెట్టారని, ప్రజల కోసం పోరాటం చేస్తున్న తనపై అక్రమకేసులు బనాయిస్తున్నారని, కుటుంబ సభ్యుల పై కేసులు పెడుతున్నా రని ఆరోపించారు. న్యాయం కోసం ప్రజల ముందుకే వెళ్తానని పీజేఆర్‌ స్పష్టం చేశారు. భవిష్యత్‌ కార్యాచరణను మంగళవారం ప్రకటిస్తానని అన్నారు.

No comments: