Monday, July 9, 2007

ఇది ఆటవిక పాలన మా వాళ్ళు జైల్లో... ఆయన ఏసీ గదిలోనా?

మేమేమైనా నక్సలైట్లా... దొంగలమా? నాపై కక్ష ఉంటే నా కుటుంబ సభ్యులు ఏం చేశారు? ప్రాణాలకు ముప్పుందన్నా పోలీసులకు పట్టలేదు తెలుగుదేశం హయాంలోనూ ఇలా జరగలేదు
అన్యాయంపై ప్రజల్లోకి వెళ్తా: పీజేఆర్‌
''రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం హాయాంలో కూడా ఇలాంటివి జరగలేదు, నేనేమైనా నక్సలైట్‌నా? మా వాళ్లు నక్సలైట్లా? లేదంటే మేం దొంగలమా? మా వాళ్లపై లాఠీఛార్జీ చేసి వేర్వేరు జైళ్లలో పెట్టారు. ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనా? కార్యకర్తల తలలే పగలగొడుతారా?'' - పి.జనార్దనరెడ్డి

20 గంటలపాటు పోలీస్‌ స్టేషన్లో పీజేఆర్‌ andhra jyothy

(ఆన్‌లైన్‌, సిటీబ్యూరో) ముఖ్యమంత్రి సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డి, ఆయన కుమారుడు సుమధుర్‌రెడ్డిలతో ఆదివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలో జరిగిన గొడవ అనంతరం ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పీజేఆర్‌ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి, అల్లుడు గిరిసంతోష్‌రెడ్డి లను పోలీసులు అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 8.40గంటల సమయంలో పీజేఆర్‌ తన సతీమణి ఇందిరాదేవి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి అక్కడకు వచ్చారు.
ఇరుపక్షాలు కేసులు పెట్టినందున వై.ఎస్‌ సోదరుడిని కూడా స్టేషన్‌కు తీసుకురావాలని, అందరికీ ఒకే న్యాయం అమలు జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన కు న్యాయం జరిగేంతవరకు కదలబోనని భీష్మిం చిన ఆయన అప్పటినుంచి సోమవారం సాయం త్రం ఐదు గంటల వరకు అక్కడే ఉన్నారు. తమ నాయకుడికి బాసటగా వందలాది మంది కార్యకర్తలు పీజేఆర్‌ వెంటే ఉన్నారు.

తెల్లవారుజామున ఇంటికెళ్లిన ఇందిరాదేవి...

పిీజేఆర్‌తోపాటు రాత్రి మొత్తం పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్న ఇందిరాదేవి ఆరోగ్యం సరిగా లేకపోవటంతో సోమవారం తెల్లవారుజామున ఇంటికి వెళ్లిపోయారు. ఆ తరువాత పశ్చిమ మండలం డీసీపీతోపాటు పలువురు పోలీసు అధికారులు పిీజేఆర్‌ను కూడా వెళ్లిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మీ ఫిర్యాదుపై కూడా తగు చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పటా నికి ప్రయత్నించారు. అయితే పిీజేఆర్‌ మాత్రం పోలీస్‌స్టేషన్‌ నుంచి కదలలేదు. సోమవారం తెల్లవా రుజామున అక్కడే బ్రష్‌ చేసుకున్నారు. మధుమేహం ఉన్న నేపథ్యంలో ఉదయం నాలుగు పూరీలు తిన్న ఆయన మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే చేశారు. కొన్ని పళ్లు తీసుకున్నారు.
అధిష్ఠానం నుంచి ఆదేశాలు అందాయో లేక ఎవరు నచ్చజెప్పారో గానీ సోమవారం సాయంత్రం 5.15గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌ నుంచి ఇంటికి బయల్దేరి వెళ్లారు. స్టేషన్‌ నుంచి బయలుదేరిన సమయంలో అనుచరులు ఆయన వెనుక పది వాహనాలలో వెళ్లారు. అయితే పీజేఆర్‌ నివాసానికి చేరుకునేసరికి ఈ వాహనాల సంఖ్య దాదాపు రెండువందలకు చేరుకుంది. దారి పొడవునా ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పీజేఆర్‌ అనుచరులు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.


నేను నక్సలైట్‌నా? దోపిడీ దొంగనా?: పీజేఆర్‌ andhra jyothy


హైదరాబాద్‌, ఆన్‌లైన్‌ (సిటీబ్యూరో), జూలై 9: 'నేనేమన్నా నక్సలైట్‌నా? లేక దోపిడీ దొంగనా? ఇరవై నాలుగు గంటల పాటు నన్ను పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. మీరు ముఖ్యమంత్రికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. నేను స్థానిక ఎమ్మెల్యేను. అయి నా కనీస మర్యాద లేకుండా వ్యవహరించారు.' అంటూ ఖైర తాబాద్‌ ఎమ్మెల్యే పి.జనార్దనరెడ్డి పోలీసులపై విరుచుకు పడ్డా రు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు జూబ్లీహిల్స్‌ పోలీ స్‌స్టేషన్‌ నుంచి ఇంటికి వెళ్లిపోతూ ఆయన విలేకరులతో మా ట్లాడారు. తాను ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నానని, ప్ర భుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వేలెత్తి చూపుతున్నందుకే ముఖ్యమంత్రి తనపై కక్ష కట్టారని ఆయన ఆరోపించారు.
'నా కూతురు ఇంట్లో శుభ కార్యం జరుగుతున్న విషయం ముఖ్య మంత్రి తమ్ముడైన రవీంద్రనాథ్‌ రెడ్డికి తెలుసు. ఆ ఇల్లు నాకూతురుదన్న విషయం కూడా వారికి తెలుసు. అయినా నా కుమా రుడు కారు పక్కకు జరపలేదన్న కారణంతోనే రవీంద్రనాథ్‌రెడ్డి, అతని కుమారుడు సుమధుర్‌రెడ్డిలు పచ్చిబూతులు తిట్టడంతో పాటు కొట్టడానికి వచ్చారంటే నా కుటుంబంపై వైఎస్‌ కుటుం బానికి ఎంత కక్ష వుందో అర్థమవుతోంది.' అని పీజేఆర్‌ అన్నారు. పైగా తన కుమారుడే దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.
జరిగిన గొడవను సర్దుబాటు చేశానని, చిన్న విషయం కోసం పార్టీ పరువును బజారుకీడ్చరాదని భావించానని పీజేఆర్‌ అన్నారు. అయినా కావాలని రవీంద్రనాథ్‌రెడ్డి తన కొడుకుపై ఫిర్యాదు చేశారని అన్నారు. పై నుంచి వచ్చిన ఒత్తిళ్లతో పోలీసులు అత్యు త్సాహం ప్రదర్శించారని ఆరోపించారు. జరిగిన సంఘటన పై రవీంద్రనాథ్‌రెడ్డి, అతని కుమారుడిని పోలీస్‌ స్టేషన్‌కు రప్పిం చకుండా నన్ను పోలీస్‌ స్టేషన్‌కు రమ్మని ఒత్తిడి చేశారని అన్నారు. తాను రానని చెప్తే చేతులీడ్చి తరలించండి అంటూ డీసీపీ మధుసూదన్‌రెడ్డి సీఐకి ఆదేశాలుజారీ చేశారని అన్నారు. తన కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించి, కావాలనే సెక్షన్‌ 307 కింద కేసు బుక్‌ చేస్తారని ముందే ఊహించానని పీజే ఆర్‌ అన్నారు. ఈ విషయాన్ని పోలీసులకు కూడా ముందే చెప్పానని అన్నారు.
అంతకు ముందు పోలీసులు తన కారును స్టేషన్‌కు తరలించాలని ప్రయత్నించారని, తాను ముందు జాగ్రత్తగానే మీడియా ముందు కారు డిక్కీ తెరిచి ఫోటోలు తీయించానని అన్నారు. తర్వాత పోలీసులు కారు తీసుకుపోవడానికి నిరాకరించారని చెప్పారు. తనపై పథకం ప్రకారమే కుట్ర జరుగుతోందని పీజేఆర్‌ ఆరోపించారు. తనను చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని, తనకు ప్రాణహాని వుందనీ గతంలో అడిషనల్‌ కమిషనర్‌ అరవిందరావుకు, తర్వాత వ చ్చిన పోలీస్‌ కమిషనర్‌ మహంతికి, ప్రస్తుత కమిషనర్‌ బల్వీందర్‌సింగ్‌కు కూడా ఫిర్యాదు చేశానని ఆయన వెల్లడించారు. తనకు వస్తున్న బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వివరాలు, నెంబర్లను పోలీసులకు ఇచ్చానని అన్నా రు. అయినా ఇప్పటి వరకూ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
ఆదివారం జరిగిన సంఘటనలో తన కుమారుడిని అరెస్టుచేసి 307 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారని మరి రవీంద్రనాథ్‌రెడ్డి, అతని కుమా రుడిని ఎందుకు అరెస్టు చేయలేదని పీజేఆర్‌ ప్రశ్నించారు. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడు ఒకవైపు వారినే స్టేషన్‌కు తీసుకొచ్చారంటేనే పైనుంచి ఒత్తిళ్లు వస్తున్నట్టు స్పష్టమవుతోం దని అన్నారు. గొడవ జరిగినప్పుడు స్థానిక ఎమ్మెల్యేనైన నా ఇంటికి రాకుండా, ఏమీ కాని రవీంద్రనాథ్‌ ఇంటికి పోలీస్‌ కమి షనర్‌ వెళ్లి పరామర్శించారని, కేవలం ముఖ్యమంత్రి సోదరు డైనందుకే ఇలా జరిగిందని అన్నారు.
ప్రభుత్వంలోని అధికారుల నుంచి కానీ, పోలీసుల నుంచి తనకు న్యాయం జరగదని స్పష్టమైందని అన్నారు. సంఘటన జరిగిన తర్వాత ఏ మంత్రి కానీ తనను కనీసం పరామర్శించలేదని, పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తన కోసం వచ్చిన వందలాది మంది కార్యకర్తలను కొట్టి పోలీస్‌ స్టేషన్‌లలో పెట్టారని, ప్రజల కోసం పోరాటం చేస్తున్న తనపై అక్రమకేసులు బనాయిస్తున్నారని, కుటుంబ సభ్యుల పై కేసులు పెడుతున్నా రని ఆరోపించారు. న్యాయం కోసం ప్రజల ముందుకే వెళ్తానని పీజేఆర్‌ స్పష్టం చేశారు. భవిష్యత్‌ కార్యాచరణను మంగళవారం ప్రకటిస్తానని అన్నారు.