Thursday, July 12, 2007

610 జీవోపై శాసన సభా కమిటీ సమావేశం andhra jyoth

హైదరాబాద్‌, జూలై 12 ః 610 జీవో పై శాసన సభా కమిటీ గురువారం సమావేశమైంది. 610 జీవో అమలు, స్థానికేతరుల బదిలీ తదితర విషయాలపై సమావేశం సమీక్ష నిర్వహించనుంది. కాగా ఈ సమావేశానికి ఆంధ్ర ప్రాంత శాసన సభ్యులు గైర్హాజరయ్యారు. ఈ సమావేశంలో స్థానికేతరుల గుర్తింపు, సరైన విధి విధానాలు, పారదర్శకత తదితర అంశాలు చర్చించే అవకాశం వుంది. జీవో అమలుకు సంబంధించి టిఆర్‌ఎస్‌ శాసన సభ్యుడు హరీష్‌ రావు కోర్టులో పిటీషన్‌ దాఖలు చేయడాన్ని కూడా కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం వున్నట్లు సమాచారం. హౌస్‌ కమిటీ సమావేశం కారణంగా అసెంబ్లీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు

No comments: