Wednesday, July 4, 2007

నా వ్యాఖ్యాల్ని వక్రీకరిస్తున్నారు: లగడపాటి andhra jyothi

విజయవాడ, జూలై 4 (ఆన్‌లైన్‌): రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధ్దికోసం ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య విద్వేషా లను పెంచడానికి ప్రయత్నిస్తుండడం సబబుకాదని విజయవాడ పార్లమెంట్‌ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. 610 జీవో అమలు విషయంలో ఇటీవల రాజ గోపాల్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తెలంగాణ నాయకులు రాజగోపాల్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపధ్యంలో బుధవారం ఆయన ఒక ప్రకటన చేస్తూ, తనపై వ్యాఖ్యలు చేస్తున్న నాయకులను తీవ్రంగా విమర్శించారు.
వివిధ జిల్లాలోని ప్రజలను రెచ్చగొడుతూ, ఈ సమస్యను ఇండియా-పాకిస్థాన్‌ మధ్య ఉన్న సమస్య లా చీత్రీకరించడం తగదన్న ఉద్దేశంతోనే తాను కొన్ని వ్యా ఖ్యలు చేసినట్లు తెలిపారు. అయితే కొందరు ఉద్దేశపూర్వ కంగా వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. మనదేశ సంస్కృతి, తెలుగు సంస్కృతికి విరుద్ధంగా విధి విధానాలకు దూరంగా ప్రజలను తీసుకువెళ్లి, వారిని రెచ్చ గొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడం ఎంతవరకు సబబో చెప్పాలన్నారు. ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఇంకొక ప్రాంతానికి చెందిన వ్యక్తులను దూషించడం తగదని చెప్పారు.
ఆంధ్రా-తెలంగాణ ప్రాంతాలను పాకిస్థాన్‌- భారత్‌ సమస్యతో పోల్చడాన్ని దయచేసి వక్రీకరించవద్దని రాజగోపాల్‌ విజ్ఞప్తి చేశారు. శాంతికి, సహజీవనానికి భం గం కలిగించకూడదన్నదే తన తపన అన్నారు. కొంతమం ది రాజకీయ నాయకులు ప్రజల మధ్య లేనిపోని అపోహ లు సృష్టించి అవగాహన లేమితో మాట్లాడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. కొన్ని జిల్లాలలో స్థానికేతరులలో కూడా ముఖ్యంగా టీచర్లు 20 శాతం మంది సొంత ప్రాం తాలకు వెళ్ళేందుకు దరఖాస్తు చేసుకున్నారని, వీరంతా వెళ్ళిపోతే ప్రభుత్వం కొత్తగా సిబ్బందిని నియమించుకో వాల్సి వస్తుందన్నారు.
సిబ్బందిని కొత్తగా నియమించడానికి కనీసం ఒక ఏడాది పడితే ఈ లోపల విద్యార్థుల భవి ష్యత్‌ ఏమిటన్న ఉద్దేశంతోనే తాను మాట్లాడినట్లు స్పష్టం చేశారు. తెలంగాణలో చదువు చెప్పేవారు దొరకరని అన డం వాస్తవం కాదన్నారు. కొంతమంది నేతలు తాను అహంకారంతో మాట్లాడానని వక్రీకరించడం విచారకర మని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ ఏ ప్రాంతానికి, ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్నారు. కుల, మత, ప్రాంతీయ విభేదాలకు వ్యతిరేకినని స్పష్టం చేశారు. తెలుగు సంస్కృ తి, దేశ సంస్కృతిని కాపాడడంతో బాటు సంస్కారం, సభ్యతలను పాటిస్తూ ర్రాష్టాన్ని, దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్నదే తన అభిమతమని చెప్పారు.

No comments: