Monday, July 16, 2007

కాంగ్రెస్స్ వాళ్ళని మించిన నట చక్రవర్తులు ఈ శృష్టిలొ లేరని చెప్ప వచ్చును

చాన్నాళ్ళ క్రితం నాటకాలు వేయడంలోను , పాత్రలను పండించడంలోను సురభి నాటక మండలివారిది ఒక విశిష్టమైన శైలి. కాలక్రమేణా రంగస్థలం రంగువెలసి, కళాకారులు కనుమరుగయ్యారు. ప్రస్తుతం వాళ్ళు లేని లోటును మన రాజకీయనాయకులు తీర్చడమేకాదు వారికంటే అమోఘంగా నటిస్తూ నిత్య నూతనంగా వెలుగొందు తున్నారు. అందులో ఎలాంటి పాత్రనైన ముఖ్యంగా అమాయక సన్నివేషాలనుండి ఆరాచక సన్నివేషాలవరకు అవలీలగా పొషించడంలో కాంగ్రెస్స్ వాళ్ళని మించిన నట చక్రవర్తులు ఈ శృష్టిలొ లేరని చెప్ప వచ్చును. ఇలాంటి విషయాల్లో కడప కళాకారులు కాకలుతీరిన వారు.

అందుకే జూబిలీ పడక సీనులొ తండ్రి (రవీంద్రా రెడ్డి) కొడుకు(సుమధుర్ రెడ్డి) అద్బుతంగా నటించారు. అలా అనేకంటే జీవించారు అని చెప్పడం సబబుగా ఉంటుందేమో. మాయావి రాజశేఖర్ రెడ్డి దవాఖానల ప్రదర్శించిన పరామర్శ సీను తన గంభీర వదనంతో మరీ పండించారు. కీ.శే.వై.ఎస్స్.రాజా రెడ్డి కుటుంబానికి దాడులు చెయ్యడంలోను, శవాలను అదృశ్యం చెయ్యడలోను ఎంత ఘనమైన చరిత్ర వున్నదో అలనాటి కడప లోకసభ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన ఒక స్వతంత్ర అభ్యర్థి హత్య అనంతరం శవం అదృశ్య ఘట్టం మనకి వాస్తవాన్ని విశదీకరిస్తుంది. ప్రస్తుతం తెలంగాణ తెర మీద వారి నటన అమొఘంగా ఉన్నా ఒన్స్ మోర్లు మరియు నీరాజనాలు మాత్రం అందుకోజాలరని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మా నాయకుల నయవంచక అశ్లీల నటనలతో మా ప్రజలు ఎప్పుడో విసిగి వేసారిపోయి ఉన్నారు గనక మీ నటన పట్ల ఆసక్తి గాని, ఆకర్షణ గాని ఏ మాత్రం లేవని మనవి. మీ సమష్యలకు మా సమష్యలకు ప్రత్యేక రాష్ట్ర మొక్కటే పరిష్కారం.తద్వార మన సకల కుటుంబాలు సుఖ శాంతులతో కలకాలం వర్థిల్ల గలవు.


నయవంచనతో కూడిన నటనకు ఏదో ఒకనాడు తెర పడక తప్పదు.


తెలివి మీరి నటిస్తే తెర మరుగు గాక తప్పదు.


జై తెలంగాణా-జై హింద్,

అనీల్ మద్దిరాల

No comments: