Sunday, October 21, 2007

తెలంగాణకు ప్రత్యేక పీసీసీ అవసరం: కేకే Eenadu

హైదరాబాద్‌: తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకంగా పీసీసీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పీసీసీ మాజీ అధ్యక్షుడు కేశవరావు అభిప్రాయపడ్డారు. ఈ నెల 24న రాష్ట్రానికి రానున్న కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని ఆయన చెప్పారు. ఈ విషయంపై చర్చించడానికి టీఆర్‌సీసీ నేతలు కె.ఆర్‌.ఆమోస్‌; పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, నరసారెడ్డి, కమలాకర్‌ తదితరులు ఈరోజు కేకేను కలిశారు. రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణ విషయంలో అనుసరిస్తున్న వైఖరి గురించి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని ఇటీవలే ఢిల్లీలో కలిసి వివరించినట్లు ఆమోస్‌ తెలిపారు. రెండో ఎస్సార్సీతో సంబంధం లేకుండా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. ప్రత్యేక పీసీసీ విషయంలో ఇన్‌ఛార్జి అధ్యక్షుడు జీఎస్‌ రావు చేసిన వ్యాఖ్యలను ఆమోస్‌ తప్పుబట్టారు.

No comments: