Saturday, December 29, 2007

కుమారుడే వారసుడు! మార్చిలో ఉప ఎన్నిక? Eenadu 30-12-07


హైదరాబాద్‌, న్యూస్‌టుడే: జనార్దనరెడ్డి అకాల మరణంతో ఖాళీ అయిన ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి 2008 మార్చిలో ఉప ఎన్నిక జరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుత శాసనసభ కాలపరిమితి 2009 ఏప్రిల్‌ వరకు ఉన్నందున ఉప ఎన్నిక ఖచ్చితంగా జరుగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒక స్థానం ఖాళీ అయితే ఆరు నెలల్లోగా ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఆ తరువాత సభ కాలవ్యవధి అతి తక్కువకాలం ఉంటే ఎన్నిక నిర్వహణపై ఎన్నికల సంఘం పునరాలోచిస్తుంది. అయితే రాష్ట్రంలో అసెంబ్లీ కాలవ్యవధి ఇంకా 16 నెలలకు పైగా ఉంది. అందువల్ల
త్వరలోనే ఎన్నిక వస్తుందని భావిస్తున్నారు. కర్ణాటక శాసనసభకు త్వరలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అక్కడ శాసనసభ రద్దవడంతో ఏప్రిల్‌లోగా ఎన్నికలు జరిపి తీరాలి. ఆ మేరకు కర్ణాటక ఎన్నికలు మార్చిలో జరగవచ్చునని వాటితో పాటే ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక నిర్వహిస్తారని భావిస్తున్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం జనార్దనరెడ్డి కుమారుడు విష్ణువర్దన్‌కే దక్కే అవకాశాలున్నాయి. మూడున్నర దశాబ్దాలపాటు పీజేఆర్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి చేసిన సేవలపై అధిష్ఠానంలో గుర్తింపు ఉంది. ఆయన అహర్నిశలు పార్టీ కోసం పని చేశారని ఢిల్లీ నేతలు కూడా శ్లాఘిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీజేఆర్‌ కుటుంబం నుంచే ఒకరికి అవకాశం ఇవ్వడం గ్యారంటీ అని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కూడా ఈ విషయంలో అడ్డుపడే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. పీజేఆర్‌ కుటుంబంలో సహజంగానే తొలుత ఆయన భార్య సులోచన పేరు వినిపిస్తోంది. అయితే ఆమె ఆరోగ్యరీత్యా ఎన్నికల్లో తలపడి ఆ తరువాత ప్రజలతో సంబంధాలు నెరపడం కష్టమవుతుందనే భావన పీజేఆర్‌కు అత్యంత సన్నిహితులయిన వారిలో ఉంది. అందువల్ల యువకుడైన విష్ణువర్దన్‌నే పీజేఆర్‌ వారసునిగా ఆయన కుటుంబం ప్రకటిస్తుందని చెబుతున్నారు. గత ఏడాది కాలంగా విష్ణు క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌యుఐ జాతీయ కోశాధికారిగా ఉన్నారు. విష్ణును రాజకీయవారసుణ్ణి చేయాలనే తలంపు పీజేఆర్‌లోనూ ఉండేదని, ఇప్పుడుకూడా అందుకనుగుణంగానే నిర్ణయం తీసుకుంటామని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Friday, December 28, 2007

ఇద్దరినీ ఇరుకున పెట్టిన ఘనుడు.. పీజేఆర్‌, Andhra Jyothi, 29th Dec, 07

కేవలం 26 మంది ఎమ్మెల్యేలతో 1994-99 మధ్య కాలంలో కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేతగా వ్యవహ రించిన పీజేఆర్‌ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆల్మట్టి డ్యాం, ఏలేరు స్కాం, కాల్దరి కాల్పులు వంటి పలు అంశాలపై ముప్పతిప్పలు పెట్టారు. 2004 నుంచి నేటి వరకు శ్రీశైలం రిజర్వాయర్‌ కనీస నిల్వ మట్టం, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌, జంట నగరాలకు మూడో దశ కృష్ణా జలాల తరలింపు, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, ప్రసాద్‌ ఐమాక్స్‌ థియేటర్‌, ఔటర్‌రింగ్‌ రోడ్డు భూ సేకరణ అక్రమాలు, డీబీఆర్‌ మిల్స్‌ భూముల కేటా యింపు వంటి అంశాలపై ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డికి నిద్ర లేకుండా చేశారు. పార్టీ నుంచి సస్పెండ్‌ అయినా, పార్టీ కేంద్ర నాయకత్వం కన్నెర్ర చేసినా ప్రజా సమస్యలపై మడమ తిప్పని పోరాటం చేయడం పీజేఆర్‌ నైజం.
రాజధానికి సంబంధించిన చాలామంది ఎమ్మెల్యేలకు రాష్ట్ర నీటిపారుదల వ్యవస్థ గురించి అవగాహన సహజంగానే ఉండదు. పీజేఆర్‌ మాత్రం ఆ కోవలోకి రారు. నాటి ఆల్మట్టి డ్యాం నుంచి నేటి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ వరకు రాష్ట్రంలో ఏ ప్రాంత, ఏ పార్టీ నాయకుడు పోరు సలపనంతగా పీజేఆర్‌ జరిపారు. కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలనే సలహాలు రాష్ట్ర, కేంద్ర పార్టీ నాయకత్వాల నుంచి, మిత్రుల నుంచి వచ్చినా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల గురించి పోరాటం చేయకుండా ఉండలేని బలహీనత పీజేఆర్‌ది అని ఆయన సన్నిహితులు చెప్పారు.

ఎవరేమన్నా ఎదురీతే, Andhra jyothi, 29th Dec, 07

హైదరాబాద్‌, డిసెంబర్‌ 28 (ఆన్‌లైన్‌): "అన్నా'' అంటే "నేనున్నా'' అంటూ అర్ధరాత్రి సైతం ప్రత్యక్షమయ్యే పబ్బతిరెడ్డి జనార్దన్‌రెడ్డికి హైదరాబాద్‌ బడుగు బస్తీ ప్రజలు గుండెలో గుడికట్టుకున్నా.... రాజకీయంగా మాత్రం ఆయనకు ఎదురీత తప్పలేదు. ఆరు నూరైనా అణుమాత్రం కదలని, పట్టువిడుపులు లేని మొండితనం కార్మిక నేతగా ట్రేడ్‌యూనియన్‌ వ్యవహారాలలో ఆయనను అగ్రస్థానంలో నిలిపినా రాజకీయాలలో ఒంటరిని చేసింది.
పార్టీ ఆయనకు ఊపిరి.. అయినా ఆయనకు షోకాజ్‌ నోటీసులు, సస్పెన్షన్‌ వంటి క్రమశిక్షణ చర్యలు తప్పలేదు. పార్టీ ఆవిర్భావ దినాన, పార్టీ కార్యకర్తల మధ్య, పార్టీ కార్యక్రమంలో తుదిశ్వాస విడిచిన పీజేఆర్‌ పార్టీలో మాత్రం కొరకరాని కొయ్యే... ఎందరికో పంటిలో రాయే. కొద్దినెలల క్రితం క్రమశిక్షణలో భాగంగా పార్టీ అధిష్ఠానం జారీ చేసిన ఒక షోకాజ్‌ నోటీసుకు ఆయన ఇంకా సమాధానం ఇవ్వాల్సి ఉండడం విశేషం.
చర్యలపై చరిష్మాదే పైచేయి1989 ఎన్నికల ముందు అప్పటి పీసీసీ అధ్యక్షుడు.. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన చెన్నారెడ్డికి వ్యతిరేకంగా పీజేఆర్‌ బహిరంగ పోరాటం చేశారు. ఎన్నికల ముందు పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఇదే తీరులో 2004 ఎన్నికలకు కొంతకాలం ముందు ఎం.సత్యనారాయణరావు పీసీసీ అధ్యక్షుడిగా ఉండగా రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి వాయలార్‌ రవి ఆయనను సస్పెండ్‌ చేశారు. తాజాగా.. కొద్దినెలల క్రితం దిగ్విజయ్‌సింగ్‌ షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. అయితే ఆయనపై ఏ క్రమశిక్షణ చర్యనూ హైకమాండ్‌ ఎంతో కాలం కొనసాగించలేదు. అ ప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ చెన్నారెడ్డి, ఇప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ రాజశేఖరరెడ్డిలతో ఆయన సర్దుకుపోలేక పో యారు.
పార్టీ రాజకీయాలలో టి.అంజయ్య అడుగుజాడ ల్లో నడిచిన పీజేఆర్‌ ఆ తర్వాత నేదురుమల్లి జనార్దన్‌రెడ్డిని అనుసరించారు. తర్వాతి రోజులలో నేదురుమల్లి పట్ల కూడా చాలా రోజులు కినుకవహించి అంటీ అంటకుండా తిరిగినా.. ఇటీవల మళ్లీ సన్నిహితమయ్యారు. రాజకీయం గా సమకాలికుడు.. తనతోపాటు తొలిసారి మంత్రి అయిన వైఎస్‌తో కలిసి పనిచేసేందుకు ఒక దశలో పీజేఆర్‌ ప్రయ త్నించినా అది ఎంతో కాలం కొనసాగలేదు. 1999 ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతున్న దశలో వైఎస్‌ను పీసీసీ అధ్యక్షుడిగా అధిష్ఠానం నియమించింది. ఢిల్లీ నుంచి వస్తున్న వైఎస్‌కు స్వాగతంపలకటానికి విమానాశ్రయానికి వెళ్లాలా, వద్దా అని ఆయన రెండు రోజులు మథనపడ్డారు. అప్పటికి నాలుగు సంవత్సరాలుగా సీఎల్పీ నేతగా ఉన్న పీజేఆర్‌ అధికార తెలుగుదేశం పార్టీపై గట్టిపోరాటం చేస్తున్నారు.
పార్టీ అతి బలహీనమైన దశలో ఉన్న ఆ కాలంలో పీజేఆర్‌ పోరాట ధోరణి కారణంగానే కాంగ్రెస్‌ ప్రజలలో నానుతుండేది. ఒకటి రెండు సార్లు వైఎస్‌ సన్నిహితుల నుంచి పిలుపు రావటంతో తప్పని పరిస్థితిలో ఆయన వైఎస్‌కు స్వాగతం పలకడానికి వెళ్లి... టాపులేని కారులో వెంట వచ్చారు. అయితే ఈ నిర్ణయంపై అనతికాలంలోనే పశ్చాత్తాపపడ్డారు. "తప్పు చేశా. విమానాశ్రయానికి వెళ్లకుండా ఉండాల్సింది. గాంధీభవన్‌కు వెళ్లి కలిసి వచ్చివుంటే సరిపోయేది'' అని ఆ తర్వాత పదేపదే అనుకున్నారు. పార్టీలోని రెండు కీలక పదవులలో ఇద్దరూ ఉండటంతో ఎంతోకాలం సర్దుకుపోలేకపోయారు. ఎన్నికల నాటికి వారి మధ్య వైరం మరింతపెరిగింది. టిక్కెట్ల కేటాయింపులో ఏకాభిప్రాయం కుదరక రోజుల తరబడి గొడవపడ్డారు.
సీఎల్పీ నాయకత్వం అరుదైన మలుపుపీజేఆర్‌కు అనుకోని అరుదైన అవకాశం కోట్ల విజయభా స్కరరెడ్డి హయాంలో 1994లో వచ్చింది. నిజానికి అదే ఆయనను రాజకీయంగా దెబ్బ కూడా కొట్టింది. 1994 ఎన్నికల నాటికి తన మంత్రివర్గంలో మంత్రిగా పని చేసిన పీజేఆర్‌ను కోట్ల అప్పటి రాజకీయ అవసరాల దృష్ట్యా దగ్గరకు తీశారు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఘోరంగా దెబ్బతిని కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. 26 మంది సభ్యులు మాత్రమే ఉన్న అప్పటి సీఎల్పీకి నాయకత్వం వహించలేని,వైఎస్‌ వర్గానికి పదవి ఇవ్వటం ఇష్టం లేని కోట్ల... పీజేఆర్‌కు ఆ బాధ్యతను అప్పగించారు. ఇది ఆయన స్థాయిని పెంచింది.. సమస్యలూ పెంచింది.
ఏకపక్షంగా తెలుగుదేశం వెలిగిపోతున్న కాలం.. కొమ్ములు తిరిగిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలందరూ పరాజయంతో ఇంట్లో కూర్చున్న రోజులు. అసెంబ్లీలో 220 పైగా సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీతో పోరాడాల్సిన పనిని పీజేఆర్‌ భుజానికెత్తుకున్నారు. రాత్రింబవళ్లూ శ్రమించారు. వాక్‌చాతుర్యంతో పని లేదనుకొని న మ్మినదానికి కట్టుబడి మొండిగా పోరాడారు. ఆల్‌మట్టి వంటి అంశాలను వెలుగులోకి తీసుకువచ్చారు. అయితే సీఎల్‌పీలో కనీసం సగంమంది సహకారం కూడా లభించలేదు.
నలుగురైదుగురిని వెంటపెట్టుకున్నా ఆయనది దాదాపు ఒంటరి పోరాటంగానే మారింది."పార్టీ అధికారంలోకి వస్తుంది.. ఈ విజయంలో సీఎల్‌పీ పాత్రను మరిచిపోకూడదు..'' అని 1999 ఎన్నికల ఫలితాలకు ముందు సోనియాను కలిసి చెప్పి వచ్చిన పీజేఆర్‌ తన కంచుకోట ఖైరతాబాద్‌తో పరాజయం పాలయ్యారు. దీంతో ఆయన తేరుకోవడానికి చాలా కాలం పట్టింది. దీనికి తోడు 1998 నుంచి.. దాదాపు దశాబ్దకాలంగా రాష్ట్ర పార్టీలో వైఎస్‌ ప్రాబల్యం అధికమైంది.
కష్టకాలంలో సీఎల్‌పీకి నాయకత్వం వహించిన పీజేఆర్‌.. ఆ స్థాయిని కాపాడుకుంటూ పోరాటపంథాలో కొనసాగాల్సి వచ్చింది. అయిదు సంవత్సరాల విరామం తర్వాత 2004లో పార్టీకి అధికారం దక్కినా ఆయనకు మాత్రం పదవి దక్కలేదు. ఏకపక్షంగా సాగుతున్న వైఎస్‌ ధోరణికి ఎక్కడికక్కడ అడ్డుకట్టవేయాలని ఆయన గట్టి ప్రయత్నం చేశారు. పార్టీలోని పెద్ద నాయకులు సైతం రాజీపడినా పీజేఆర్‌ మాత్రం తిరుగుబాటు బవుటా ఎగవేశారు.
నిత్య విద్యార్థిఏదైనా సాంకేతిక అంశంపై మాట్లాడటానికి ముందు దాని గురించి అనుభవజ్ఞులైన సాం కేతిక నిపుణులతో మాట్లాడి అవగాహన చేసుకున్న తర్వాతే అసెంబ్లీలో కానీ, పార్టీ వేదికలపై కానీ, ఇతర వేదికలపై కానీ ఆయన మాట్లాడేవారు. తెలియని విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస పీజేఆర్‌లో అపారంగా ఉండటం వల్లే ఎన్నో విషయాలను సులువుగా అర్ధం చేసుకునే వారని పాలి టెక్నిక్‌ చదివే రోజుల్లో ఆయనకు విద్య బోధించిన రిటైర్డ్‌ ఇంజనీర్‌ జి.ప్రభాకర్‌ 'ఆన్‌లైన్‌'కు తెలిపారు.

ప్రజల మనిషి అనడానికి , Andhra Jyothi, 29th Dec, 07

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ప్రాంతంలో ఒక్కసారి తిరగండి. అక్కడి టీ బంకుల్లో తేరిపార చూడండి. సెలూన్లను పరిశీలించండి. రోడ్డుపక్కనున్న చెప్పుల షాపులో తొంగి చూడండి. పాన్‌ షాపుల్ని పరిశీలించండి. చాలావాటిల్లో ఒక ఫొటో కనిపిస్తుంది. చిరునవ్వుతో రిబ్బ న్‌ కత్తిరిస్తున్న పి.జనార్దన్‌రెడ్డి... పక్కన నవ్వుతూ నిలబడ్డ కొట్టు యజ మాని, ఇతర జనం. పీజేఆర్‌ జనం నాయకుడు అనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
కూకట్‌పల్లి-అమీర్‌పేట దారిలో ట్రాఫిక్‌ స్తంభించింది. ఎవరికి వారు హారన్లు కొడుతున్నారు. కాస్త సందు దొరికితే ముందుకు దూరి పోతున్నారు. అంతలో... కారులోంచి ఖద్దరు కట్టుకున్న ఓ నాయకుడు దిగాడు. ఆయనతోపాటు అనుచరులూ వచ్చారు. అప్పటికప్పుడు రంగంలోకి దిగారు. ట్రాఫిక్‌ను ఓ గాడిన పెట్టారు. పరిస్థితి అదుపు లోకి వచ్చాకే ఆ నేత అక్కడి నుంచి కదిలారు. ఆ నాయకుడు పీజేఆర్‌. సమస్య చిన్నదైనా... ఆయన తనదారి తాను చూసుకునే రకం కాదని చెప్పడానికి ఇంతకంటే రుజువు అవసరమా?
నగరంలోని సంపన్న ప్రాంతంలో అదో మురికివాడ. అక్కడ ప్రభు త్వ భూమిలో బడుగులు గుడిసెలు వేసుకున్నారు. అవన్నీ ఆక్రమణ లు అన్నారు అధికారులు. తొలగించేందుకు మందీ మార్బలంతో వ చ్చారు. గుడిసెపై విరుచుకుపడేందుకు గునపాలు సిద్ధంగా ఉన్నాయి. అంతలోనే అక్కడ పీజేఆర్‌ ప్రత్యక్షమయ్యారు. 'గుడిసెపై మొదటి గునపం ఎవరు వేస్తే, అదే గునపం వారి గుండెలో దిగుతుంది' గర్జిం చాడు పీజే ఆర్‌. అధికారులు వెనుదిరిగారు. 'పీజేఆర్‌ పేదల దేవుడు' అంటే అతిశయోక్తి ఏముంది?
నగరంలో ప్రమాదం జరిగింది. ప్రైవేటు స్కూలు వ్యాన్‌ ఓ మహిళ ను ఢీకొంది. ఆమె అక్కడికక్కడే చనిపోయింది. స్థానికుల ఆందోళన మొదలైంది. ట్రాఫిక్‌ జామ్‌. ఉద్రిక్తత. అంతలో పీజేఆర్‌ అక్కడికి వచ్చా రు. బాధితుల పక్షాన నిలబడ్డారు. స్కూలు యాజమాన్యంతో మాట్లా డారు. మృతురాలి కుటుంబానికి డబ్బు ఇప్పించారు. ప్రభుత్వంకంటే ముందు సమస్యను పరిష్కరించారు. సమస్యల పరిష్కారంలో జనా ర్దన్‌రెడ్డి చొరవ గురించి చెప్పేందుకు ఇంతకు మించి ఉదాహరణ ఏముంటుంది?

పీజే ఆర్‌ హఠాన్మరణం , Andhra Jyothi, 29th Dec, 07

కార్యకర్తల ఒడిలోనే ఒరిగిన నేత
ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే కన్నుమూత
శోకసంద్రమైన భాగ్యనగరం
పార్టీ వ్యవస్థాపక దినం రోజే తుదిశ్వాస
ఆఖరిమాట ' ఇందిరమ్మ'
అధికార లాంఛనాలతో నేడు అంత్యక్రియలు
ఆఖరి ప్రస్థానం ఉదయం 6.00 గంటలకు పెద్దమ్మగుడిలో పూజ 9.00 గంటలకు గాంధీభవన్‌ చేరిక 9.30 గంటలకు గాంధీభవన్‌నుంచి బయటకు 10.20 గంటలకు సికింద్రాబాద్‌ జ్యుయెల్‌గార్డెన్‌కు చేరుకుని గేటులోపల అడుగుపెట్టి కుప్పకూలారు 10.30 గంటలకు గార్డెన్‌ నుంచి హుటాహుటిన ఆస్పత్రికి 10.45 గంటలకు ఆస్పత్రిలోపలికి చేరుకున్నారు 11.30గంటలకు పీ జే ఆర్‌ మరణవార్త ప్రకటించారు ఆయన ఇక లేరని తెలిసి రాజధాని ఆర్తనాదం చేసింది. అన్నా అని పిలిస్తే నేనున్నాననే గొంతు మూగబోయిందని తెలిసి పట్నం గుండె పగిలింది.
గూడులేని వారికి నీడై, కష్టజీవులకు కొండంత అండై, అసహాయులకు ఆపన్నహస్తమై నిలిచిన నాయకశిఖరం కూలిందని జనదుఃఖం కట్టలు తెగింది. కాంగ్రెస్‌ నాయకుడు, కార్మికోద్యమనేత, మాజీ ప్రతిపక్ష నాయకుడు పి.జనార్దనరెడ్డి శుక్రవారం నాడు ఉద యం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. జనమేజీవితంగా గడిపే జనార్దనరెడ్డి తనకు ప్రాణప్రదమైన అనుచరగణం మధ్య, వారి చేతుల్లోనే ఆఖరిశ్వాస వదిలారు. అధిష్ఠానానికి తప్ప మరెవరికీ విధేయుడిని కానని రుజువుచేసుకుంటూ, ఆఖరిక్షణాల్లో కూడా ఇందిరపేరునే ఉచ్చరించారు.
సొంతపార్టీ ప్రభుత్వమే అయి నా, సమస్యల విషయంలో పాలకగణానికే పక్కలో బల్లెంలా మెలిగారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆయన సామాన్యుల మనిషి. మిరుమిట్లు గొలిపే అభివృద్ధి నీడన నలిగే చీకటిబతుకుల పక్షానే ఆయన పోరాటం. మహానగరం కడుపులో దాగిన పల్లెటూరు అతను. పదవులెన్ని చూసినా పెద్దమ్మ కొడుకే. నేల విడిచి సాముచేయని భూమి పుత్రుడే. అందుకే జనార్దనరెడ్డిని అన్ని పార్టీల వారూ ఆర్ద్రంగా స్మరించుకుంటున్నారు. శనివారం జరిగే ఆయన అంతిమయాత్రను కాంగ్రెస్‌ పార్టీ, ప్రభు త్వం, జనార్దనరెడ్డి అభిమానులు పెద్దఎత్తున జరుపనున్నారు.

బడుగుల దేవుడు అస్తమయం, andhra Jyothi, 29th Dec, 07

అనుచరుల ఒడిలో ఒరిగిపోతూ...
గుడిసె బెదిరింది. పేద గూడు వణికింది. నిలువెల్లా బాధతో భాగ్యనగరపు మురికవాడంతా విలవిలలాడింది. వలవలా ఏడ్చింది. పేదల గుండె గుడిలో కొలువైన జన్నన్న... గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యారు. 'అన్నా' అని పిలిచిన వెంటనే 'నేనున్నా' అంటూ జరూరుగా ఉరికురికి వచ్చే 'బడుగుల దేవుడు' పి.జనార్దన్‌రెడ్డి అనుకోకుండా అస్తమించారు. అనంత లోకాలకు వెళ్లిపోయారు. 60 ఏళ్లు నిండకుండానే ఆయువు చాలించారు. 30 ఏళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీయే ఊపిరిగా జీవించిన ఈ మడమతిప్పని పోరాట యోధుడు... చివరికి కాంగ్రెస్‌ వ్యవస్థాపక దినోత్సవం రోజునే... పార్టీ జెండా ఎగరేసిన కాసేపటికే ప్రాణాలు వదిలారు.
ఇందిరాగాంధీ కుటుంబానికి అచంచల విధేయుడైన ఈ నాయకుడి నోటివెంట చివరగా వెలువడిన మాట 'ఇందిరమ్మ'! భాగ్యనగర రాజకీయాలే ఆలంబనగా... జనం సమస్యలే సోపానాలుగా... ఒక్కో మెట్టూ ఎదిగిన ఈ గరీబోల్ల బిడ్డ... ఆ మహానగర రహదారిపైనే రాలిపోయారు. అచేతనంగా వాలిపోయారు. పిలిస్తే రాని పెళ్లిలేదు. పలకరిస్తే మాట్లాడని క్షణం లేదు. పట్టించుకోని సమస్య లేదు సీ ఎల్పీ మాజీ నేత, మాజీ మంత్రి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే అయిన 59 ఏళ్ల పి.జనార్దన్‌ రెడ్డి ప్రజల్లోంచి పుట్టిన నాయకుడు.. ప్రజానాయకుడు! ప్రజా సమస్యలే ఆయుధాలుగా... స్వపక్షంలోనే విపక్షంగా... హీరోచిత పోరాటాలు చేసిన సాహసికుడాయన. పాలకులు సొంత పార్టీ వారైనా రాజీ పడకుండా... పక్కలో బల్లంలా మారి పరేషాన్‌ చేసిన వీరుడాయన. కేవలం 26 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నాయకుడిగా ఉంటూ కూడా... బలమైన ప్రభుత్వాన్ని గడగడలాడించి... కాంగ్రెస్‌ పరువు కాపాడిన ధీరుడాయన.
నేడు జంటనగరాల జనం కృష్ణా నీళ్లు తాగుతున్నారంటే అది పీజేఆర్‌ పుణ్యమే! ఆయన... కార్మిక నాయకుడు అంజయ్య శిష్యుడు. ఆరంభంలో కార్మికుడు. ఆజన్మాంతం కార్మిక నేత. అట్టడుగు నుంచి... పేద కుటుంబం నుంచి ఎదిగిన ఆయన చివరి వరకూ పేదల్ని విడవలేదు. హైదరాబాద్‌ బ్రదర్స్‌లో ఒకడిగా పేరుగాంచిన పీజే ఆర్‌ పేరు ప్రస్తావించకుండా రాజధాని రాజకీయం గురించి మాట్లాడడం అసంభవం. పీజేఆర్‌ అకాల మృతి... రాజకీయ నాయకుల్ని, రాష్ట్ర ప్రజల్ని విస్తుపోయేలా చేసింది. నిన్నటికి నిన్న పాకిస్థాన్‌లో మాజీ ప్రధాని బేనజీర్‌భుట్టో దారుణ హత్య వార్త నుంచి ఇంకా తేరుకోక ముందే, మరో దిగ్భ్రాంతికర విషయాన్ని విని జనం నివ్వెరపోయారు.
హైదరాబాద్‌, డిసెంబర్‌ 28 (ఆన్‌లైన్‌): బడుగు జీవుల అన్న, కార్మిక లోకం ప్రతినిధి పి.జనార్దన్‌రెడ్డి (పీజేఆర్‌) శుక్రవారం అకస్మాత్తుగా కన్నుమూశారు. తీవ్రమైన గుండెపోటుకు గురైన పీజేఆర్‌ను ఆయన అనుయాయులు ఆసుపత్రికి తరలిస్తుండగామార్గమధ్యంలోనే తుది శ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు గాంధీభవన్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న పీజేఆర్‌, ఆ తర్వాత సికింద్రాబాద్‌లోని జువెల్‌ గార్డెన్స్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల సందర్భంగా నగర కాంగ్రెస్‌ కమిటీ ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు.
పీజేఆర్‌ వాహనం నుంచి దిగగానే ఆయన అభిమానులు "పీజేఆర్‌ జిందాబాద్‌'' అంటూ ఆయనను ఎత్తుకోబో యారు. ఆయన అభిమానుల్ని వారిస్తూ... "నన్ను కాదు. ఇందిరమ్మ జిందాబా ద్‌ అనండి'' అంటూ సమావేశ ప్రాంగణం వైపు రెండడుగులు వేశారో లేదో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీనితో తీవ్ర ఆందోళనకు గురైన అనుయా యులు వెంటనే ఆయన్ను సమీపంలోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. వెంటనే రంగంలోకి దిగిన కిమ్స్‌ వైద్యులు చికిత్స చేపట్టారు. ఈసీజీ తీశారు. నాడి స్పందన, అవసరమైన రక్తపోటు కనిపించలేదు.
ఒకవైపు గుండెలపై మసాజ్‌ చేస్తూనే, మరోవైపు ఐ.వి. ఫ్లూయిడ్స్‌ ఎక్కించారు. అయినా ఫలితం కనిపించ లేదు. ఆయన గుండెకు రక్తాన్ని పంపించే నాలుగు కవాటాల్లో ఒకదానికి రక్త ప్రసరణ లేదని, మధుమేహం, మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న పీజే ఆర్‌ తీవ్ర గుండెపోటుతో మార్గమధ్యంలోనే మరణించినట్లు భావిస్తున్నామని కిమ్స్‌ సీఈవో డాక్టర్‌ బి.భాస్కరరావు చెప్పారు. పీజేఆర్‌ అంత్యక్రియలను అంబ ర్‌పేట స్మశాన వాటికలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు అధికార లాంఛనా లతో జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్పమొయిలీ, మాజీ ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ సహా పలువురు నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. పీజేఆర్‌ ఇంటి నుంచి శనివారం ఉదయం 9 గంటలకు భౌతికకాయాన్ని గాంధీభవన్‌కు తరలించి అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం గాంధీభవన్‌ నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.
పీజేఆర్‌ మృతికి సంతాపసూచకంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు. దేశంలో అతిపెద్ద శాసనసభ నియోజకవర్గమైన ఖైరతాబాద్‌లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పీజేఆర్‌ మరణంతో కాంగ్రెస్‌ పార్టీ గొప్ప పోరాట యోధుణ్ని కోల్పోయింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎదురులేని నేతగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ ను అనేక అంశాలపై పీజేఆర్‌, మర్రి శశిధర్‌ రెడ్డిలు ఢీ కొట్టి హైదరాబాద్‌ బ్రదర్స్‌గా పేరొందారు. రాష్ట్ర నాయకత్వం కంటే కూడా పార్టీ కేంద్ర నాయక త్వాన్నే ఎక్కువ నమ్మిన పీజేఆర్‌ తన చివరి క్షణాల్లో కూడా ఇందిరమ్మ పేరునే ఉచ్చరించడం విశేషం. భవిష్యత్తులో గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరే షన్‌ ఎన్నికలు రాబోతున్న తరుణంలో పీజేఆర్‌ ఆకస్మిక మరణం కాంగ్రెస్‌ పార్టీకి తీరని నష్టమే.
తెలంగాణ సమస్యలపై సొంత ప్రభుత్వంపైనే గళమెత్తి ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న పీజేఆర్‌ మరణం తెలంగాణవాదులను తీవ్ర విచా రంలో ముంచెత్తిందంటే అతిశయోక్తి కాదు. పీజేఆర్‌ తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారన్న సమాచారం తెలుసుకున్న వెంట నే పార్టీ ముఖ్యులు వి.హనుమంతరావు, ముఖేష్‌ గౌడ్‌, నాగేందర్‌ తదితరులు కిమ్స్‌కు చేరుకున్నారు. అప్పటికే పీజేఆర్‌ మరణించారని వైద్యులు తెలపడంతో భిన్నులయ్యారు. వీహెచ్‌ భోరున ఏడ్చారు. ఏఐసీసీ కార్యదర్శి ఇక్బాల్‌సింగ్‌, ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.జనార్దనరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.పి.రామచంద్రరావు, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణలతో పాటు పలువురు కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, టీడీపీ ఎమ్మెల్యేలు కిమ్స్‌కు వెళ్ళి నివాళులర్పించారు.
అనంతరం పీజేఆర్‌ భౌతికకాయాన్ని దోమలగూడలోని ఆయన నివాసానికి తరలించారు. పీజేఆర్‌ మరణవార్త నగరంలో దావానలంలా వ్యాపించింది. నగ రంలో 'స్వచ్ఛంద బంద్‌' జరిగింది. పలుచోట్ల వ్యాపార కేంద్రాలను, విద్యాల యాలను స్వచ్ఛందంగా మూసివేశారు. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడిని కూడా సంతాపసూచకంగా మూసివేశారు. పీజేఆర్‌ మరణవార్త తెలుసుకున్న నగర ప్రజలు, బస్తీ వాసులు, మురికివాడల బడుగు జీవులు పెద్దసంఖ్యలో ఆయన నివాసానికి చేరుకున్నారు. తమ ఆత్మీయుడిని కోల్పోయామంటూ మురికివాడల ప్రజలు గుండెలవిసేలా రోదించారు. ముఖ్యమంత్రి తన అధికార కార్యమ్రాలన్నీ రద్దు చేసుకున్నారు.

జనార్దనరెడ్డి అంతిమయాత్ర ప్రారంభం, Andhra Jyothi, 29th Dec, 07

హైదరాబాద్‌, డిసెంబర్‌ 29 : గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే జనార్దన రెడ్డి అంతిమయాత్ర శనివారం ఉదయం పది గంటలకు ప్రారంభమయింది. దోమల్‌గూడలోని పిజెఆర్‌ స్వగృహం నుండి పిజెఆర్‌ భౌతికకాయాన్ని లక్డీకపూల్‌ మీదుగా గాంధీభవన్‌కు ఊరేగింపుగా తరలిస్తున్నారు. గాంధీభవన్‌లో రెండు గంటల పాటు పిజెఆర్‌ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్దనార్దం ఉంచుతారు. అనంతరం అబిడ్స్‌, కోఠి, చాదర్‌ఘాట్‌ల మీదుగా పిజెఆర్‌ భౌతిక కాయాన్ని తరలించి అంబర్‌పేట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అంబర్‌పేట స్మశాన వాటికలో నిర్వహిస్తున్న అంత్యక్రియలకు పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో పాటు పిజెఆర్‌ అభిమానులు, పార్టీ కార్యకర్తలు హాజరుకానున్నారు.

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే జనార్దనరెడ్డి హఠాన్మరణం , Andhra Jyothi, 29th Dec, 07

పి.జనార్దన రెడ్డి మృతితో ....
ఖైరతాబాద్‌లో విషాదఛాయలు
సోనియా, వైఎస్‌ దిగ్భ్రాంతి !!
మిన్నంటిన అభిమానుల ఆగ్రహజ్వాలలు
పరిస్థితి ఉద్రిక్తం.

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే జనార్దనరెడ్డి హఠాన్మరణం
హైదరాబాద్‌, డిసెంబర్‌ 28 : ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పి.జనార్దన రెడ్డి శుక్రవారం గుండెపోటుతో మృతిచెందారు. జువెల్‌ గార్డెన్స్‌ ప్రాంగణంలో కళ్ళు తిరిగి పడిపోవడంతో హుటాహుటీన మినిస్టర్‌ రోడ్‌లోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే 11.30 గంటలకు కన్నుమూశారు. పి. జనార్దాన్‌ రెడ్డి హటాన్మరణంతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి. జనార్దన్‌ రెడ్డి అభిమానులు, కార్యకర్తలు శోకసంధ్రంలో మునిగిపోయారు. పిజెఆర్‌ గాంధీభవన్‌లో శుక్రవారం ఉదయం జరిగిన పార్టీ వ్యవస్థాపక వారోత్సవాల్లో పాల్గొని, గ్రేటర్‌ ఎన్నికల వ్యూహరచనపై జరుగుతోన్న పార్టీ అంతర్గత సమావేశానికి హాజరు కావడానికి బయలుదేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొనవలసి ఉంది. జువెల్‌ గార్డెన్స్‌లో జరుగుతోన్న సమావేశ ప్రాంగణంలోకి రాగానే పిజెఆర్‌ కళ్ళు తిరిగి పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. అనంతరం హుటాహుటీన అనుచరులు కిమ్స్‌కు తరలించినా పలితం లేకపోయింది. తీవ్ర గుండెపోటుతో మార్గం మధ్యలోనే జనార్దన రెడ్డి కన్నుమూశారు. జనార్దన రెడ్డి హఠాన్మరణంతో హైదరాబాద్‌, సికిందరాబాద్‌ నగరాల్లో విషాద వాతావరణం నెలకొంది. పార్టీ కార్యకర్తల ఆందోళనతో నగరం నలుమూలలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పిజెఆర్‌ నివాసం వద్ద బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలతో విషాదభరిత వాతవరణం నెలకొంది. ఇప్పటికే హుటాహుటీన హనుమంతరావు, ఉప్పునూతల, వైఎస్‌ వంటి కాంగ్రెస్‌ హేమాహేమీలు కిమ్స్‌ ఆసుపత్రికి చేరుకుని జనార్దన రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించారు. ప్రస్తుతం పిజెఆర్‌ మృతదేహాన్ని కార్యకర్తలు, అనుచరులు ఆయన స్వగృహానికి తరలిస్తున్నారు. కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే జనార్దన్‌ రెడ్డి కాంగ్రెస్‌ అధిష్టానంలోని పలువురు ప్రముఖులకు అత్యంత సన్నిహితులు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ జనార్దన రెడ్డి హఠాన్మరణంతో తీవ్ర ద్రిగ్భాంతికి గురై ఫోను ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. హైదరాబాద్‌ బ్రదర్స్‌లో ఒకడుగా విశేష పేరు ప్రఖ్యాతులు గాంచిన జనార్దన రెడ్డి మృతి ఊహించని పరిణామమని సహచరుడు మర్రి శశిధర రెడ్డి కన్నీరు మున్నీరవుతున్నారు. అన్ని రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ అధినేతలు జనార్దన్‌ రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించడానికి వస్తోన్నట్లు తెలుస్తోంది.

స్వపక్షంలో విపక్షం, Eenadu, 29th, Dec. 07

వాగ్దాన భంగాలపై వైరిపక్షం
రాజీలేని 'రాజ'కీయాల్లో కృష్ణపక్షం
కాంగ్రెస్‌లో పీజేఆర్‌ ప్రస్థానం
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
పీజేఆర్‌ విలక్షణ రాజకీయ నాయకుడు. సమస్యలతో రాజీ పడడం ఆయన నైజం కాదు. ఏ మాత్రం సర్దుకు పోయినా అందలం ఎక్కే అవకాశం ఉంటుందని తెలిసినా తాననుకున్న దానికే కట్టుబడ్డారు. తాను మంచి అనుకున్నదే చేస్తారు. దానివల్ల రాజకీయంగా తను నష్టపోయే పరిస్థితి ఉన్నా లెక్కపెట్టరు. ఆయనలోని ఈ మొండితనం ఆయన్ను అనేకసార్లు పదవులకు దూరం చేసిందని సన్నిహితులు అంటారు. 1994-99 మధ్య కాలంలో పీజేఆర్‌ తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటాలు చేశారు. 2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయినా పీజేఆర్‌ సమస్యలపై తన పోరాటం నుంచి పక్కకు తప్పుకోలేదు. హైదరాబాద్‌ నగరం, శివారు ప్రాంతాలకు సంబంధించి కాంగ్రెస్‌ విపక్షంలో ఉండి వాగ్దానాలకు కట్టుబడాలని ఆయన పట్టుబట్టారు. ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, ఐమ్యాక్స్‌, రిపబ్లిక్‌ ఫోర్జ్‌ కంపెనీ ఆస్తుల వేలం, తదితర అనేక అంశాల్లో ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక వేసిన సభా సంఘాల్లో ఎక్కువ శాతం పీజేఆర్‌ డిమాండ్‌తో వచ్చినవే కావడం గమనార్హం. ముఖ్యంగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్ధ్యం పెంపు విషయంలో ఆయన సహ శాసనసభ్యుడు మర్రి శశిధర్‌రెడ్డితో కలసి పెద్ద ఎత్తున ఉద్యమించారు. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ శాసన సభ్యునిగా ఉంటూ ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఈ సమస్యపై ఆందోళనదశలోనే పీజేఆర్‌, శశిధర్‌రెడ్డిలను హైదరాబాద్‌ బ్రదర్స్‌ అనే పేరు వచ్చింది. పోతిరెడ్డి పాడు అంశాన్ని పీజేఆర్‌ జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. దానివల్ల తెలంగాణాకు ముఖ్యంగా జంట నగరాల తాగునీటి అవసరాలకు ఇబ్బంది అవుతుందని వాదించారు. కాంగ్రెస్‌లో అసమ్మతినేతగా అంతా భావించినా ఆయనెప్పుడూ పార్టీ క్రమశిక్షణను తప్పకుండా సమస్యలపై మాత్రమే గళమెత్తారు. దాంతో పార్టీ అధిష్ఠానం ఎప్పటికప్పుడు ఆయనతో చర్చలు జరిపేది. పోతిరెడ్డిపాడు విషయంలో పీజేఆర్‌ డిమాండ్లతో అప్పటి కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ ప్రత్యేకంగా ఒక ఇంజినీర్‌తో దానిపై అధ్యయనం చేయించారు. పోతిరెడ్డిపాడు వల్ల ఇబ్బంది లేదని ఇంజినీరు తేల్చారు. పార్టీలో ఒకనిర్ణయం తీసుకున్నాక కొందరికి ఆమోద యోగ్యం కాకున్నా కట్టుబడి ఉండాల్సిందేనన్న పార్టీ సూచన మేరకు దానికి కొంత విరామాన్నిచ్చారు. పోతిరెడ్డిపాడు వివాదానికి ముందు పీజేఆర్‌ ప్రత్యేక తెలంగాణా విషయంలో తన వైఖరిని ఎప్పుడూ బయట పెట్టలేదు. పోతిరెడ్డిపాడుపై పీజేఆర్‌ రాజీలేని పోరాటం చేయడంతో తెలంగాణా వాదుల్లో ఆయన్ను హీరోను చేసింది. అప్పటినుంచి ఆయన ప్రత్యేక వాదిగా ముద్రపడ్డారు. హైదరాబాద్‌ నగరానికి మూడో దశ కింద కృష్ణాజలాలనే రప్పించాలనేది ఆయన డిమాండ్‌. డిపెప్‌ కుంభకోణంలో ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి సూరీడు పాత్రపై విచారణ కోసం పీజేఆర్‌ కొంతకాలంగా సభాసంఘం సమావేశాల్లో తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. సూరీడును ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన రెండు రోజుల క్రితం సిఐడి అధికారులను నిలదీశారు. ప్రభుత్వం గోదావరి నీటినితెచ్చే ప్రయత్నాల్లో ఉండడంతో దానిపై ఉద్యమం చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు.
మరణించే నాటికి ఆయన కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతినేతగా ఉన్నారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి ఆయనకు మధ్య బాగా ఎడం పెరిగి పోయింది. రాజకీయంగా విబేధాలతోపాటు జూబ్లీహిల్స్‌లో జరిగిన కారు సంఘటన రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది.వాస్తవానికి పీజేఆర్‌ ఆది నుంచి వైఎస్‌ వ్యతిరేకి కాదు. 1978లో వైఎస్‌, పీజేఆర్‌లు ఒకేసారి రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యేలయ్యారు. ఆ తరువాత 1988లో వైఎస్‌ ఆధ్వర్యంలో రాయలసీమ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో పెద్దఎత్తున నిరాహార దీక్షలు చేపట్టారు. ఆ దీక్షల ఏర్పాట్లన్నింటినీ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పీజేఆరే పర్యవేక్షించారు. ఆ తరువాత 1994లో పీజేఆర్‌ సీఎల్పీ నేత కాగా 1998లో వై.ఎస్‌ పీసీసీ అధ్యక్షుడయ్యారు. ఆ తరువాత నుంచి ఇద్దరి మధ్యా విభేదాలు మొదలయ్యాయి. 1999 ఎన్నికల్లో టిక్కెట్ల విషయంలో అవి మరింత ముదిరాయి. 1999 ఎన్నికల్లో పీజేఆర్‌ ఓటమి పాలవడం, వైఎస్‌ సీఎల్పీ నేత కావడంతో ఆ తరువాత ఇద్దరి మధ్యా విభేదాలు అలాగే ఉండి పోయాయి. 2004లో వైఎస్‌ సీఎం అయ్యాక అంతకుముందు ఆయన్ను వ్యతిరేకించిన అనేక మంది నేతలు ఆయనతో రాజీ పడిపోయారు. ఆయన వద్దకెళ్ళి ఇక మీతోనే ఉంటామంటూ సర్దుకు పోయారు. అటువంటి వారికి మంచి పదవులు దక్కాయి. అయితే పీజేఆర్‌ మాత్రం రాజీపడలేదు. వైఎస్‌ వ్యతిరేక వైఖరిని అలాగే కొనసాగించారు. దాంతో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. పీజేఆర్‌లేని మంత్రివర్గమా అని హైదరాబాద్‌ ప్రజలు ఆశ్చర్య పోయారు. వైఎస్‌తో ఏ మాత్రం రాజీపడ్డా తొలి మంత్రివర్గంలోనే పీజేఆర్‌కు పెద్దపీట వేసేవారని సీఎం సన్నిహితులు కూడా అంటుంటారు. సీనియర్‌ నేతగా మీకు అన్యాయం జరిగిందని ఎన్నో సార్లు దిగ్విజయ్‌సింగ్‌ పీజేఆర్‌తో అనే వారు. వైఎస్‌తో విభేదించినా పీజేఆర్‌ ఎన్నడూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగించలేదు. చివరి వరకు అసమ్మతి వాదిగా ఉన్నా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభ ఎన్నటికీ వెలుగొందాలనే కోరుకున్న నేత ఆయన. అదేవిధంగా చివరకు కాంగ్రెస్‌ వ్యవస్థాపక దినోత్సవం రోజున అదే సభా వేదిక వద్ద ఆఖరి శ్వాస విడిచారు.

పేదల మనిషి , Eenadu, 29th Dec.

పీజేఆర్‌కు ప్రముఖుల నివాళి
ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే, సీఎల్పీ మాజీ నేత
పి.జనార్దన్‌రెడ్డి


(పీజేఆర్‌) ఆకస్మిక మరణం పలువురిని కలచివేసింది. ఆయన మృతివార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, బొత్స సత్యనారాయణ, రఘువీరారెడ్డి, ముఖేష్‌గౌడ్‌, కొణతాల రామకృష్ణ, ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దానం నాగేందర్‌ తదితరులు నివాళులు అర్పించినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయా నేతలేమన్నారంటే...


*పోరాటపటిమగల నాయకుడు పీజేఆర్‌ అని మంత్రి రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు.
*పేదోళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఏకైక నాయకుడు పీజేఆర్‌ అని మంత్రి బొత్స సత్యనారాయణ నివాళులర్పించారు.
*పేదలకు, వేలాదిమంది కార్మికులకు నేతగా ఉన్న పీజేఆర్‌ ఇకలేరనే విషయాన్ని ఇంకా నమ్మలేకుండా ఉన్నామని మంత్రి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు.
*శాసనసభాపక్ష నేతగా, మాజీ మంత్రిగా, అంతకుమించి ప్రజల మనిషిగా ఉన్న పీజేఆర్‌ తమకు అత్యంత ఆప్తుడని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, నేతలు ఇంద్రసేనారెడ్డి, లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి, చింతా సాంబమూర్తి వ్యాఖ్యానించారు.
*పీజేఆర్‌ పేదల పక్షపాతని, పలు ప్రభుత్వ కుంభకోణాలను వెలికితీయడంలో ఆయనతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలున్నాయని సీపీఐ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, నారాయణ సంతాప సందేశంలో పేర్కొన్నారు.
*ప్రజా సమస్యల పరిష్కారానికి శాసనసభ బయటా, లోపలా పీజేఆర్‌ విశేషంగా కృషిచేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, శాసనసభాపక్ష నేత నోముల నర్సింహయ్యలు పేర్కొన్నారు.
*తెలంగాణ వాదంపై నిక్కచ్చిగా నిలిచిన ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెరాస అసమ్మతి ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు.
*పీజేఆర్‌ మృతి పార్టీకి తీరని లోటని పీసీసీ అధ్యక్షుడు జి.ఎస్‌.రావు వ్యాఖ్యానించారు.
* కార్మిక నేతగా కార్మికుల సంక్షేమానికి పీజేఆర్‌ చేసిన సేవలు చిరస్మరణీయమని సీఎల్పీ అభిప్రాయపడింది.
*కార్మిక నేతగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగిన పీజేఆర్‌ మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్‌.చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.
*అట్టడుగు స్థాయి నుంచి ఎదిగిన పీజేఆర్‌ ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉండే నాయకుడని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ పేర్కొన్నారు.
*అంకితభావంతో పనిచేసే నేతను కాంగ్రెస్‌ పార్టీ కోల్పోయిందని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి, రాష్ట్ర మంత్రులు కె.రోశయ్య, జి.చిన్నారెడ్డి, మండలి బుద్ధప్రసాద్‌, ఆనం రాంనారాయణరెడ్డి, కాసు వెంకట కృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.
*పీజేఆర్‌ మరణం కాంగ్రెస్‌ పార్టీకే కాకుండా తనకు కూడా వ్యక్తిగతంగా తీరని లోటని కేంద్ర బొగ్గుశాఖ సహాయ మంత్రి దాసరి నారాయణరావు పేర్కొన్నారు.
*పీజేఆర్‌కు నివాళులు అర్పించేందుకు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ శనివారం హైదరాబాద్‌కు రానున్నారు.
*మూడు దశాబ్దాలుగా జంటనగరాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధికి, ఆ ప్రాంతంలోని పేదలు, బడుగువర్గాల అభ్యున్నతికి పీజేఆర్‌ ఎనలేని కృషి చేశారని శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి పేర్కొన్నారు.
*పీజేఆర్‌ ప్రజల మనిషని, తనకు మంచి స్నేహితుడని, ఆయన లేనిలోటు బాధాకరమని తెదేపా నాయకుడు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.
*పీజేఆర్‌ హఠాన్మరణంపట్ల హోంమంత్రి జానారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
*కార్మికలోకం మంచి నాయకున్ని కోల్పోయిందని తెదేపా నేత దేవేందర్‌గౌడ్‌ అన్నారు.
నేటి ఆటా వేడుకలు రద్దు: అమెరికా తెలుగు సంఘం (ఆటా-2007) హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన ఆటా వేడుకల తొలిరోజు (శనివారం) కార్యక్రమాలు రద్దయ్యాయి.
రాజకీయ వేధింపులవల్లే మృతి అనుచరుడి ఆరోపణహైదరాబాద్‌, న్యూస్‌టుడే: రాజకీయ వేధింపులు, ఒత్తిడి కారణంగానే పి.జనార్దన్‌రెడ్డి మృతి చెందారని.. పీసీసీ ప్రధాన కార్యదర్శి, పీజేఆర్‌ సన్నిహితుడు జి.నిరంజన్‌ ఆరోపించారు. పార్టీ శ్రేయస్సు కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను పీజేఆర్‌ వ్యతిరేకించారని పేర్కొన్నారు.
- న్యూస్‌టుడే యంత్రాంగం

జనం గుండె చప్పుడు, Eenadu, 29th, Dec.07

ఆపన్నులకు అభయహస్తం
రాజీలేని వ్యక్తిత్వం సొంతం
పీజేఆర్‌... ఈ పేరు చెబితేనే జనంలో ఓ కదలిక. ఒక ఉత్సాహం. సమస్యలపై ఆయన కదిలితే అదో అలజడి. ఆయన తమ వెంట ఉన్నారంటే ప్రజల్లో ఒక ధీమా. అంతులేని విశ్వాసం. అర్ధరాత్రి తలుపు తట్టినా నేనున్నానంటూ వెంట నడుస్తారు. జనం బాధను పంచుకుంటారు. కొండంత అండగా నిలబడతారు.
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే

అర్ధరాత్రి తలుపు తట్టినా నేనున్నానంటూ ఆయన వెంట నడుస్తారు. జనం బాధను పంచుకుంటారు. కొండంత అండగా నిలబడతారు. ఆయన ఏ పదవిలో ఉన్నా నమ్మిన వారికి న్యాయం చేసేవరకు విశ్రమించరు. బడుగువర్గాలు, కార్మికులంటే ఎంతో ప్రేమ. పదవిలో ఉన్నా.. లేకున్నా.. ఆయనది రాజీలేని మనస్తత్వం. ఆయనే పబ్బతిరెడ్డి జనార్దనరెడ్డి. పీజేఆర్‌గా రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితులు. హైదరాబాద్‌ ప్రజల గుండెల్లో శాశ్వతంగా కొలువైన నేత. నగరంలో ఏమూల ఏపేదవాడికి ఏకష్టమొచ్చినా రెక్కలు కట్టుకుని వాలిపోయే జెన్నన్నను మృత్యువు మింగేసిందంటే జనం తట్టుకోలేకపోతున్నారు.
కార్మిక పక్షపాతి: 'ఓట్లతో గెలిచేవాడు కాదు... ప్రజల్లోంచి పుట్టుకొచ్చేవాడు అసలైన నాయకుడు...' ఈ వాస్తవం పీజేఆర్‌ జీవితంలో అక్షరసత్యం. సామాన్య కుటుంబంలో పుట్టి కార్మికునిగా కంపెనీలో చేరిన ఆయన కార్మికనేతగా ఎదిగారు. అనంతరం రాజకీయాల్లోచేరి అంచెలంచెలుగా ఎదుగుతూ కార్మిక మంత్రి అయ్యారు. మంత్రి పదవి చేపట్టినా... కార్మిక లోకానికి ఆయన ఎన్నడూ దూరం కాలేదు. ఆయన కార్మిక పక్షపాతి. పలు కర్మాగారాల్లో సంఘాలకు నాయకత్వం వహించిన ఆయన కార్మికులకు మెరుగైన జీవితం కోసం నిరంతరం పోరాడారు. 2003, నవంబరులో కూకట్‌పల్లిలోని ఐడీఎల్‌ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతిచెందారు. బాధితుల పక్షాన నిలిచిన పీజేఆర్‌ మునుపెన్నడూలేని విధంగా యాజమాన్యం నుంచి రూ.15 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగాన్ని బాధిత కుటుంబాలకు ఇప్పించారు. అదేవిధంగా 3నెలల క్రితం నాట్కోలో జరిగిన ప్రమాదంలోముగ్గురు కార్మికులు చనిపోతే వారి కుటుంబాలకు కూడా ఇదే రీతిలో నష్టపరిహారాన్ని ఇప్పించారు.
హైదరాబాద్‌ 'బిగ్‌' బ్రదర్‌: అర్ధరాత్రి ఏ ఆదప వచ్చినా 'మా జెన్నన్న పరుగెత్తుకు వస్తాడు...' అనే కొండంత నమ్మకాన్ని సామాన్య కార్మికులు, జనంలో నాటుకు పోయేలా చేయగలిగారు. నగరంలో పేదవాడికి అన్యాయం జరిగితే తక్షణమే ఆయన ప్రత్యక్షమయ్యేవారు. అది చివరికి తమ పార్టీ కార్యాలయానికి సంబంధించిన విషయమైనాసరే. నాంపల్లిలో నగర కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయ నిర్మాణం వల్ల కొన్ని కుటుంబాల వారు నిర్వాసితులవుతారని దాన్ని వ్యతిరేకించారు. ప్రజలకోసమే పార్టీ అనే భావంతో ఉండేవారు. ఈ మనస్తత్వమే ఆయన్ను హైదరాబాద్‌లో నంబర్‌ వన్‌ మాస్‌ లీడర్‌ను చేసింది. పాన్‌షాప్‌, సెలూన్‌, కిరాణాకొట్టు దేన్ని ప్రారంభానికైనా బేషజం లేకుండా రిబ్బన్‌ కత్తిరించడంలో ఆయన ముందుండేవారు. ఖైరతాబాద్‌ ప్రాంతంలోని ఇలాంటి అనేక షాపుల్లో ఆయన ఫొటోలే ఇందుకు నిదర్శనం. ఆయన పిలుపు ఇస్తే వేలమంది పోగయ్యే పరిస్థితి ఉండేది. 1999లో ఖైరతాబాద్‌ నుంచి ఓడిపోయినా ఆయన ప్రజలతో సంబంధాలు పోగొట్టుకోలేదు. జనంతోనే మమేకమయ్యారు. అదే ఆయనకు పూర్వవైభవాన్ని తెచ్చిపెట్టింది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేవారు. అసలు ప్రజలు మన దగ్గరికి రావడం కాదు, మనమే ప్రజల వద్దకు వెళ్ళాలి అనేది పీజేఆర్‌ సూత్రం. ఒకసారి మాట ఇచ్చారంటే దానికి కట్టుబడి ఉంటే నేతగా పేరుపడ్డారు.
అధికార 'ప్రతిపక్షం': ప్రజలకు చేసిన వాగ్దానాల అమలులో అధికారులను పరుగులెత్తించే వారు. అధికారపార్టీ కదా అని అధికారులు చెప్పినదానికి తలాడించే నైజం కాదు. అధికారంలో లేనప్పుడు ఒక మాట చెప్పి ఇప్పుడు మాట మార్చడమంటే ఆయనకు గిట్టేది కాదు. అధికారంలోకి వచ్చాక అనేక అవినీతి ఆరోపణలున్న అంశాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజీపడిపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. సమీక్షా సమావేశాల్లో ఆయన ప్రతిపక్షపాత్రలోనే కనిపించేవారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డితో ఆయన విభేదిస్తున్నా అనేకమంది రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలు పీజేఆర్‌ వైఖరిని తప్పుపట్టలేకపోయేవారు. పీజేఆర్‌ వ్యతిరేకులు కూడా ఆయనలోని రాజీలేని ధోరణని మెచ్చుకుంటారు. ఆయన ఏంచేసినా పార్టీకి, ఇందిరాగాంధి కుటుంబానికి మాత్రం ఎల్లప్పుడూ విధేయుడుగానే ఉన్నారు. తన కుటుంబ సభ్యులను సమాజంలో మంచి వ్యక్తులుగా చేయాలనే తపన ఉండేది. ఇందులో భాగంగా కుమారుడు విష్ణువర్దన్‌రెడ్డిని తన రాజకీయవారుసుణ్ని చేయాలని ఆయన అనుకున్నారు. పీజేఆర్‌లో ఆధ్యాత్మికత ఎక్కువ. జూబ్లీహిల్స్‌లో పెద్దమ్మ గుడి ఆయనలో భక్తి ప్రపత్తులకు నిదర్శనం. దేవాలయాన్ని ఆయనే దగ్గరుండి కట్టించారు. ఇప్పటికీ నిత్యం ఉదయాన్నే ఆయన గుడికివెళ్ళి పెద్దమ్మ సన్నిధిలో కొద్దిసేపు గడిపివచ్చేవారు.
గురుదేవోభవ: తన రాజకీయ గురువు మాజీ ముఖ్యమంత్రి అంజయ్య అంటే పీజేఆర్‌కు ఎనలేని గౌరవం. ఆయన్ను అగౌరవంగా మాట్లాడితే ఒప్పుకునేవారు కారు. అంజయ్య మరణం తరువాత ఆయన భార్య మణెమ్మను రాజకీయాల్లోకి తెచ్చి ఎంపీని చేశారు. ఇటీవలే లుంబినీ పార్కులో తన గురువు విగ్రహాన్ని నెలకొల్పారు.
తాను ఎదుగుతూ... నీడనిస్తూ: కేవలం తన ఎదుగుదలను మాత్రమే చూసుకుంటూ... నమ్మినవారిని తొక్కేసే కుటిల రాజకీయాలకు పీజేఆర్‌ దూరంగా నిలిచారు. తన నీడలో మరికొంతమంది నాయకులు రూపుదిద్దుకునే అవకాశాన్ని ఆయన కల్పించారు. దానం నాగేందర్‌, తెరాస ఎమ్మెల్యే పద్మారావులతో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శి నిరంజన్‌కూడా ఆయన శిష్యరికంలోనే రాజకీయ జీవితాన్ని మలుచుకున్నారు.


పీజేఆర్‌ హఠాన్మరణం, Eenadu, 29th, Dec.07




పార్టీ వేదిక వద్ద గుండెపోటు ఆసుపత్రికి చేర్చేలోపు మృత్యువాత మహానగరం దిగ్భ్రాంతి శోకసంద్రంలో అభిమానులు నేతల అశ్రు నివాళి నేడు అంత్యక్రియలు గ్రేటర్‌ హైదరాబాద్‌కు సెలవు హైదరాబాద్‌ - న్యూస్‌టుడే



పిలిస్తే పలికే నాయకుడు... కష్టాలెన్ని ఎదురైనా తుదిశ్వాస వరకు పార్టీ ఒడిలోనే బతకాలని తపించే కాంగ్రెస్‌వాది... అధిష్ఠానం ముందు తన వైఖరి కుండబద్దలు కొట్టే నిర్మొహమాటి... సమస్యలపై పోరాటంలో రాజీలేని యోధుడు... కార్యకర్తలకు గుర్తింపు లేకపోతే ఇబ్బంది తప్పదని తరచూ హెచ్చరించే హితైషి... కార్మిక నాయకుడు... ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పి.జనార్దన్‌రెడ్డి హఠాన్మరణం పాలయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌ నగర పార్టీ సమావేశంలో అభిమానించే కార్యకర్తల ఒడిలో కన్నుమూశారు. సికింద్రాబాద్‌ జ్యువెల్‌ గార్డెన్‌లో కాంగ్రెస్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ శాఖ నిర్వహిస్తున్న పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సభలోకి నడుచుకుంటూ వస్తున్న పీజేఆర్‌హఠాత్తుగా తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలి పోయారు. కార్యక్తలు ఆయన్ను ఆసుపత్రికి తరలించే లోగానే మరణించారు.
పీజేఆర్‌ జ్యువెల్‌ గార్డెన్‌కు వచ్చేసరికి సమయం ఉదయం పదిన్నర గంటలైంది. వేదికపై ముఖ్యమంత్రి వైఎస్‌ ప్రసంగిస్తున్నారు. నగరంలో ముఖ్యనేత పీజేఆర్‌ రాకపోవడంతో ఆయన అనుచరులంతా గార్డెన్‌ బయట వేచి ఉన్నారు. పది నిమిషాల్లో పీజేఆర్‌ వచ్చారు. 'పీజేఆర్‌ జిందాబాద్‌' నినాదాలతో ప్రాంగణం మారుమోగింది. కారుదిగి ఇరవై అడుగులు వేశారో లేదో పీజేఆర్‌ ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. పక్కనే ఉన్న అనుచరులు వెంటనే కారు వెనక సీట్లో పడుకోబెట్టారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.
మరోపక్క నగర కాంగ్రెస్‌ నేతలు పీజేఆర్‌కు స్వల్ప అస్వస్థత వచ్చిందని భావించి కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగించారు. ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ ప్రసంగించాక పీజేఆర్‌ మరణవార్త తెలిసింది. విషయాన్ని చెప్పకుండా 'పీజేఆర్‌ అన్న సీరియస్‌గా ఉన్నారు. కార్యక్రమాన్ని ముగిస్తున్నాం' అని దానం నాగేందర్‌ చెప్పారు. వారంతా కిమ్స్‌ ఆసుపత్రికి బయలు దేరారు.
కిమ్స్‌ ఆసుపత్రి వద్ద వైద్యులు పీజేఆర్‌ను పరీక్షించారు. అప్పటికే ఆయన చనిపోయారని గుర్తించారు. చివరి ప్రయత్నంగా అత్యవసర విభాగానికి తరలించారు. కృత్రిమశ్వాస కల్పించేందుకు యంత్ర పరికరాలతో మర్దనచేశారు. 15 మంది వైద్య నిపుణులు అరగంట పాటు శతవిధాలా ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో చనిపోయినట్లు ప్రకటించారు. అనంతరం ఆయనను దోమల్‌గూడలోని స్వగృహనికి తీసుకువెళ్లారు.
పీజేఆర్‌ హఠాన్మరణం నగర ప్రజలకు దిగ్భ్రాంతిని కలిగించింది. తమ ప్రియతమ నేత ఇకలేడన్న విషయాన్ని జీర్ణించుకోలేని అభిమానులు ఆగ్రహావేశాలు, ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ సహా కాంగ్రెస్‌ పార్టీ నేతలు, తెలుగుదేశం, తెరాస, వామపక్షాల నేతలు అశ్రునివాళులు సమర్పించారు
కిమ్స్‌లో ఉద్వేగం... వైద్య చికిత్సల కోసం పీజేఆర్‌ను తరలించిన కిమ్స్‌ ఆసుపత్రిలో ఉద్వేగం నెలకొంది. అపస్మారక స్థితిలో ఉన్నట్లు భావించిన పి.జనార్దన్‌రెడ్డిని అంబులెన్స్‌ నుంచి ఆసుపత్రి అత్యవసర సర్వీసుల విభాగానికి తరలించిన వెంటనే కిమ్స్‌ సి.ఇ.ఒ. డాక్టర్‌ బి.భాస్కర్‌రావు నేతృత్వంలోని వైద్యుల బృందం అరగంట పాటు శ్రమించారు. ఫలితం లేకపోవడంతో పీజేఆర్‌ మరణించారంటూ తెలిపారు. మరణవార్త విన్న అభిమానులు, ప్రజలు వేల సంఖ్యలో కిమ్స్‌ ఆసుపత్రికి తరలివచ్చారు. కొందరు ఆవేశంతో మంత్రి షబ్బీర్‌ అలీ, అంజన్‌ కుమార్‌ యాదవ్‌లను అడ్డగించారు. ఎంపీ వీహెచ్‌ జోక్యంతో పీజేఆర్‌ భౌతికకాయాన్ని చూసేందుకు అతికష్టం మీద వారు వచ్చారు. పీజేఆర్‌ మరణవార్తతో సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాలన్నీ రెండుగంటల పాటు వాహనాలతో స్తంభించి పోయాయి.
తరలివచ్చిన నేతలు పీజేఆర్‌ మృతి చెందిన సమాచారాన్ని తెలుసుకున్న రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు ఆసుపత్రికి ఇంటికి వచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌, నేదురుమల్లి దంపతులు, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి ఇక్బాల్‌ సింగ్‌, కేంద్ర మంత్రులు దాసరి నారాయణరావు, పళ్లంరాజు, రాష్ట్ర మంత్రులు కొణిజేటి రోశయ్య, కొణతాల రామకృష్ణ, రఘువీరారెడ్డి, షబ్బీర్‌అలీ, డాక్టర్‌ గీతారెడ్డి, ముఖేష్‌, ప్రభుత్వ సలహాదారు కె.వి.పి.రామచందర్‌రావు, సీనియర్‌ నేతలు ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ ఎం.సత్యనారాయణరావు, కోదండరెడ్డి, ఎంపీలు వెంకటస్వామి, వి.హనుమంతరావు, తెరాస అధినేత కె.చంద్రశేఖర్‌ రావు, సీపీఐ కార్యదర్శి నారాయణ, ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి, తెదేపా నేతలు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జి.సాయన్న, భాజపా నేతలు దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావు, ఇంద్రసేనారెడ్డి, క్రైస్తవ మతప్రచారకుడు కె.ఎ.పాల్‌, సినీ ప్రముఖులు శ్రీహరి, ఎం.ఎస్‌.రెడ్డి, బాబూ మోహన్‌, కార్మిక సంఘాల నేతలు వచ్చారు.
ఇంటి వద్ద శోకసంద్రం కిమ్స్‌ ఆసుపత్రి నుంచి పీజేఆర్‌ భౌతిక కాయాన్ని మధ్యాహ్నం 1.30 గంటలకు తీసుకువచ్చారు. అప్పటికే భారీ సంఖ్యలో అభిమానులు ఇంటికి చేరుకున్నారు. పీజేఆర్‌ మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకువస్తుండగా కుటుంబసభ్యులు, అభిమానుల రోదనలు మిన్నంటాయి. 'అన్నా... అన్నా... మమ్మల్ని వదిలి వెళ్లావా?' అంటూ ఆయన అనుచరులు ఏడుస్తూనే ఉన్నారు. భార్య సులోచన, కుటుంబసభ్యులు షాక్‌ నుంచి ఇంకా తేరుకోలేదు. ఇంటి పరిసర ప్రాంతాల్లో విషాదం అలుముకుంది.
నేడు అంత్యక్రియలు కార్మిక నేత, ఎమ్మెల్యే పి.జనార్దన్‌ రెడ్డి అంత్యక్రియలను శనివారం అంబర్‌పేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు కుటుంబ సభ్యులు, సన్నిహితులు తెలిపారు. పీజేఆర్‌ కూతురు అమెరికా నుంచి రావాల్సి ఉంది.
నేడు సెలవు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ప్రభుత్వం శనివారం సెలవు ప్రకటించింది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పి.జనార్దన్‌రెడ్డికి అంతిమ నివాళులు అర్పించేందుకు వీలుగా ప్రభుత్వం ఈసెలవు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం జీవో విడుదల అయ్యింది.





ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పి.జనార్దన్‌ రెడ్డి హఠాత్మరణం, Vartha 28th December


ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పీ.జే.ఆర్‌.ఈ రోజు ఉదయం 11:30 నిమిషాలకు గుండెపోటుతో మరణించారు. ఈయన వయస్సు59 సంవత్సరాలు.జువెల్‌ గార్డెన్స్‌ లో కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశం లో పాల్గోనేందుకు ఆయన కారు లో వచ్చారు.గేటు దిగుతుండాగా చెమటలు పట్టి ఒళ్లు చల్లబడి సృహ తప్పి పడిపోయాడు. వెంటనే దగ్గర లో వున్న కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.అక్కడ అతను గుండెపోటు తో పడిపోయాడని గుర్తించిన సిబ్బంది ఆపరేషన్‌ కు ఏర్పాట్లు చేస్తూండాగానే ఆయన తుది శ్వాస విడిచారు.ఈ విషయం తెలియగానే పార్టీలో విషాదం అలముకుంది. .

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే జనార్దనరెడ్డి హఠాన్మరణం, Andhra jyothi,28 th December

పి.జనార్దన రెడ్డి మృతితో ....ఖైరతాబాద్‌లో విషాదఛాయలుసోనియా, వైఎస్‌ దిగ్భ్రాంతి !!మిన్నంటిన అభిమానుల ఆగ్రహజ్వాలలుపరిస్థితి ఉద్రిక్తం.


హైదరాబాద్‌, డిసెంబర్‌ 28 : ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పి.జనార్దన రెడ్డి శుక్రవారం గుండెపోటుతో మృతిచెందారు. జువెల్‌ గార్డెన్స్‌ ప్రాంగణంలో కళ్ళు తిరిగి పడిపోవడంతో హుటాహుటీన మినిస్టర్‌ రోడ్‌లోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే 11.30 గంటలకు జనార్దన రెడ్డి కన్నుమూశారు. పి. జనార్దాన్‌ రెడ్డి హఠాన్మరణంతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి. జనార్దన్‌ రెడ్డి అభిమానులు, కార్యకర్తలు శోకసంధ్రంలో మునిగిపోయారు.

వివరాలు
పోరాట దురంధరుడు పిజెఆర్‌
జనార్దనరెడ్డి హఠాన్మరణంతో ఉద్రిక్త పరిస్థితులు
సోనాబాయ్‌ దేవాలయంలో చోరీ
హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం
ఉగ్రవాదుల దౌష్ట్యానికి బెనజీర్‌ భుట్టో బలి
ఓయూలో వేర్వేరుగా విద్యార్థి సంఘాల ఆందోళన
జువెనైల్‌ హోమ్‌ నుంచి 20 మంది పరారీ
నీలోఫర్‌ నుంచి అరుదైన శిశువుల డిశ్చార్జి
గాంధీభవన్‌లో కాంగ్రెస్‌పార్టీ వ్యవస్థాపక వేడుకలు
హైకోర్టుకు సంక్రాంతి సెలవులు
మందకృష్ణపై కోర్టు ధిక్కారం కేసు
ఎగ్జిబిషన్‌ కోసం సిద్ధమవుతున్న 'నాంపల్లి' మైదానం
నివ్వెర పోయిన నగరం

పీజేఆర్‌కు నేతల నివాళులు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 28 : పీజేఆర్‌ మృతికి పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన హఠాన్మరణం పార్టీకి, కార్యకర్తలకు తీవ్ర విషాదాన్ని కలిగించిందని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అన్నారు. పీజేఆర్‌ కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్థన్‌రెడ్డి, మంత్రి రఘువీరారెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్‌అలీ, ఎంపీ వీహెచ్‌తదితరులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి నగరానికి తీరని లోటని సీపీఎం, సీపీఐ ప్రకటించాయి. తెలంగాణా సంస్కృతికి పీఏఆర్‌ ప్రతీక అని కాంగ్రెస్‌లో ఉన్నా తెలంగాణా ఉద్యమానికి మద్దతు తెలిపారని గద్దర్‌ అన్నారు. అట్టడుగుస్థాయినుంచి ప్రజానాయకుడిగా ఎదిగారని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారని లోక్‌సత్తా నేత జయప్రకాశ్‌ నారాయణ అన్నారు.

పీజేఆర్‌ హఠాన్మరణం Eenadu 28-12-07

హైదరాబాద్‌, డిసెంబర్‌ 28 : ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పి.జనార్థనరెడ్డి హఠాన్మరణం చెందారు. అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు రావటంతో ఆయన మృతి చెందారు. సికింద్రాబాద్‌లోని జ్యువెల్‌ గార్డెన్స్‌లో ఈరోజు గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేశారు. ఇందులో పాల్గొనేందుకు ఆయన కారులో వచ్చారు. గేటు దిగుతుండగా ఆయనకు చెమటలు పట్టి ఒళ్లు చల్లబడి స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆయనను సమీపంలోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఆయన తీవ్రమైన గుండెపోటుతో అప్పటికే మరణించినట్లు తెలిపారు. ఉదయం 11.40 గంటలకు ఆయన మరణించినట్లు ధృవీకరించారు. ఈ వార్త తెలియగానే పార్టీలో విషాదం అలముకొంది. జనార్థనరెడ్డికి 59 సంవత్సరాలు. 1948లో జన్మించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై హైదరాబాద్‌లో కాంగ్రెస్‌పార్టీకి గుండెకాయగా మారారు.

Thursday, December 20, 2007

పరిరక్షణ ముసుగులో హస్తగతానికి కుట్ర Eenadu 21-12-2007



క్రైస్తవ ఆస్తుల చట్టం వద్దు వెనక్కితగ్గకపోతే ఆందోళన సర్కారుకు కేసీఆర్‌ హెచ్చరికహైదరాబాద్‌, న్యూస్‌టుడే: క్రైస్తవ సంఘాల ఆస్తుల పరిరక్షణ ముసుగులో వాటి ఆస్తులు, ఆర్థిక లావాదేవీలను హస్తగతం చేసుకునేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఆరోపించారు. క్రైస్తవ సంఘాల ఆస్తుల పరిరక్షణ పేరుతో చట్టం తీసుకొచ్చే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. మొండి వైఖరితో ముందుకెళ్తే ఆందోళనలను చేపట్టి అడ్డుకుంటామని గురువారమిక్కడ తెలంగాణ భవన్‌లో హెచ్చరించారు. చర్చి ఫాదర్లు, పాస్టర్లు, బిషప్పులను భవిష్యత్‌లో ప్రభుత్వమే నిర్ణయించనుందన్నారు. క్రైస్తవ సంస్థల ఆస్తులు వక్ఫ్‌, దేవాదాయ ఆస్తుల కంటే భిన్నమైనవిగా గుర్తించాలని సూచించారు. ఈ ఆస్తులు చట్టబద్ధంగా కొనుగోలు చేసినవనే అంశాన్ని విస్మరిస్తున్నారని అన్నారు. 'అంకితభావంతో సేవలు చేస్తున్న సంస్థల ఆస్తులను హస్తగతం చేసుకునే దిశగా సర్కారు ముందుకెళ్తోంది. చర్చిల్లో పెళ్లిళ్లు జరపడానికి ఉన్న షరతులను సరళతరం చేయాలని ఒకవైపు క్రైస్తవ సంస్థలు కోరుతుంటే.. మరోవైపు ఆస్తులను సొంతం చేసుకునేందుకు ప్రభుత్వం ఉపక్రమించడం దారుణం' అని మండిపడ్డారు.


పోతన కవిని కడప జిల్లాకు చెందిన వ్యక్తిగా పేర్కొంటున్నారని, ఇంతకంటే దారుణం మరొకటి లేదని కేసీఆర్‌ విమర్శించారు. వరంగల్‌ జిల్లాలో కవి పోతన కుటుంబీకులు ఇప్పటికీ ఉన్నారని, ఇలాంటి వాస్తవాలను విస్మరించి కడప ఉత్సవాల్లో పోతనను ఆ జిల్లా వ్యక్తిగా చెప్పడం దారుణమన్నారు. 'పోతనను కడప జిల్లా వ్యక్తిగా పేర్కొన్నందుకు తెలంగాణ ప్రజలకు కడప జిల్లా కలెక్టరు, మంత్రి క్షమాపణ చెప్పాలి' అని డిమాండ్‌ చేశారు.
ప్రజలే తేలుస్తారు: తెలంగాణ ప్రాజెక్టులకు ఎక్కువ నిధులిచ్చినట్లు సీఎం పేర్కొన్న అంశంపై కేసీఆర్‌ స్పందిస్తూ.. ఈ అంశాలన్నిటినీ ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ వాళ్లు మోకాలిపై నడిచినా ఓట్లు రావని, డిపాజిట్లు గల్లంతవుతాయని జోస్యం చెప్పారు.

Thursday, December 13, 2007

పిట్టల శ్రీశైలంకు బెయిల్‌ మంజూరు Andhra Jyothy

కందుకూరు, డిసెంబరు 13 (ఆన్‌లైన్‌): మావోయిస్టు కొరియర్‌ అనే ఆరోపణలతో ఈనెల ఐదున అరెస్టయిన జర్నలిస్టు పిట్టల శ్రీశైలంకు గురువారం బెయిల్‌ మంజూరైంది. శ్రీశైలంకు బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా ఆయన సోదరి కోమబోతు మంగ, సోదరుడు పిట్టల వెంకటేష్‌లు బుధవారం పిటీషన్‌ దాఖలు చేయగా నిర్ణయాన్ని గురువారానికి వాయిదా వేసిన కందుకూరు అడిషనల్‌ మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ ఎస్‌.చినబాబు బెయిల్‌ మంజూరు చేశారు. అలాగే శ్రీశైలంను విచారణ నిమిత్తం పోలీసు కస్టడీకి అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌ ను ఆయన తోసిపుచ్చారు.
అయితే ఈనెల 15వ తేది పోలీసు విచారణాధికారి ఎదుట ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు హాజరై విచారణకు సహకరించాలని కోరారు. అది కూడా పోలీసులు శ్రీశైలంను నాయయవాదుల సమక్షంలో మాత్రమే విచారించాలని మేజిస్ట్రేట్‌ స్పష్టం చేశారు. శ్రీశైలం సోదరి కోమబోతు మంగ పది వేల రూపాయలకు, సోదరుడు పిట్టల వెంకటేష్‌ ఐదు వేలకు పూచీకత్తు ఇచ్చిన మీదట నెల్లూరు జైలులో ఉన్న శ్రీశైలంను విడుదల చేయాలని ఆయన ఆదేశించారు. శ్రీశైలంకు బెయిల్‌ మంజూరు కోరుతూ దాఖలైన పిటీషన్‌పై నిర్ణయం వెలువడుతున్న సందర్భంగా సిఐ విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో సబ్‌ కోర్టు ఆవరణలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
మావోయిస్టు అగ్రనేత సాంబశివుడికి కొరియర్‌గా ఉంటూ కందుకూరులో ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి 10 లక్షలు తీసుకెళ్లి నల్గొండ జిల్లాలోని మల్లారెడ్డికి అందించేందుకు శ్రీశైలం కందుకూరు రాగా తాము అరెస్ట్‌ చేశామని పోలీసులు ఆయనపై అభియోగం మోపగా తనకు, మావోయిస్టులతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, కేవలం ఒక జర్నలిస్టుగా మావోయిస్టు నాయకులను ఇంటర్వ్యూ చేయటానికి మాత్రమే తాను కందుకూరు వచ్చానని శ్రీశైలం వాదిస్తున్న విషయం తెలిసిందే.

Tuesday, December 11, 2007

'జై తెలంగాణ' అంటేనే 'జై చిరంజీవ' Andhra Jyothy

చిరు రాకపై కేసీ ఆర్‌ సమాలోచనలు
హైదరాబాద్‌, డిసెంబర్‌ 11 (ఆన్‌లైన్‌): సినీ నటుడు చిరంజీవి రాజకీయ ఆరంగ్రేటంపై టీఆర్‌ఎస్‌లోనూ తర్జనభర్జన సాగుతోంది. తెలంగాణ సెంటిమెంట్‌ ఆయుధంగా పనిచేస్తోన్న తమకు.. చిరంజీవి పార్టీ ఏర్పాటు వల్ల ఎలాంటి నష్టం వాటిల్లగలదన్న అంశంపై పలువురు ముఖ్య నాయకులతో టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖరరావు మంగళవారం సుదీర్ఘంగా చర్చించారు. లాభనష్టాలపై ఒక అంచనాకు వచ్చిన ఆయన.. ప్రత్యేక తెలంగాణపై విధానపరంగా చిరంజీవి సానుకూల నిర్ణయం తీసుకున్నట్లయితే కలిసి పనిచేద్దామన్న అభిప్రాయం వ్యక్తంచేసి నట్లు తెలిసింది. తెలంగాణపై సానుకూలంగా స్పం దించకుండా చిరంజీవి కూడా ముందుకు వెళ్లలేరన్నది టీఆర్‌ఎస్‌ వర్గాల అభిప్రాయం.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సుముఖంగా ఉండి, ఆయనతో కలిసి పనిచేసినట్లయితే ఇరుపక్షాలకు మేలు జరుగుతుందన్నది ఆ వర్గాల అంచనా. తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను కాదని ఏకపక్షంగా ముందుకెళితే.. తెలంగాణ ప్రాంతంలో చిరంజీవి పార్టీకి ఆయన అభిమానుల నుంచి కొంత ఆదరణ లభించినా, మిగతా అన్ని వర్గాల ప్రజల నుంచి పెద్ద ఆదరణ లభించకపోవచ్చని నేతలతో కేసీఆర్‌ అన్నట్టు తెలిసింది. 'మనతో కలిస్తే తప్ప.. తెలంగాణలో ఆయనకు ఆశించిన ఫలితం దక్కదు. మనతో కలిస్తే ఆంధ్రా, తెలంగాణల్లో ఒక వెలుగువెలిగిపోవచ్చు. ఈ విషయాన్ని నేను రెండు మాసాల క్రితమే బహిరంగంగా చెప్పాను' అని ఆయన నేతలతో అన్నారు.

మాయాకు ఆంధ్రలో సీన్‌ లేదు!
చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిని కలుసుకోవడానికి ఢిల్లీ వెళ్లి వచ్చిన కేసీఆర్‌.. తాజాగా ఆ బంధం తమకు అంతగా లాభించదన్న అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఆమెతో జత కడితే జాతీయ రాజకీయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించవచ్చ ని భావించిన ఆయన.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మాయావతి ప్రయోగం పనిచేయదని అంటున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి బహిష్క­ృతుడైన ఆలె నరేంద్ర బీ ఎస్పీలో చేరడానికి మాయావతి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలోనే.. ఆమెకు దూరంగా ఉండాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

Thursday, October 25, 2007

మొయిలీకి వీర తెలంగాణ దెబ్బ చూపిస్తం కేసీఆర్‌ Eenadu

నిర్మల్‌, న్యూస్‌టుడే: 'కాంగ్రెస్‌ తన బండారాన్ని తానే బయటపెట్టుకుంది. తెలంగాణ ద్రోహులమని వారే చెప్పుకొంటున్నారు. రెండో ఎస్సార్సీ ఏర్పాటుచేస్తున్నట్లు నమ్మక ద్రోహపు మాటలు మాట్లాడిన వీరప్ప మొయిలీ.. నీకు వీర తెలంగాణ దెబ్బ చూయిస్తం'.. అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్‌రావు నిప్పులు చెరిగారు. గురువారం రాత్రి ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ పట్టణంలో 'ఆదిలాబాద్‌ జిల్లా ప్రజాచైతన్య సదస్సు' పేరిట ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రసంగం యావత్తూ కాంగ్రెస్‌, తెదేపాను దుయ్యబట్టారు. ప్రసంగపాఠం ఆయన మాటల్లోనే..
'50 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుంటున్నరు. నెహ్రూ చెప్పినట్లు భార్యాభర్తల్లా విడిపోదామంటే కాంగ్రెస్‌ అడ్డుపడుతోంది. కాంగ్రెస్‌, తెదేపా రెండూ తెలంగాణను నాశనం చేశాయి. వైఎస్‌ఆర్‌ పాలన స్వర్ణయుగమంటూ మొయిలీ కితాబిచ్చిండు. ఏది స్వర్ణయుగం? దుబాయ్‌ బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజనులు జ్వరాలతో పిట్టల్లా రాలుతున్నరు. 2004 ఎన్నికల్లో నమ్మినం. నమ్మక ద్రోహం చేసిండ్రని వారే చెప్పుకొంటున్నరు. రాష్ట్రంలో ప్రాజెక్టులను ఆధునీకరించి కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తామంటున్నారు. లోయర్‌ పెన్‌గంగ ప్రాజెక్టును ఎందుకు తెరపైకి తేలేదు. 22 ఏళ్ళుగా ఊసులేని మందాకినీ కాలువ ఏమైంది? ఉచిత కరెంట్‌, రూ. 2కే కిలో బియ్యం.. వీటికి మోసపోతే.. భవిష్యత్తులో గోసపడతాం. తెలుగుదేశం, కాంగ్రెస్‌లను భూస్థాపితం చేద్దం' అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

ఉత్తర కరోలినాలో వైభవంగా దసరా, బతుకమ్మ ఉత్సవాలు Andhra Jyothy

రలీగ్‌, అక్టోబర్‌ 25: దసరా, బతుకమ్మ పండుగలను నార్త్‌ కరోలినా ప్రవాస తెలుగువారు ఘనంగా నిర్వహించుకున్నారు. కార్బ్‌ట్రీ పార్క్‌లో జరిగిన ఈ వేడుకలకు రలీగ్‌, డుర్హమ్‌, కారీ ప్రాంతాల నుంచి వ ందల సంఖ్యలో తెలుగువారు తరలివచ్చారు. ఉదయం మొదలయిన వేడుకలు సూర్యాస్తమయంలోపు ముగిశాయి. ఈ సందర్భంగా పలువురు తెలుగువారు పండుగలతో తమకున్న తియ్యటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
మన సంప్రదాయాలను భవిష్యత్‌ తరాలు మర్చిపోకుండా ఉండేందుకు ఇటువంటి ఉత్సవాలు దోహదపడతాయని కడారు శ్రీలక్ష్మి, రామ్‌ప్రసాద్‌ అన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన డం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. తనకు తానుగా బతుకమ్మ తయారుచేయడానికి తమ కుమార్తె యుక్తి శ్రీని ప్రోత్సహిస్తామని వారు తెలిపారు. బతుకమ్మ పేరు వింటేనే తాను పులకించిపోతానని మంచినేని రూప అన్నారు.

తమ చిన్నతనంలో బతుకమ్మ ఉత్సవాలను ఉత్సాహంగా నిర్వహించుకునే వారమని, తమ ఇంటిలోనే కాకుండా పొరుగు ఇళ్ళకు కూడా వెళ్ళి బతుకమ్మలను అలంకరించడం మర్చిపోలేమని జలగం లతా నితిన్‌, శుంకు జ్యోతి రవీందర్‌ చెప్పారు. బతుకమ్మ గురించి చెప్పే కథలు ఆశక్తికరంగా వినేవారమని పొదిల సంధ్యా లక్షీనారాయణ అన్నారు. తమ సోదరీమణులు, వారిపిల్లలు అంతా ఒక చోటికి చేరుకుని బతుకమ్మను ఘనంగా నిర్వహించుకునే వారమన్నారు. ఆప్యాయతానుబంధాలు తమ మధ్య వెల్లివిరిస్తుండేవని తెలిపారు. కొత్తబట్టలు ధరించి ఆ తొమ్మిది రోజులూ ఉత్సాహంగా ఉండేవారమని గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
దివ్యశ్రీ వేమారెడ్డి దంపతులు, గోపి, స్వాతి బిరిచెట్టి, రాము, నరేందర్‌, విస్సు శ్రీధర్‌ తదితరులు వేడుకలో నవ్వులు పూయించారు. తెలంగాణా అభివృద్ది సంఘం , ట్రైయాంగిల్‌ ఎన్‌ఆర్‌ఐ తెలుగు అసోసియేషన్‌ తరపున ఆహూతులకు పొదిల లక్షీనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రవాసులేకాక రాయలసీయ, కోస్తాంధ్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాల ప్రవాస భారతీయులు ఈ వేడుక ల్లో పాలుపంచుకున్నారు. కడారు రామ్‌ప్రసాద్‌ వందన సమర్పణతో వేడుకలు ముగిశాయి.




తెలంగాణపై ఆచి తూచి... Andhra Jyothi

మెయిలీని నిలదీయలేకపోయిన కాంగ్రెస్‌ నేతలు
హైదరాబాద్‌, అక్టోబర్‌ 24 (ఆన్‌లైన్‌): రెండో ఎస్సార్సీ ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని ప్రకటించి కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్పమొయిలీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆశలపై నీళ్లు చల్లారు. గతంలో ఇదే విధంగా వ్యాఖ్యానించిన దిగ్విజయ్‌సింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన టీఆర్‌సీసీ నేతలు ఆ స్థాయిలో మొయిలీపై విరుచుకు పడలేకపోయారు. ఆచితూచి మాట్లాడారు. సిద్ధిపేట ఎంపీ సర్వే సత్యనారాయణ ఒక్కరే కాస్త గట్టి స్పందించారు. రెండో ఎస్సార్సీ వేయడం కంటే తెలంగాణ ఇవ్వలేమని చెప్పడమే సమంజసమని ప్ర జలు భావించే అవకాశాలున్నాయని అన్నారు. మొదటి ఎస్సార్సీ వే సేందుకు 23 నెలలు పట్టిందని, రెండో ఎస్సార్సీ వేసేందుకు మరో మూడు సంవత్సరాలు పడుతుందని పేర్కొన్నారు. దీనిని ప్రజలు వి శ్వసించరని అభిప్రాయపడ్డారు.
సీఎల్పీ సమావేశం తర్వాత పలువురు నేతలు విలేకరులతో ఇలా పేర్కొన్నారు. 'ప్రత్యేక తెలంగాణ ఏర్పా టును నేతలే కోరుకుంటున్నారా.... ప్రజలే కావాలంటున్నారా తెలి యాలంటే ఒక కమిషన్‌ ఏర్పాటు చేయాలి. రెండో ఎస్సార్సీనో... ప్రత్యేక కమిషనో ఏదో ఒకటి వేయాల్సిన అవసరమైతే ఉంది' అని కాంగ్రెస్‌ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. 'తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారు తప్ప ప్రత్యేక పీసీసీ కాదని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్‌ అభిప్రాయపడ్డారు. అయితే, ప్రత్యేక తెలంగాణ అంశం 2009 ఎన్నికల్లోగా తేల్చాలని కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ కోసం అయితేనే రెండో ఎస్సార్సీ ఆమోదయోగ్యమన్నారు.

Sunday, October 21, 2007

ఢిల్లీని అలరించనున్న బతుకమ్మ Andhra Jyothy

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 20 (ఆన్‌లైన్‌): ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూ ర్తిని ప్రతిబింబిస్తూ, ఆ ప్రాంత ప్రజలు తొలిసారి దేశ రాజధానిలో ఆదివారం పెద్దఎత్తున బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. న్యా యవాది నిరూప్‌ రెడ్డి నేతృత్వాన ఇక్కడ ఏర్పాటైన 'ఢిల్లీ తెలంగాణ సంఘం' తమవైన ఇతర కళారూపాలను కూడా ప్రదర్శించనుంది. 'మా భూమి' ఫేమ్‌ సంధ్యతోబాటు గట్టయ్య, దర్రోజు శ్రీనివాస్‌, ప్రహ్లాద్‌ తదితర కళాకారులు సాంస్క­ృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నకిరేకల్‌, కరీంనగర్‌ల నుంచి ఒగ్గు కళాకారులు, పాశం యాదగిరి నేతృత్వంలో తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి ప్రతినిధులు ఢిల్లీ చేరుకున్నారు. అమెరికాలోని తెలంగాణ వాసులు అక్కడ తమ సంస్క­ృతిని చాటుతున్నప్పుడు ఢిల్లీలో మాత్రం ఎందుకు నిర్వహించకూడదని భావించామని నిరూప్‌ చెప్పారు.

తెలంగాణకు ప్రత్యేక పీసీసీ అవసరం: కేకే Eenadu

హైదరాబాద్‌: తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకంగా పీసీసీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పీసీసీ మాజీ అధ్యక్షుడు కేశవరావు అభిప్రాయపడ్డారు. ఈ నెల 24న రాష్ట్రానికి రానున్న కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని ఆయన చెప్పారు. ఈ విషయంపై చర్చించడానికి టీఆర్‌సీసీ నేతలు కె.ఆర్‌.ఆమోస్‌; పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, నరసారెడ్డి, కమలాకర్‌ తదితరులు ఈరోజు కేకేను కలిశారు. రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణ విషయంలో అనుసరిస్తున్న వైఖరి గురించి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని ఇటీవలే ఢిల్లీలో కలిసి వివరించినట్లు ఆమోస్‌ తెలిపారు. రెండో ఎస్సార్సీతో సంబంధం లేకుండా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. ప్రత్యేక పీసీసీ విషయంలో ఇన్‌ఛార్జి అధ్యక్షుడు జీఎస్‌ రావు చేసిన వ్యాఖ్యలను ఆమోస్‌ తప్పుబట్టారు.

Monday, October 15, 2007

ఎన్నికలే అంతిమయుద్ధం: కేసీఆర్‌ Eenadu

నల్గొండ, భువనగిరి, న్యూస్‌టుడే: తెలంగాణ సమస్యలకు ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారం. రాబోయే ఎన్నికలే అంతిమయుద్ధం కావాలి.. జైలుకు వెళ్లద్దు.. లాఠీ దెబ్బలు తినొద్దు.. వ్యాపారాలు, ఉద్యోగాలు మానుకోవద్దు. ఎన్నికలనే వేదికగా చేసుకుందాం. రాజకీయశక్తిగా మనం ఎదగాలని తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా భువనగిరిలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. 100 మంది ఎమ్మెల్యేలు, 15 మంది ఎంపీలు గెలిపిస్తే.. వారే వచ్చి కాళ్లు మొక్కి తెలంగాణ రాసిస్తారు. జార్ఖండ్‌ బాటలో రాష్ట్రాన్ని సాధించుకుందాం. జెండా రాజకీయాలు, కాంట్రాక్టులతో గొడవలు పెడుతున్నారు. జెండాలు ఏం ఇచ్చాయి. అంతా మోసం చేస్తున్నాయి. ఎందుకు.. ఎవరికోసం జెండాలు మోస్తారని ప్రశ్నించారు. పోతిరెడ్డి పాడు తరలించారు. మూసీ ప్రక్షాళన మరిచిపోయారు. నిధుల ఊసులేదు. నిమ్స్‌ యూనివర్సిటీ రాలేదు. ఫ్లోరైడ్‌ భూతం 2 లక్షల మందిని వృద్ధులుగా మార్చేసింది. ఈ జెండాలు, పార్టీల మత్తు వదలి.. మన జెండా పట్టండి. మళ్లీ ఎన్నికల వలలో పడి మోసపోకండని హితవు పలికారు. చంద్రబాబు 9గంటల ఉచితవిద్యుత్తు, వై.ఎస్‌. రెండు రూపాయల కిలోబియ్యం పథకం అంటూ మళ్లీ మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. సింగరేణి బొగ్గు మనది.. గోదావరి నీళ్లు మనవి. ఎన్‌టీపీసీకి ఇచ్చే నీరు, బొగ్గుతో 12 గంటలు ఉచిత విద్యుత్తు మనమే ఇచ్చుకుందాం. ఓట్లు మందికేసి బతకొద్దు. యాచించే స్థితిని నుంచి శాసించే స్థాయికి ఎదగాలని కోరారు. తెదేపా, కాంగ్రెస్‌ దొందు దొందేనని.. జెండాలు వేరైనా ఇద్దరి ఎజెండా ఒకటే. తెలంగాణకు అభివృద్ధిలో పెద్దపీటని మరోసారి మోసం చేస్తున్నారన్నారు. 610 జీవో అమలు విషయంలో ఇద్దరూ నాటకాలాడుతున్నారు. ఏ పార్టీ కూడా చేయదు. జీవో 34తో నీరివ్వమని చెప్పేశారు. కాలువ తవ్వి ఎకరాకు నీరిస్తే రూ.1300 ఖర్చయితే.. తుంపర సేద్యానికి రూ.53వేలు అవుతాయి. 50లక్షల ఎకరాల నీరిస్తామని చెప్పేవి మాటలే. చంద్రబాబు, వై.ఎస్‌.లకు దగ్గరి పోలికలున్నాయని.. రైతు ఆత్మహత్యలు, బూటకపు ఎన్‌కౌంటర్లు, చేనేత కూలీల ఆకలిచావులు, మహబూబ్‌నగర్‌ వలసలు ఆగడం లేదు. సాగునీరు అందదు. ఫ్లోరైడ్‌ భూతం వదిలించరు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎందుకు నోరు విప్పడంలేదు. సీఎం మెడలు వంచండని డిమాండ్‌ చేశారు.

Thursday, October 4, 2007

వాషింగ్టన్‌లో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు Eenadu

వాషింగ్టన్‌: అమెరికా రాజధాని వాషింగ్టన్‌ నగరంలో తెలంగాణ ప్రజలు బతుకమ్మ పండగను ఎంతో భక్తిప్రపత్తులతో జరుపుకున్నారు. తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో దాదాపు 400మందికి పైగా తెలంగాణవాసులు పాల్గొనడం విశేషం. రాజేశ్‌ బాదం స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమయింది. అనంతరం తెలంగాణ సంప్రదాయ రుచులతో కూడిన భోజనాన్ని అతిథులకు వడ్డించారు. తరువాత జరిగిన ఆటపాటల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
రంగురంగుల బతుకమ్మలు...
మహిళలు సంప్రదాయ వస్త్రధారణతో తమతో తీసుకు వచ్చిన బతుకమ్మలపై రంగురంగుల పూలను దానిపై ఉంచి సంప్రదాయబద్ధంగా గానం చేశారు. దాదాపు రెండు గంటల సేపు జరిగిన ఈ వేడుక తెలంగాణ పల్లె జీవితాన్ని అమెరికాలో సాక్షాత్కరించింది. త్రిశ సంకినేని భరతనాట్యపదర్శన అందర్ని ఆకర్షించింది. సూర్యాస్తమయం సమయంలో బతుకమ్మలను నిమజ్జనం చేసి సత్తుపిండిని అందరికి పంచారు. ఆచార్య సవితానంద అవథూత ధ్యానంపై ఉపన్యాసమిచ్చారు. టీడీఎఫ్‌ చేపడుతున్న కార్యక్రమాల గురించి సంస్థ సమన్వయకర్త రాజేశ్‌ మాదిరెడ్డి సభికులకు వివరించారు. రవి పులి వందనసమర్పణతో కార్యక్రమం ముగిసింది. కళ్యాన్‌ ముద్దసాని, రమాకాంత్‌ పీచర, రాజేశ్‌ బాదం, సతీష్‌ మేదవరపు. అమర్‌ జన్నుపురెడ్డి. చంద్ర కంచర్ల, వెంకట్‌ రెడ్డి, అచ్యుత్‌ చుక్క, దీపక్‌ దేశ్‌పాండే, రాజేశ్‌ మాదిరెడ్డి, విష్ణు యాచమనేని, గీతా మేదవరపు, అరవింద ఎడ, శ్వేత, సుశీల... తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

కేసీఆర్‌ చరిత్రలో కలిసిపోతావ్‌ : పీసీసీ Andhra Jyothy

హైదరాబాద్‌, అక్టోబర్‌ 4(ఆన్‌లైన్‌): కాంగ్రెస్‌ పార్టీని.. ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని నోటికి వచ్చినట్లు విమర్శిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు చరిత్రలో కలసిపోవడం ఖాయమని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ జోస్యం చెప్పింది. గాంధీభవన్‌లో గురువారం పీసీసీ అధికార ప్రతినిధి ఎన్‌.తులసిరెడ్డి, కిసాన్‌సెల్‌ అధ్యక్షుడు ఎం.కోదండ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రతిసారి కాంగ్రెస్‌పార్టీని, వై ఎస్‌ను కేసీఆర్‌ దుర్భాషలాడడం గర్హనీయమని కోదండ రెడ్డి పేర్కొన్నారు. వాపును చూసి బలుపుగా టీఆర్‌ఎస్‌ భావిస్తోందని.. కరీంనగర్‌ పార్లమెంటు ఉప ఎన్నికను తెలంగాణ ఏకాభిప్రాయంగా భావించడానికి వీల్లేదని.. ఇదే ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు మొదటి రెండు స్థానాల్లో నిలిస్తే.. టీఆర్‌ఎస్‌ మూడో స్థానంలో ఎందుకు నిలిచిందని కోదండ రెడ్డి ప్రశ్నించారు.
టీఆర్‌ఎస్‌ పార్టీ కుటుంబ పాలనగా మారిందని.. ఎక్కడ చూసినా కేసీఆర్‌, ఆయన కుమారుడు, అల్లుడుల ఫోటోలే కన్పిస్తున్నాయి తప్పితే.. మరో నాయకుడికి తగిన గుర్తింపే లేదని చెప్పారు. గోధమతో సమానంగా.. లేదా.. అంతకంటే ఎక్కువ మద్ధతు ధరను వరికి ప్రకటించాలని తులసిరెడ్డి కేంద్రాన్ని కోరారు. వ్యవసాయం దండగ మారిదని భావించిన చంద్రబాబు పాలనలో వరికీ, గోధమకు మధ్య మద్ధతు ధరలో వ్యత్యాసం నెలకొందని చెప్పారు. 1994-95లో ఈరెండింటికీ మద్ధతు ధర 360 రూపాయలుంటే.. 2003-04లో గోధుమకు 630 రూపాయలు లభిస్తే.. వరికి మాత్రం 580 దక్కిందని చెప్పారు. ఈ వ్యత్యాసంపై ఆనాడే నిరసన తెలిపి ఉంటే.. ఈ రోజు ఈ విధానం కొనసాగేది కాదని ఆయన పేర్కొన్నారు.

Wednesday, October 3, 2007

దుబాయి.. ముంబయి.. బొగ్గుబావే! Eenadu

సమైక్యాంధ్రలో తెలంగాణ ప్రజల బతుకులు..

దుబాయి.. ముంబయి.. బొగ్గుబావే!

వైఎస్‌, చంద్రబాబు రాజకీయ బేహారులు

పొత్తులుండవ్‌, ఒంటరిగానే పోటీచేస్తాం

తెలంగాణ వస్తే ఉపముఖ్యమంత్రి ముస్లిమే:

కేసీఆర్‌

'స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశంలో అధికశాతం రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతే తెలంగాణా (హైదరాబాద్‌ రాష్ట్రం) రూ.63కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉంది. సమైక్యాంధ్ర ఏర్పడ్డాక, వలస పాలకుల దోపిడీతో తెలంగాణా సంక్షోభంలో కూరుకుపోయింది. అంటే తెలంగాణా వెనుకబడ్డది కాదు.. వెనకవేయబడ్డది'. 'తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయ్యాక ముస్లింలకు డిప్యూటీ సీఎంతోపాటూ.. నాలుగు మంత్రి పదవులు ఇస్తాం. ఒక లోక్‌సభ, మరొక రాజ్యసభ స్థానాలను కేటాయిస్తాం. విద్యా, ఉద్యోగాల్లో 12శాతం రిజర్వేషన్లను కల్పిస్తాం'.
- కేసీఆర్‌

కరీంనగర్‌ - న్యూస్‌టుడే
మధ్యంతర ఎన్నికల ఉరిమిపాటుతో ప్రజల వద్దకు వెళ్లేందుకు మొహం చెల్లక సీఎం వైఎస్‌, తెదేపా అధినేత చంద్రబాబులు జనాకర్షక మంత్రాలను జపిస్తున్నారని తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. కరీంనగర్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 'తెలంగాణా ద్రోహుల పార్టీకి అధ్యక్షుడు చంద్రబాబు.. నమ్మక ద్రోహులపార్టీకి చెందిన సీఎం వైఎస్‌లకు తెలంగాణాలో తిరిగే హక్కే లేద'ని పేర్కొన్నారు. వీరిద్దరూ రాజకీయ వ్యాపారులని ఆరోపించారు. 'రూ.రెండుకే కిలో బియ్యం ఇస్తామని వైఎస్‌ చెబుతున్నారు. మూడున్నరేళ్లుగా ఆయన ఏం చేశారు. పేదలు ఇప్పుడే గుర్తుకొచ్చారా. ఇది ఎన్నికల గిమ్మిక్కుకాదా'ని కేసీఆర్‌నిలదీశారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించాక ఉచితవిద్యుత్తు ఫైలుపై సంతకం పెడితే..అది ఉత్త విద్యుత్తుగానే మిగిలిపోయిందని విమర్శించారు. 'తొమ్మిదేళ్లు సీఎంగా ఊరేగిన చంద్రబాబు.. సేద్యమే దండగన్నడు. విద్యుత్తు బిల్లులు కట్టని రైతులపై కేసులు పెట్టి.. జైళ్లలో తోయించిండ'ని మండిపడ్డారు. 'వైఎస్‌.. చంద్రబాబులు దొందూ దొందే. ఫార్ములావన్‌, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌కు తెలంగాణా భూములను చంద్రబాబు అప్పగిస్తే.. ల్యాంకో, టాటా, బిర్లా, అంబానీలకు వైఎస్‌ తెగనమ్ముతున్నరు' అని దుయ్యబట్టారు. 'చంద్రబాబు, వైఎస్‌ల పాలనలో తెలంగాణ ప్రజల బతుకులు, దుబాయి ముంబయి బొగ్గుబాయిగా మారాయ'ని ఆవేదన వ్యక్తంచేశారు. 'స్వంత పాలనలో తెలంగాణాలో బతుకులు బంగారం అవుతాయి. తెలంగాణా ప్రజలు దీన్ని గుర్తించాల'ని సూచించారు.
బోగస్‌ యజ్ఞం: 'వైఎస్‌ చేస్తున్న జలయజ్ఞం.. ఒట్టి బోగస్‌. తెలంగాణాలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ ఎత్తిపోతల పథకాలే. వాటిని నడపడానికి 2500 మెగావాట్ల విద్యుత్తు అవసరం. ఇప్పుడు సేద్యానికి ఏడు గంటలని చెప్పి.. ఐదుగంటలు కూడా ఇస్తలేరు. ఇక ఎత్తిపోతల పథకాలకు విద్యుత్తును ఎక్కడనుంచి తెస్తారు? ఈ ప్రాజెక్టులు చేపట్టింది తెలంగాణాకు నీళ్లిచ్చేందుకుకాదు. కాంట్రాక్టర్ల నుంచి పర్శంటేజీలు దండుకునేందుకే' అని కేసీఆర్‌ విమర్శించారు. 'మధ్యంతర ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవు.. తెరాస ఒంటరిగానే పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. వారి అభీష్టం మేరకే ఒంటరిగానే బరిలోకి దిగుతామ'ని చెప్పారు.


నల్లగొండ వర్సిటీ పేరు మార్చాలని Andhra Jyothy

ఓయులో తెలంగాణ విద్యార్థుల ర్యాలీ
హైదరాబాద్‌, అక్టోబర్‌ 3 (ఆన్‌లైన్‌) : తెలంగాణ ప్రాంతాల్లో అనేక పోరా టాల ద్వారా సాధించుకున్న నల్గొండ యూనివర్సిటీకి తెలంగాణ మేధావుల, కవుల, నాయకుల పేర్లు పెట్టకుండా ఈ ప్రాంత వాసులను అవమానపరుస్తు న్నారంటూ తెలంగాణ విద్యార్థి సంఘం, తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభా గం నాయకులు బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలో తరగతులను బహి ష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఇది మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానపర్చడమేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అంతర్జా తీయంగా ఎంతో ఖ్యాతి గతించిన మహాత్మా గాంధీపేరు అంతర్జాతీయ, జాతీ య సంస్థలకు పెడితే తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఒక స్థానిక యూనివర్సి టీకి ఆయన పేరు పెట్టడం సమంజసమేనా అని విద్యార్థి సంఘాలు ప్రశ్నించా యి. ఇటీవల ఆంధ్రా, సీమ ప్రాంతాల్లోని వర్సిటీలకు అక్కడి కవుల, రాజుల పేర్లను పెట్టిన పాలకులు తెలంగాణ విషయం వచ్చేసరికి ఆ ఆనవాయితీని విస్మరిస్తున్నారని వారు పేర్కొన్నారు.ప్రభుత్వం స్పందించి యూనివర్సిటీ పేరు మార్చకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు.

Monday, October 1, 2007

చికాగోలో ఘనంగా 'బతుకమ్మ' Andhra Jyothy

చికాగో, సెప్టెంబర్‌ 29: సంప్రదాయ 'బతుకమ్మ' పండగను తెలంగాణా ఎన్నారైలు చికాగోలో ఇటీవల ఘనంగా జరుపుకున్నారు. ఉత్తర అమెరికా బతుకమ్మ పండగ ఐదవ వార్షికోత్సవాలను పురస్కరించుకుని వారు ఈ పండుగను జరుపుకున్నారు. సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ ఉత్సవానికి తెలంగాణా ప్రవాసులు అధిక సంఖ్యలో హజరయ్యారు. చిన్నాపెద్ద భేదం లేకుండా అన్ని వయస్సుల వారు బ్లూమింగ్టన్‌, విస్‌కాన్‌సిన్‌, ఇండియానా తదితర ప్రాతాలనుంచి విచ్చేసి బతుకమ్మ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.


ఆ రోజు ఉదయాన్నే లేచి బతుకమ్మ పండగకు సహజసిద్దమైన గునుగు పూలు, తంగేడు పూలు, బీర పూలు సేకరించారు. బతుకమ్మ పూలు అందుబాటులో లేనివారు స్థానికంగా లభించే పూలుతో బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఉదయం పది గంటల సమయంలో ప్రారంభమైన బతుకమ్మ విహారయాత్రలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ నిరంజన్‌ అల్లంనేని స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరూ తామకు తాము పరిచయం చేసుకున్నారు. తర్వాత వారంతా శ్రీనివాస్‌ రెడ్డి సిరికొండ, ప్రదీప్‌ దమిడిలు నిర్వహించిన వివిధ ఆటల్లో పాలుపంచుకున్నారు.

సంప్రదాయ తెలంగాణ వంటకాలతో మధ్యాహ్న భోజనం ఆరగించారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడారు. రకరకాలైన పూలతో అలంకరించిన బతుకమ్మలను మధ్యలో ఉంచి వాటి చుట్టూ చేరి నాట్యం చే స్తూ 'బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో' వంటి పాటలు పాడుతూ భక్తిపారవశ్యంలో తేలియాడారు. అనంతరం బతుకమ్మలను సమీపంలోని సరస్సులో నిమజ్జనం చేశారు.
బతుకమ్మ ఉత్సవాలు పూర్తయిన తర్వాత అందరూ సద్దులు పంచుకున్నారు. ఆటల్లో గెలుపొందిన వారికి వెంకట్‌ ఆర్‌ తుడి బహుమతులు అందజేశారు. ఎంపిక చేసిన 'ఉత్తమ బతుకమ్మ'కు శ్రీధర్‌ లోకా ప్రత్యేక బహుమతిని అందజేశారు. బతురమ్మను ఘనంగా నిర్వహించడంలో శ్రీనివాస్‌ రెడ్డి సిరికొండ, అశోక్‌ ముద్రకోళ్ల, ఉష ముద్రకోళ్ల, ప్రదీప్‌ దమిడి తమ వంతు సాయం చేశారు. నిరంజన్‌ అల్లంనేని ధన్యవాదాలు తెల్పుతూ వందన సమర్ఫణ చేయడంతో కార్యక్రమం ముగిసింది.

Sunday, September 30, 2007

తెలంగాణకు లిఫ్ట్‌లంటే... ఆంధ్రకు నీళ్లు దోచిపెట్టడమే Eenadu

వైఎస్‌ది బిత్తిరి సేద్యం నేను కాపలా కుక్కను: కేసీఆర్‌
''తెలంగాణలో తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులన్నీ లిఫ్టులే (ఎత్తిపోతలు). తెలంగాణకు లిఫ్టంటే నీళ్లన్నీ ఆంధ్రకు తెఫ్టే (దోచెయ్యడమే)! అదీ లోగుట్టు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గజదొంగల్లా కృష్ణా జలాలను ఆంధ్రకు తరలిస్తున్నరు. తెలంగాణకు తుంపర సేద్యమంటూ వైఎస్‌ కొత్తపాట పాడుతున్నడు. ఇక నుంచి ప్రతి నీటిచుక్కా డ్యాం నుంచి నేరుగా మొక్క మొదట్లో పడతదట! అట్ల తెలంగాణలో 50 లక్షల ఎకరాలకు నీరిస్తడట. ఇదీ వైఎస్‌ బిత్తిరి సేద్యం!'' తెరాస అధినేత కేసీఆర్‌ వ్యాఖ్యలివి. ఆదివారం ఇక్కడి తెలంగాణ భవన్లో 22వ విద్యార్థుల శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా కేసీఆర్‌ ప్రసంగించారు. కేసీఆర్‌ ప్రసంగం ఆద్యంతం వారి కేకలు, నినాదాలు, చప్పట్లతో మార్మోగిపోయింది. తెలంగాణలోని అన్ని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను గెలుచుకుని, తెరాస మద్దతు లేకుండా ప్రభుత్వాలు ఏర్పడలేని రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలని వారికి కేసీఆర్‌ ఉద్బోధించారు. కుక్కకు ఎముకేసినట్టు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులందరికీ వైఎస్‌ మంత్రి పదవులు, ప్రాజెక్టులు కట్టబెట్టారని కేసీఆర్‌ ఎద్దేవాచేశారు. ''మీ ఊళ్లలో కాంగ్రెస్‌, తెదేపా జెండాలు పట్టుకున్నోళ్లను నిలదియ్యండి. కరెంటు, నీళ్లు ఇవ్వని జెండాలను ఎందుకు మోస్తున్నరని అడగండి. మనం తెలంగాణ అనంగనె జై ఆంధ్ర, జై రాయలసీమ అని బొబ్బలు పెడతరు. శ్రీశైలం ప్రాజెక్టును సీమకు వదిలితేనే హైదరాబాద్‌ను తెలంగాణకు ఇస్తామని రాయలసీమ హక్కుల వేదిక నేత టీజీ వెంకటేశ్‌ అంటున్నడు. హైదరాబాద్‌ను నెత్తిల పెట్టుకుని తెలంగాణకు వచ్చినట్టు మాట్లాడుతున్నడు. ఎన్నికల్లో ఓట్ల యావతో చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నడు. పథకాలు ప్రకటిస్తున్నడు. వీటిని నమ్మొద్దు. తెలంగాణ వ్యాప్తంగా ఆరు లక్షల విద్యార్థులు బలీయశక్తిగా తయారైతే ప్రత్యేక రాష్ట్రాన్ని ఆపడం బ్రహ్మతరం కూడా కాదు'' అని వారికి సూచించారు. చదువులను పాడుచేసుకోకుండా శాంతియుతంగా తెలంగాణ భావవ్యాప్తి చేయాలన్నారు. తెలంగాణ వచ్చాక ఏ పదవీ తీసుకోకుండా తాను కాపలా కుక్కలా ఉంటానన్నారు.
తెరాస గ్రేటర్‌ హైదరాబాద్‌ జిల్లా కమిటీని పార్టీ ఎమ్మెల్యే నాయిని నర్సింహారెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే పద్మారావు అధ్యక్షతన 135 మందితో కమిటీ ఏర్పాటైంది.

TCA Telangana libaration Day in California


Monday, September 24, 2007

టీడీఎఫ్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ Eenadu

డల్లాస్‌: తెలంగాణ అభివృద్ధి ఫోరం(టీడీఎఫ్‌) ఆధ్వర్యంలో డల్లాస్‌లోని తెలంగాణ కుటుంబాలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని, బతుకమ్మ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. లేక్‌ లెవిస్‌విల్లే పార్కులో సెప్టెంబరు 22న జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 100 కుటుంబాలు పాల్గొన్నాయి. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. బతుకమ్మలతో పార్కు పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేయడానికి ఇందిరా జానకిరాం, ఉమా కరుణాకర్‌, స్వప్న శ్రీనివాస్‌ సహకరించారు. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా అధిక సంఖ్యలో పెద్దలు, చిన్నారులు హాజరయ్యారు. పురుషులు రెండు టీమ్‌లుగా విడిపోయి క్రికెట్‌ ఆడారు. కుతూరు సత్యవతి ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మ పాటలను పాడారు. చిన్నారులకు ఆటల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం సభ్యులు బతుకమ్మలను చెరువులో వదిలారు.
కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి శ్రీనివాస్‌ కుతూరు, స్వరూప్‌ కుండూరు, కరుణాకర్‌ దాసరి, రామ్‌రెడ్డి, మహేందర్‌, శ్రీకాంత్‌ తదితరులు సహకరించారు. కారక్రమాన్ని జయప్రదం చేసిన వాలంటీర్లకు, స్పాన్సరర్లకు, ఆహుతులకు టీడీఎఫ్‌ కోఆర్డినేటర్లు కృతజ్ఞతలు తెలిపారు.



Wednesday, September 19, 2007

అభివృద్ధి అవినీతిలోనే పార్టీపై 'సమాల్‌' ప్రభావం

గోనె ఆరోపణలు సీఎల్‌పీ కార్యాలయ కుట్ర

రెండో ఎస్సార్సీకి పార్టీ కట్టుబడి లేదు టీఆర్‌సీసీసీలో పదవుల యావ
'న్యూస్‌టుడే' ఇంటర్య్వూలో మధుయాష్కీ


నిజామాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానానికి రాష్ట్ర నాయకత్వం తప్పుడు సమాచారాన్ని అందిస్తోందని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు మధుగౌడ్‌ యాష్కీ ఆరోపించారు. తెలంగాణపై కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులను నిలదీయాలని పిలుపునిచ్చిన యాష్కీతో 'న్యూస్‌టుడే' ముఖాముఖి...

ప్రశ్న: సమాల్‌ నివేదిక ప్రభావం ఎలా ఉంటుందంటారు?

జవాబు: ప్రభుత్వంలో పనిచేసిన సీనియర్‌ ఉన్నతాధికారి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం పైన ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉంది. ఈ ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గు తేల్చాలి. ఎదురు దాడి సరి కాదు. సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షిస్తే ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్ళా. పార్టీపైనా దీని ప్రభావం ఉండదనుకోవడం సరికాదు.

ప్ర: పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు?
జ: తెలంగాణపై మాట్లాడితే పార్టీని వ్యతిరేకించినట్లు కాదు. తెలంగాణ విషయంలో రాష్ట్ర నాయకత్వం వాస్తవాలను దాస్తోంది. అధిష్ఠానానికి తప్పుడు సమాచారం ఇస్తోంది. ఇది సరికాదు.

ప్ర: మీ వ్యవహారశైలి పార్టీలో కొంత గందరగోళాన్ని సృష్టిస్తోంది. అసలు మీ వ్యూహం ఏమిటి?

జ: నాకు ఏ వ్యాపారాలూ లేవు. వృత్తిపరంగా నైపుణ్యం చాటుకొన్న తర్వాత ఒక నిబద్ధతతో, నా సామాజిక బాధ్యత గుర్తిస్తూ రాజకీయాల్లోకి వచ్చాను. ఆనాడు నాకు తెరాస, తెదేపా, భాజపాలు టికెట్టు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. సోనియా స్ఫూర్తితో కాంగ్రెస్‌లో చేరా. ప్రజలను మోసంచేయడం, పార్టీకి వెన్నుపోటు పొడవడం లాంటివి నేను చేయడంలేదు. ప్రజల నిజమైన అభిప్రాయాల్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళుతున్నా.

ప్ర: పార్టీని వీడిపోతారనే ప్రచారం?

జ: కాంగ్రెస్‌లోనే కొనసాగుతా.

ప్ర: ఈసారి మీకు టికెట్టు రాదని, అందుకే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చర్చ?

జ: కుహనా విధేయుల వ్యాఖ్యలివి. పార్టీ క్రమశిక్షణకు లోబడే ఉంటున్నా. నా పనితీరు గుర్తించిన అధిష్ఠానం ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించింది.

ప్ర: తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ రెండో ఎస్సార్సీకి కట్టుబడి ఉంది. మీరు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు?

జ: రెండో ఎస్సార్సీకి కట్టుబడి లేదు. కనీస ఉమ్మడి ప్రణాళిక(సి.ఎం.పి)లో చేర్చారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఈ అంశాన్ని చేర్చారు. రెండో ఎస్సార్సీ అంటే ఎలా? ప్రైవేటుగా తెలంగాణా కావాలనే వారు అధిష్ఠానం దగ్గరికి వెళ్లినపుడు మాత్రం తప్పుడు సమాచారం ఇస్తున్నారు. తద్వారా ప్రధానికి తప్పుడు సంకేతాలు అందిస్తున్నారు.
ప్ర: టీఆర్‌సీసీసీ ఉన్నా ఇతర వేదికల్లో పాల్గొనడం ఎందుకు?
జ: తెరాస కన్నా ముందే టీఆర్‌సీసీ ఏర్పడింది. ఎన్నికల తర్వాత సీనియర్‌ నాయకులు తెలంగాణ అంశాన్ని విస్మరించారు. పదవుల కోసం, వ్యక్తిగత లాభాలకోసం దీన్ని పక్కన పెట్టారు. గతంలో సీఎంను తీవ్ర పదజాలంతో విమర్శించిన వారే అభివృద్ధి పేరుతో తప్పుదోవ పట్టించారు. తెలంగాణా సాధన కోసం ఏ వేదిక అయినా సరే. కలిసి పోరాడాల్సిందే.
ప్ర: తెలంగాణలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదన్న వాదన వచ్చింది కదా?
జ: అభివృద్ధి ఎక్కడ జరిగింది? అవినీతి అక్రమాల్లోనా? అధిష్ఠానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. నిధులెక్కడ ఇస్తున్నారు? తెలంగాణా విశ్వ విద్యాలయమే దీనికి ఉదాహరణ. అభివృద్ధి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలకువెళ్ళాం. నిజామాబాద్‌ జిల్లాలో తెదేపా కన్నా 10 వేల ఓట్లు తక్కువగా వచ్చాయి. గతం కంటే కొంత మెరుగై ఉండవచ్చు.
ప్ర: ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌ గోనె ప్రకాశ్‌రావు మీపై వ్యక్తిగత విమర్శలకు దిగారు?
జ: దీని వెనకాల తెలంగాణను వ్యతిరేకించే లాబీ ఉంది. కాంగ్రెస్‌లోని పెద్దలు, సీఎల్‌పీ కార్యాలయం, మీడియా కో-ఆర్డినేటర్‌ కుట్ర ఉంది. నా నోరు మూయించేందుకు బెదిరింపు ఇది. నా జీవితం తెరచిన పుస్తకమే. మొత్తం వెబ్‌సైట్‌లో ఉంది. దీనిపైనా అధిష్ఠానానికి మొత్తం వివరించాను.
ప్ర: ప్రజాప్రతినిధులను నిలదీయాలని పిలుపునివ్వడం పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పించింది కదా?
జ: గత ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్ర అంశంతోనే గెలుపొందాం. ఏ పార్టీ వారైనా తెలంగాణాను ఏమి చేశారని ప్రశ్నించాలని చెప్పా. సామరస్యంగా శాంతియుతంగానే నిలదీయాలని పిలుపునిచ్చా. కేవలం కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులే కాదు, అందరినీ.

Tuesday, September 18, 2007

ఎన్ని ఆటంకాలొచ్చినా భూముల అమ్మకాన్ని ఆపొద్దు Eenadu

హైదరాబాద్‌ అభివృద్ధికే అధిక నిధులు ప్రతిపక్షాల వాదనను తిప్పి కొట్టాలి వనరుల సమీకరణ సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశం
ఆందోళనలు, ఇతరత్రా కార్యక్రమాలద్వారా ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా హైదరాబాద్‌లో భూముల అమ్మకాన్ని ఆపొద్దని, ఈ ప్రక్రియ సత్వరమే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అధికారులను ఆదేశించారు. భూముల అమ్మకం ద్వారా వచ్చే నిధులను హైదరాబాద్‌ అభివృద్ధికే వెచ్చిస్తున్నామంటూ విస్తృత ప్రచారం చేయడంద్వారా ప్రతిపక్షాల వాదనను తిప్పి కొట్టాలని సూచించారు. ఆర్థిక వనరుల సమీకరణపై ఆయన మంగళవారమిక్కడి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఆర్థిక మంత్రి రోశయ్య, పురపాలకశాఖ మంత్రి కోనేరు రంగారావు, వాణిజ్య పన్నులశాఖ మంత్రి కొణతాల రామకృష్ణ, అధికారులు ఇందులో పాల్గొన్నారు. హుడా భూముల అమ్మకాన్ని అడ్డుకునేందుకు తెరాస, ఇతర పార్టీలు చేసిన ఆందోళనను ముఖ్యమంత్రి తప్పుపట్టారు. భూముల అమ్మకంద్వారా వచ్చే ఆదాయాన్నంతా హైదరాబాద్‌కే వెచ్చిస్తున్న విషయాన్ని ఆయా పార్టీలు మరిచిపోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మెట్రో రైలుకు రూ.8,500 కోట్లు, ఔటర్‌ రింగ్‌రోడ్డుకు రూ.6,500 కోట్లు, హైదరాబాద్‌లో మురుగునీటి పారుదల వ్యవస్థకు రూ.2,500 కోట్లు, కృష్ణా నీటి సరఫరా రెండోదశకు రూ.వేయి కోట్లు, రేడియల్‌ రోడ్లకు రూ.2,500 కోట్లు, పీవీ నర్సింహారావు ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారికి రూ.500 కోట్లు, బలహీనవర్గాల గృహ నిర్మాణానికి రూ.6వేల కోట్ల చొప్పున వచ్చే మూడేళ్లలో రూ.27,500 కోట్లు హైదరాబాద్‌ అభివృద్ధికి వెచ్చిస్తున్నామనే విషయాన్ని ప్రజలకు వివరించాలని అధికారులకు వైఎస్‌ సూచించారు. పదేళ్ల క్రితంతో పోలిస్తే హైదరాబాద్‌ విస్తృతంగా అభివృద్ధి చెందినందువల్లే స్థలాల ధరలు పెరిగాయనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీలకు చెప్పాలని ఆదేశించారు. స్థలాల అమ్మకం ప్రక్రియను ముమ్మరం చేసి సకాలంలో లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.
పన్నులు పెంచం.. కొత్తగా వేయం: రోశయ్య
బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా అభివృద్ధి పనులను చేపట్టేందుకు పన్నులు పెంచడం, కొత్తగా పన్నులు విధించడం వంటి ఆలోచనేదీ సర్కారుకు లేదని ఆర్థిక మంత్రి రోశయ్య తెలిపారు. వనరుల సమీకరణ ఆశించిన స్థాయిలో లేకున్నా... ఈనెల కాకున్నా వచ్చే నెలలోనైనా లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి పనులకు లోటు లేకుండా పూర్తి స్థాయిలో చేపట్టాలంటే నిధులు కావాలని, బడ్జెట్‌లో నిర్దేశించిన పన్నుల వసూలుతోపాటు కేంద్రం నుంచి వచ్చే సాయంద్వారా వనరుల సమీకరణకు ప్రయత్నిస్తున్నామని రోశయ్య వెల్లడించారు.

Sunday, September 9, 2007

ఎస్సార్సీ వద్దు వేస్తే స్వయంకృతాపరాధమే! తెలంగాణ సెంటిమెంటే బలం

ఎన్నికల్లోపు తేల్చకుంటే మునిగిపోతాం
సోనియాను కలిసి చెబుదాం
టీఆర్‌సీసీసీలో ఏకాభిప్రాయం
హైదరాబాద్‌ భూముల ఆదాయం ఇక్కడే ఖర్చుపెట్టాలని తీర్మానం
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
రెండో ఎస్సార్సీ వద్దుగాక వద్దు.. రాష్ట్రమే కావాలి.. గడువు మించిపోతోంది.. ఇంకా ఆలస్యం చేస్తే పార్టీ తీవ్రంగా నష్టపోతుంది.. ప్రజల్లో తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉంది.. దీన్ని తక్కువ అంచనా వేసినా, ఉదాసీనంగా వ్యవహరించినా మునిగిపోవడం ఖాయం.

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ సమన్వయ సంఘం (టీఆర్‌సీసీసీ) సమావేశంలో వెల్లడైన ఏకాభిప్రాయమిది. కాంగ్రెస్‌ అధిష్ఠానం రెండో ఎస్సార్సీకే కట్టుబడి ఉన్నామని విస్పష్టంగా ప్రకటించిన అనంతరం శనివారం జరిగిన టీఆర్‌సీసీసీ సమావేశం ఆద్యంతం వాడివేడిగా సాగింది. ఎస్సార్సీ వేయడం స్వయంకృతాపరాధమే అవుతుందని ఒకరిద్దరు మినహా దాదాపు సభ్యులంతా అభిప్రాయపడినట్లు తెలిసింది. ఎన్నికలు సమీపిస్తున్నా తెలంగాణపై తేల్చకుండా నాన్చితే ఎన్నికలను ఎలా ఎదుర్కొంటామని పలువురు సభ్యులు ప్రశ్నించారు. ఎస్సార్సీ, అభివృద్ధి అంశాలను కొందరు ప్రస్తావించినా ఇప్పుడు వాటి గురించి చర్చించడం వల్ల ప్రయోజనం లేదని, తెలంగాణ ఇవ్వాలని కోరడమే శ్రేయస్కరమని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. రెండో ఎస్సార్సీని బహిరంగంగా వ్యతిరేకిస్తే అధిష్ఠానం నిర్ణయాన్ని, వర్కింగ్‌ కమిటీ తీర్మానాన్ని వ్యతిరేకించినట్లు అవుతుందని, దీనిపై బహిరంగంగా మాట్లాడకుండా టీఆర్‌సీసీసీ సభ్యులు బృందంగా వెళ్లి సోనియా దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. నిర్ణయాన్ని మాత్రం ఆమెకే వదిలిపెట్టాలని నిశ్చయించారు.
2009 ఎన్నికల్లో తెలంగాణపై నిర్ణయం తీసుకోకుంటే పార్టీకి తీవ్ర ఇబ్బందులు తప్పవని టీఆర్‌సీసీసీ మెజారిటీ సభ్యులు తేల్చి చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా అధిష్ఠానం నిర్ణయం తీసుకుని విస్పష్టమైన ప్రకటన చేయాలని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉండదని అభిప్రాయపడ్డారు. సమావేశంలో ఇద్దరు సభ్యులు మినహా హాజరైనవారంతా ఎస్సార్సీతో నిమిత్తం లేకుండా తెలంగాణ ఇవ్వాల్సిందిగా అధిష్ఠానాన్ని కోరాలని ప్రతిపాదించారు.
సుమారు నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో తెలంగాణకు సంబంధించి ఇతర కీలకాంశాలను చర్చించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో భూముల అమ్మకంపై ప్రభుత్వ వైఖరిని పలువురు సభ్యులు తప్పుపట్టారు. నిజాం షుగర్స్‌ను స్వాధీనం చేసుకోవడం, తెలంగాణ అభివృద్ధి, 610 జీవో అమలు, పదివేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలపైనా చర్చించినా.. అధిక సమయం తెలంగాణకే కేటాయించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం రెండో ఎస్సార్సీ వేస్తే తెలంగాణ రాష్ట్రం కోసం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను ప్రారంభించినట్లవుతుందని, అధిష్ఠానం నిర్ణయం కూడా ఇదే అయినపుడు వ్యతిరేకించడం భావ్యం కాదని పీసీసీ కిసాన్‌ సెల్‌ ఛైర్మన్‌ కోదండరెడ్డి ప్రతిపాదించారు. మెజారిటీ సభ్యులు ఆయనతో విభేదించారు. రెండో
ఎస్సార్సీ వూసే ఇప్పుడొద్దని స్పష్టంచేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూపీఏ ఎస్సార్సీ వేసే అవకాశాలే లేవని, బీఎస్పీ నాయకురాలు మాయావతి అసలే ఒప్పుకోరని మధు యాష్కీ వ్యాఖ్యానించారు. తెలంగాణ అంశాన్ని తేల్చకుండా ఎన్నికలకు వెళ్తే గత ఎన్నికల నాటి ఫలితాలు తారుమారవుతాయని ఎక్కువ మంది సభ్యులు అన్నారు.

అభివృద్ధితో ఓట్లు సాధిద్దాం: జీవన్‌రెడ్డి

'రెండో ఎస్సార్సీతో నిమిత్తం లేకుండా తెలంగాణ ఇవ్వాలని కోరుతున్నాం.. అధిష్ఠానం తిరస్కరిస్తే మరిన్ని చిక్కుల్లో పడతాం' అని మంత్రి జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మరేదైనా ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తే మంచిదని సూచించారు. దాని గురించి ఆలోచిస్తే ముందుకు వెళ్లలేమని, ఎలాగైనా తెలంగాణ అంశంపై అధిష్ఠానం నుంచి ప్రకటన వచ్చేందుకు కృషి చేద్దామని సభ్యులు అన్నారు. అభివృద్ధితో ఓట్లు సాధిద్దామని జీవన్‌రెడ్డి అనగా.. కరీంనగర్‌ ఉప ఎన్నికలో అభివృద్ధి ఏమైందని సభ్యులు ప్రశ్నించారు (ఈ ఉపఎన్నికలో జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ తరపున పోటీచేసి తెరాస అధినేత కేసీఆర్‌ చేతిలో ఓడిపోయారు). అభివృద్ధి కంటే సెంటిమెంటు బలంగా ఉందని పలువురు అన్నారు. అభివృద్ధి అంశం చర్చకు వచ్చినపుడు జీవన్‌రెడ్డి, సీనియర్‌ ఎమ్మెల్యే పీజేఆర్‌ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. 'అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు... ఎక్కడుంది అభివృద్ధి' అని పీజేఆర్‌ అనగా.. తాను కరీంనగర్‌ గురించి మాట్లాడుతున్నానని మంత్రి సమాధానమిచ్చారు.

సెంటిమెంటును కాదంటే అంతే!

కరీంనగర్‌ ఉప ఎన్నిక, సింగరేణి కార్మిక సంఘ ఎన్నికలు, శాసనమండలి ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉన్న విషయాన్ని స్పష్టంగా చూశామని, దీన్ని విస్మరిస్తే ఇబ్బందుల్లో పడతామని వీహెచ్‌, మధు యాష్కీ సహా మరి కొందరు సభ్యులు అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆంధ్రలోను కాంగ్రెస్‌ గెలుస్తుందని, కేంద్రంలో సోనియాగాంధీ నేతృత్వంలో ప్రభుత్వం రావడానికి తోడ్పడుతుందని వీహెచ్‌ అన్నారు. తెలంగాణను కాదంటే ఈ ప్రాంతంలో గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు తారుమారై తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరుతుందన్నది గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్‌రెడ్డి, పులివీరన్న తదితరులు వ్యాఖ్యానించారు. టీఆర్‌సీసీసీలో ఉన్న మంత్రులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేరని, ఈ నేపథ్యంలో టీఆర్‌సీసీసీని పునర్‌వ్యవస్థీకరించాలని ఎంపీ సర్వే సత్యనారాయణ అన్నారు. భూముల విక్రయాల అంశాన్ని తెలంగాణ ప్రణాళిక, అభివృద్ది మండలి ఛైర్మన్‌ ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి లేవనెత్తగా.. ఈ అంశంపై వీహెచ్‌, పీజేఆర్‌ మాట్లాడారు. దీంతో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో భూముల విక్రయాల ద్వారా వచ్చే రాబడిని ఇతర ప్రాంతాల అభివృద్ధికి వినియోగించకుండా ఇక్కడే వ్యయం చేయాలని అత్యధిక సభ్యులు అభిప్రాయపడ్డారు. 'అసలు డబ్బులెక్కడ వస్తున్నాయి.. ఎకరం భూమిని ఒక రూపాయికి ఇస్తుంటే' అని పీజేఆర్‌ విమర్శించారు.

అందరి కంటే ముందుంటా: మీరు రాష్ట్రం మొత్తానికి పీసీసీ అధ్యక్షుడు కావడం వల్ల మీకు కొన్ని ఇబ్బందులుంటాయి అని కేశవరావును ఉద్దేశించి సర్వే సత్యనారాయణ అన్నారు. కొందరు తనను శంకిస్తుంటారని, అందరికంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరేవాడిని తానేనంటూ కేకే స్పందించారు. నేను కొట్లాడినపుడు మీరంతా లేరని వ్యాఖ్యానించి.. తెలంగాణ రాష్ట్రం కోసం అందరికంటే తానే ముందుంటానని చెప్పారు.