Sunday, July 1, 2007

ి '610' రాగాలు Vaartha

వాద ప్రతివాదనలు, వేడి వేడి వ్యాఖ్యలు... వెరసి '610' రాగాలు
జిఒ అమలు పై సర్కార్‌ రాజకీయం
తెలంగాణ ఉద్యోగుల సంఘం
హైదరాబాద్‌, జూలై 1, ప్రభాతవార్త

610 జీవో అమలులోరాజకీయాలకు పాల్పడుతూతెలంగాణ జిల్లాల ఉద్యోగుల్లో అభద్రతా భావాన్ని ప్రభుత్వం కలిగిస్తున్నదని తెలంగాణా ఉద్యోగుల సంఘం ఆరోపించింది. స్థానికేతరులను గుర్తించి వారందరిని పంపించడంలో ఎలాంటి తారతమ్యాలు చూపకుండాన్యాయంగా నడుచుకోవలసిన ప్రభుత్వం ఇక్కడ కూడా కేవలం తెలంగాణ జిల్లాలకు చెందినస్థానికేతరులను మాత్రమేపంపించేలా చర్యలు తీసుకోవడం శోచనీయమని సంఘం నాయకుడు విఠల్‌ అన్నారు. నగర పోలీసు శాఖలో మొత్తం 3200 మంది స్థానికేతర కానిస్టేబుళ్లను గుర్తించారని,ఇందులో రెండు వేలమందిఆంధ్రా ప్రాంతానికి చెందిన వారుకాగా,మిగతా వారు తెలంగాణ జిల్లాలకు చెందిన వారు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.ఇందులోఆంధ్రా ప్రాంతం వారిని పంపించడంలోజాప్యం చేస్తూ తెలంగాణ జిల్లాలకు చెందిన కానిస్టేబుళ్లను పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం వెనుక రాజకీయం ఉందని ఆయన ఆరోపించారు.మొదట తెలంగాణ జిల్లాలవారినిపంపించి,610జీవో అంటే ఇదేనని చెబుతూ ఇక్కడి వారిలో అభద్రతా భావాన్ని పాదుకొల్పే కుట్ర సాగుతున్నదని ఆయన తెలిపారు.దాదాపుగాఇదేపల్లవినికాంగ్రెస్‌నాయకులు లగడపాటి రాజగోపాల్‌, గాదెవెంకట్‌రెడ్డిలు అందుకోవడాన్ని విఠల్‌ ఈ సందర్బ ంగా ఉదహరించారు. ఆంధ్రాకు చెందిన కానిస్టేబుళ్లను పంపించే విషయానికి వచ్చేసరికి ఏదో సాకులు చెబుతూ వారు కోర్టులను ఆశ్రయించేలా చేస్తున్నారని తెలిపారు. అలాగే 321 మంది ఎస్‌ఐలు, సిఐలు స్థానికేతరులుగా తేలితే అందులోనలభై మందితెలంగాణ జిల్లాలకు చెందిన వారుండగా,మిగతా వారంతాఆంధ్రా ప్రాంతానికిచెందిన వారని, వీరు జోనల్‌ విధానంలోకి వచ్చినప్పటికీ పంపించడంలో ఎందుకు జాప్యం జరుగుతున్నదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణా జిల్లాలకు చెందిన వారిని మొదట పంపించి, 610 జీవో అంటే ఇదేననే అభిప్రాయాన్ని పెంపొందించి అపోహలకు తావిచ్చేలా ప్రభుత్వం చర్యలు సాగుతున్నాయని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ఆయన హెాచ్చరించారు.
లగడపాటికి మతిభ్రమించింది
ఆంధ్రాహంకారం
అందుకే ఇష్టమొచ్చిన మాటలు: హరీష్‌
సిద్దిపేట అర్బన్‌, జూలై 1, ప్రభాతవార్త
విజయవాడ ఎం.పి.లగడపాటి రాజగోపాల్‌ ఆంధ్రాహాం కారముతోమతిభ్రమించి జి.ఒ.610పై అవగాహన లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ రావు ధ్వజమెత్తారు.మెదక్‌జిల్లా సిది ్దపేటలో ఆయన నివాసంలో ఆదివారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. జీవోపై ఆయనకు సరైన అవగాహన లేక టిఆర్‌ఎస్‌కు అవగాహన లేదని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. జీవోలు 390, 415లో ఆంధ్ర పక్షపాత బుద్ది స్పష్టంగా కనిపిస్తోందన్నారు.ఆ జీవోలను కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకించిన విషయం తెలియదా అని ప్రశ్నించారు. అన్ని తెలంగాణ జిల్లాల్లో నాన్‌ లోకల్‌ వారు ఉన్నారని తెలిపారు. అన్నదమ్ముల్లా విడిపోదామని టిఆర్‌ఎస్‌ కోరుతోంది తప్ప పరాయి దేశంలా వేరుపడదామని కోరడం లేదన్నారు.కరీంనగర్‌ ఉప ఎన్నికల్లోకాంగ్రెస్‌కుతెలంగాణ ప్రజలు బుద్ది చెప్పినా ఇంకా మేలుకోలేదన్నారు.
610 అమలులో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు
జీవో.610అమలులో ప్రభుత్వానికి ఏ మాత్రంచిత్తశుద్ది లేదనిహరీష్‌ విరుచు పడ్డారు.జీవోఅమలులో తెలంగాణ ప్రజల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.తెలంగాణేతరులను వెంటనే పంపిపంచాలని డిమాండ్‌ చేశారు.జీవోఅమలుకై టిఆర్‌ఎస్‌ మూడేళ్ళుగా ఓపిక పట్టామని.జీవో ఉల్లం ఘన జరగడం వల్లనే రాష్ట్ర క్యాబినేట్‌నుంచి తప్పుకున్నామని చెప్పారు.జీవో610 పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే ముల్కి ఉద్యమం చేపట్టాల్సి వస్తోందని హెాచ్చరించారు.తప్పనిపరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ప్రత్యక్ష యుద్ధానికిసిద్ధమవుతున్నారని తెలిపారు.ఓపిక నశించి సచీవాలయం ముట్టడికి సిద్ధమయ్యామని చెప్పారు. సచివాలయ ముట్టడికి వస్తున్న వారిని అరెస్టు చేస్తున్నారని, అరెస్టులు చేసినంత మాత్రాన ఉద్యమాన్ని ఆపలేరని హెాచ్చరించారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోమని హెాచ్చరించారు.

No comments: