Sunday, July 1, 2007

ముగిసిన తెలంగాణ మేధావుల సదస్సు andhra jyothi

తార్నాక, జూలై 1 (ఆన్‌లైన్‌): చారిత్రక తెలంగాణ ప్రాంతంలో జరిగిన సామాజిక, రాజకీయ, ఆర్థికపరమైన పోరాటాల్లో అణగారిన మెజారిటీ కులాలే ప్రముఖ పాత్ర పోషించాయని, అయితే అల్ప సంఖ్యాక ఆధిపత్య కులాల కుట్ర వల్ల వారి త్యాగాలకు గుర్తింపు లేకుండాపోయిందని విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, మేధావులు అభిప్రాయపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీపుల్స్‌ తెలంగాణ ఫౌండేషన్‌ ఆద్వర్యంలో 'పీపుల్స్‌ తెలంగాణ' అంశంపై రెండు రోజుల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు వివిధ అంశాలపై ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమాలపై దృక్ప«థాలు అనే అంశంపై డాక్టర్‌ తిరుమల మాట్లాడుతూ భూమి కోసం తెలంగాణ ప్రజలు 1940లో జరిపిన సాయుధ పోరాటం కంటే ముందు నుంచే సర్దార్‌ పాపన్న వంటి వీరుల నాయకత్వంలో పోరాటాలు చేశారన్నారు.
కులం, మతం, తెలంగాణ ఉద్యమ ప్రజాస్వామీకరణ అనే అంశంపై ప్రొఫెసర్‌ సింహ్రాద్రి మాట్లాడుతూ 1956లో తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పేరిట ఆంధ్ర ప్రాంతంలో కలపడం నుంచి నేటి టి.ఆర్‌.ఎస్‌. పార్టీ చేస్తున్న స్వార్థ రాజకీయ ప్రక్రియ వరకు మెజారిటీ ప్రజలు సమస్యలను పట్టించుకోలేదని అన్నారు. వారి సమస్యలతో సంబంధం లేకుండా అల్ప సంఖ్యాక ఆధిపత్య కులాల ప్రయోజనం కోసం పని చేశారని పేర్కొన్నారు. తెలంగాణలో కులం - అంబేద్కర్‌ దృక్ప«థం అంశంపై డాక్టర్‌ మల్లేశం మాట్లాడుతూ చిన్న రాష్ట్రాల ఏర్పాటు ప్ర«ధానంగా సామాన్యుడి సమస్యలైన కుల, పితృస్వామిక ఆధిపత్యాలను కట్టడి చేస్తుందన్నారు. అంబేద్కర్‌ ఆలోచనా విధానాలు-చిన్న రాష్ట్రాల ఏర్పాటు అనే అంశంపై డాక్టర్‌ జి.వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ నేటి దేశ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బహుజన సమాజ్‌ వంటి పార్టీల ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం జరగాలని అభిప్రాయపడ్డారు.

No comments: