Tuesday, July 3, 2007

610కి అటూ ఇటూ vaartha

ముట్టడి భగ్నం
టిఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు సహా 1,200మంది సచివాలయంవద్ద అరెస్టు
శివార్లలో అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్‌, జూలై 2, ప్రభాతవార్త సిటీబ్యూరో

తెలంగాణప్రాంత ప్రజలకు ప్రయోజనం చేకూర్చే 610 జిఒ అమలులో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ టిఆర్‌ఎస్‌ సోమవారం నిర్వహించిన సచివాలయం ముట్టడిని పోలీసులు భగ్నంచేశారు. టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నేతలు ఎన్నో వ్యూహాలురూపొందించుకుని ముందుకువచ్చినా విజయవంతం కాలేకపోయారు. ఉదయం నుంచే నేతలు వ్యూహరచన చేసి మధ్యాహ్నం కాగానే దఫదఫాలుగా కార్యకర్తలను సచివాలయంవైపు పంపించడానికిచేసిన యత్నాలను పోలీసులు ఎప్పటి ప్పుడు అడ్డుకున్నారు. ఇందిరాపార్క్‌వద్ద ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వయంగా నాయకత్వం వహించి ఆందోళలనుచేయగా,ఇదే సమయంలో సచివాలయం ప్రధాన మార్గం వద్ద మెరుపులా వచ్చేందుకుకూడా ప్రయ త్నించారు.అయితే ఎవరూ సచివాలయ గోడలుకూడా తాకలేకపోయారు. రెండుచోట్లా 1200 మం దిని అరెస్టుచేశారు. వీరిలో ఎంపీలు రవీంద్రనాయక్‌, మధుసూధన్‌రెడ్డితోపాటు 13 మంది ఎమ్మెల్యేలు,ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం ఆదివారంనుంచే భారీ భద్రత చేబట్టి జిల్లాలనుంచి వచ్చేవారిని ఎక్కడికక్కడే అరెస్టు చేసింది. అక్కడి పోలీసుల కళ్లుగప్పి సాధారణ ప్రయాణీకుల్లా బస్సులు, రైళ్లలో నగరానికి వచ్చిన మిగతావారిని శివారు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు.కాగా, ముట్టడికి ముందు ఇందిరా పార్క్‌వద్ద నిర్వహించిన ప్రదర్శనకు పోలీసులు అవాంతరం కలిగించలేదు. ఇలా వచ్చినవారిలో పార్టీ ఎంపీలు రవీంద్రనాయక్‌, వినోద్‌, ఎమ్మెల్యేలు హరీష్‌రావు, పద్మారావు, పద్మాదేవేందర్‌రెడ్డి, నాయిని నరసింహారెడ్డిలతో పాటు ఎమ్మెల్సీలు, పలువురు నేతలు ఉన్నారు.వీరంతా సచివాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బ ంగా పోలీసులకు, నేతలకు వాగ్వివాదాలు జరిగాయి.వారందరిని బల వంతంగా అరెస్టుచేసి నగరంలోని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.

ఇలావుంటే, సచివాలయంలోకి దూసుకుపోయేం దుకు 200మందివరకు కార్యకర్తలు తెలుగుతల్లి విగ్రహంనుంచి సచివాలయం ప్రధానమార్గం రోడ్డువద్దకు వచ్చారు.లుంబినీ పార్క్‌లోకి ఉదయమే చేరుకున్న వీరందరూ దఫదఫాలుగా బయట కొస్తున్నట్టు గమనించిన పోలీసులు వెంటనే అదు పులోకి తీసుకున్నారు. లుంబినీ పార్క్‌లో ఉన్న ఇతర కార్యకర్తలనుకూడా అరెస్టుచేశారు. ఉమాదేవి నేతృత్వంలోని మహిళల బృందం కారులోనుంచి దిగి నినాదాలు చేసుకుంటూ సచివాలయం ద్వారం నుంచి లోనికి దూరిపోయారు. వెంటనే పోలీసులు వారినికూడా అరెస్టు చేశారు. జంట నగరాలు, శివారు ప్రాంతాలలో ఐదువేలమందికి పైగా పోలీ సులను బందోబస్తు నిమిత్తం నియమించారు. పోలీసులు ఎక్కడా అతికి పోకుండా మర్యాదపూర్వ కంగానే వ్యవహరించడం గమనార్హం. సచివాలయం వద్ద అశ్విక దళాలను, టియర్‌గ్యాస్‌, వాటర్‌ కెనాన్‌లను సిద్ధంచేశారు. 15 ప్లాటూన్ల ఎపిఎస్పీ, నాలుగు ప్లాటూన్ల సిఆర్‌పిఎఫ్‌తోపాటు పెద్ద సంఖ్యలో హోంగార్డులు ఉదయం 6నుంచి సచివాలయంవద్ద మోహరించింది.


ఇందిరా పార్క్‌ వద్ద ఉద్రిక్తత
దోమలగూడ(ప్రభాతవార్త): తెలంగాణా జిల్లా ల్లోని పలు ప్రాంతాలనుంచి తరలివచ్చిన కార్య కర్తలు ఇందిరాపార్కుకు ఉదయమే చేరుకున్నారు. ఎంపీలు రవీంద్రనాయక్‌, మధుసూదన్‌రెడ్డి, ఎమ్మె ల్యేలు నాయిని నర్సింహారెడ్డి, హరీష్‌రావు, టి. పద్మారావు, డాక్టర్‌ నగేష్‌, ఎమ్మెల్సీ ంెహమాన్‌, వెంకటేశ్‌గౌడ్‌ తదితర నేతలు ధర్నా చౌక్‌ వద్దకు చేరుకుని, వందలసంఖ్యలో తరలివచ్చిన ఉద్యమ కారులతో కలసి ఊరేగింపుగా సచివాలయంవైపు కదిలారు. ఇలా కొద్దిదూరం వెళ్ళగానే భారీ ఎత్తున పోలీసులు అడ్డంరావడంతో ఉద్రికత్త నెలకొంది. కొద్దిసేపు పెనుగులాట తర్వాత ఆందోళనకారులను అరెస్టుచేసి వాహనాలలో గోషామహల్‌స్డేడియంకు, నేతలను పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు.

అరెస్టులకు భయపడం, ఉద్యమిస్తాం
610 జిఓ అమలును నీరుగార్చడానికి చేస్తున్న పన్నాగాలను సాగనివ్వబోమని టిఆరెసెల్పీ నేత జి.విజయరామారావు, ఉపనేత నాయిని నర్సిం హారెడ్డి, ఎమ్మెల్యేలు హరీష్‌రావు, పద్మారావులు హెాచ్చరించారు. అరెస్టులద్వారా ప్రభుత్వం ఉద్యమాన్ని ఆపలేదన్నారు. ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామన్నారు. ఇక్కడ ఉద్యోగాలలో తెలంగాణేతరులు 5వేలమంది కాదని 75000 మంది ఉన్నారని, న్యాయబద్దంగాచూస్తే 2లక్షల తెలంగాణవారి ఉద్యోగాలు ఆంధ్ర ప్రాంతం వారు తన్నుకుపోయారని వివరించారు. జిఓ అమలు పేరుతో తెలంగాణవారిని కూడా వారివారి ప్రాంతాలకు పంపించే కుట్ర చేస్తున్నారని, ఇలాంటి విధానాలే కొనసాగిస్తే గుజ్జర్లుచేసిన తరహాలో ఆందో'ళన తీవ్రం చేస్తామని హెాచ్చ రించారు.

ఇంత చేస్తున్నా... రాజకీయ రాద్ధాంతం
15నాటికి స్వచ్ఛంద బదిలీలన్నీ పూర్తి
విలేకర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌

హైదరాబాద్‌, జూలై 2, ప్రభాతవార్త610 జీవో అడ్డంపెట్టుకుని టిఆర్‌ఎస్‌ నాయకులు అనవసరంగా రాజ కీయం చేస్తున్నారని ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ఆరోపించారు. 30 ఏళ్లుగా ఏ ప్రభుత్వం అమలు చేయలేని రాష్ట్రపతి ఉత్తర్వులను అమలుకు శ్రీకారం చుట్టామని, అలాగే 20ఏళ్ల క్రితం జారీఅయిన 610జీవోను కూడా త్రికరణశుద్ధితో అమలు చేస్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు కావాలని రాద్ధాంతం చేయడం ఎంతవరకు సమంజసన్నారు. ఈ సమస్యను రాజకీయ లబ్ధికోసం కొన్ని శక్తులు వాడుకోవడం హాస్యా స్పదమని ముఖ్యమంత్రి విమర్శించారు. 610 జీవో అమలు తీరును నిరసిస్తూ టిఆర్‌ఎస్‌ సోమవారంతలపెట్టిన సచివాలయముట్టడిపై ఆయనను సచివాలయంలో సోమవారంజరిగిన ఒక కార్యక్రమంలో విలేకరులు ప్రస్తావించినప్పుడు పైవిధంగా స్పందించారు. ఇదివరకెన్నడూ జరగని విధంగా ఈ ఉత్తర్వుల అమలుకు తీసుకుంటున్న తమ చర్యలను అన్ని రాజ కీయపార్టీలూ తాము చేస్తున్న మంచిపనిని నిర్ద్వంధంగా సమర్ధిస్తూ, అభినందించాల్సిందిపోయి, రాజకీయ లబ్ధి కోసం ప్రజలను తప్పుదారిపట్టించే దిశగా ఆందోళనకు దిగడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రాష్ట్రపతి జీవోలో పొందుపరిచే అంశాలకంటే ఇంకా ముందుకు పోయి,ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడే దిశగా కృషి చేస్తున్నామన్నారు. 610జీవో అమలువిషయంలో సమస్యలేవీ లేకున్నా కావాలని పనిగట్టుకుని సృష్టిస్తున్నాయని ఎద్దేవా చేశారు. నిజానికి అదనంగా ఏడువేల పోస్టులు ఉండగా, 50వేలని, లక్షని, రెండులక్షలంటూ విపక్షాలు తమ ఇష్టమొచ్చే విధంగా మాట్లాడుతూ వాస్తవాలను వక్రీకరిస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. అదనంగా ఉన్న ఏడువేలపోస్టుల్లో ఆంధ్రా- తెలంగాణ ప్రాంతాలకు చెరోసగం వంతున ఉన్నట్లు తెలిపారు.ఏడువేల మందిలో మూడువేల మంది హోంశాఖ ఉద్యోగులన్నారు. మిగతా 4వేల ఉద్యోగులు ఇతర శాఖలకు చెందినవారని వీరిలో విద్యాశాఖకు చెందినవారే పెద్ద సంఖ్యలో ఉన్నారన్నారు. స్వచ్ఛందంగా సొంత ప్రాంతాలకు వెళ్లాలనకున్న ఉద్యోగులకు ఇప్పటికే ఉత్తర్వులు జారీచేస్తున్నామని, ఈ నెల 15వ తేదీనాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాలని అధి కారులను ఆదేశించామన్నారు. ఆ తర్వాత డెప్యుటేషన్‌పై వచ్చి అక్రమపద్ధతిలో ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్నవారిని వెనక్కి పంపే కార్యక్రమం చేపడతామన్నాను. ఇందుకోసం ఎన్జీవో సంఘాల ప్రతినిధులతో కూడా ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ, వారి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటున్నామన్నారు.బదిలీ ఉత్తర్వులు జారీచేసే విషయంలో అనవసరమైన అపోహలకు పోవద్దన్నారు.స్థానికేతరులు వారంతట వారుపోతుంటే కాదు, కూడదని చెప్పే అధికారం ఎవ్వరికీ లేదన్నారు. అంతేగాక ఏమి చేసినా బడ్జెట్‌ నిర్వహణ, ఆర్థిక క్రమశిక్షణ చట్టానికి లోబడే ఏదైనా చేయాల్సి ఉంటుందని, ఈ విషయంలో ఏ పొరపాటు చేసిన రూ.6వేల కోట్ల కేంద్ర ప్రభుత్వ గ్రాంటు తగ్గిపోతుందన్నారు. అందువల్ల రాబడులు, వ్యయం అనేఅంశాలు చాలా కీలకమని, వాటి మార్గదర్శకాల పరిధిలోనే పాలనాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. 1975నుంచి 124జీవో ప్రకారం ఉద్యోగుల బదిలీలు చేపట్టే ప్రక్రియ కూడా మొదలుపెడతామన్నారు. హోంశాఖతోపాటు మిగతా అన్నిశాఖలోనూ ఆనాడు ఉండే 80:20 నిష్పత్తిలో స్థానికులు, స్థానికేతరుల (ఓసి) బదిలీలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ లెక్కన స్థానికేతరులు కేవలం మరో ఐదు లేదా పదిశాతం మందే పెరగొచ్చని ముఖ్యమంత్రి వైఎస్‌ తెలిపారు. ఎవ్వరూ ఏదీ అడగడానికి వీలులేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా 610జీవోను అమలుచేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ బదిలీల ప్రక్రియలో తప్పులు జరగకూడదని, చిన్నపాటి తప్పులు జరిగినా మీడియా పెద్దవిగా చూపెడుతుందని వ్యాఖ్యానించారు. పోలీసులను వెనక్కి పంపితే అందుకు ప్రత్యామ్నాయంగా 3నుంచి 6నెలల వరకు కొందరిని డెప్యుటేషన్‌లో నియమించే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు.
స్థానికేతరులు 7,123 మంది!
610 పై మంత్రుల ప్రకటన
అడిగిన వారందరినీ పంపబోమని, అధికంగా ఉంటేనే పంపుతామని వెల్లడి
'స్వచ్ఛంద'కు 15 రోజుల గడువు
నాన్‌లోకల్‌ రిజర్వేషన్‌ లేదు
20,30,40 శాతాలు ఓపెన్‌ కోటాయే
పోలీసులకు బదిలీ, ఆ వెంటనే ఏడాది డిప్యుటేషన్‌
హైదరాబాద్‌, జూలై 2 ప్రభాతవార్త

No comments: