Tuesday, July 3, 2007

లగడపాటీ.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు మధుయాష్కీ డిమాండ్‌ andhra jyothy

లగడపాటీ.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు మధుయాష్కీ డిమాండ్‌
హైదరాబాద్‌, జూలై 2 (ఆన్‌లైన్‌) :'తెలంగాణ' కోరుకోవడమంటే.. భారత్‌-పాకిస్తాన్‌లను విడదీయడం వంటిదంటూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ చేసిన వ్యాఖ్యలు.. ప్రత్యేక రాష్ట్ర వాదులను.. తెలంగాణా ప్రజల ఆకాంక్షలను అవమానపరచేవిగా ఉన్నాయని నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీగౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వాఖ్యలపై లగడపాటి తక్షణమే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.
అమెరికా వెళ్తున్న ఆయన మార్గమధ్యంలో లండన్‌ విమానాశ్రయం నుంచి సోమవారం 'ఆన్‌లైన్‌'తో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వాదాన్ని భారత్‌-పాకిస్తాన్‌లతో పోల్చడమేమిటని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు లగడపాటి అవగాహనా రాహిత్యాన్ని రుజువు చేస్తున్నాయని పేర్కొన్నారు.
610 జీవో అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదుప్రభుత్వానికి 610 ఉత్తర్వును అమలు చేయాలన్న చిత్తశుద్ధిలేదని మధుయాష్కీ గౌడ్‌ అన్నారు. ఈ సమస్య పరిష్కారం కాకుండా పెడదోవ పడుతోందని.. ఇలాంటి సమయంలో తెలంగాణ వాదులంతా సమైక్యంగా పోరాడాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

No comments: