Friday, December 28, 2007

పీజే ఆర్‌ హఠాన్మరణం , Andhra Jyothi, 29th Dec, 07

కార్యకర్తల ఒడిలోనే ఒరిగిన నేత
ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే కన్నుమూత
శోకసంద్రమైన భాగ్యనగరం
పార్టీ వ్యవస్థాపక దినం రోజే తుదిశ్వాస
ఆఖరిమాట ' ఇందిరమ్మ'
అధికార లాంఛనాలతో నేడు అంత్యక్రియలు
ఆఖరి ప్రస్థానం ఉదయం 6.00 గంటలకు పెద్దమ్మగుడిలో పూజ 9.00 గంటలకు గాంధీభవన్‌ చేరిక 9.30 గంటలకు గాంధీభవన్‌నుంచి బయటకు 10.20 గంటలకు సికింద్రాబాద్‌ జ్యుయెల్‌గార్డెన్‌కు చేరుకుని గేటులోపల అడుగుపెట్టి కుప్పకూలారు 10.30 గంటలకు గార్డెన్‌ నుంచి హుటాహుటిన ఆస్పత్రికి 10.45 గంటలకు ఆస్పత్రిలోపలికి చేరుకున్నారు 11.30గంటలకు పీ జే ఆర్‌ మరణవార్త ప్రకటించారు ఆయన ఇక లేరని తెలిసి రాజధాని ఆర్తనాదం చేసింది. అన్నా అని పిలిస్తే నేనున్నాననే గొంతు మూగబోయిందని తెలిసి పట్నం గుండె పగిలింది.
గూడులేని వారికి నీడై, కష్టజీవులకు కొండంత అండై, అసహాయులకు ఆపన్నహస్తమై నిలిచిన నాయకశిఖరం కూలిందని జనదుఃఖం కట్టలు తెగింది. కాంగ్రెస్‌ నాయకుడు, కార్మికోద్యమనేత, మాజీ ప్రతిపక్ష నాయకుడు పి.జనార్దనరెడ్డి శుక్రవారం నాడు ఉద యం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. జనమేజీవితంగా గడిపే జనార్దనరెడ్డి తనకు ప్రాణప్రదమైన అనుచరగణం మధ్య, వారి చేతుల్లోనే ఆఖరిశ్వాస వదిలారు. అధిష్ఠానానికి తప్ప మరెవరికీ విధేయుడిని కానని రుజువుచేసుకుంటూ, ఆఖరిక్షణాల్లో కూడా ఇందిరపేరునే ఉచ్చరించారు.
సొంతపార్టీ ప్రభుత్వమే అయి నా, సమస్యల విషయంలో పాలకగణానికే పక్కలో బల్లెంలా మెలిగారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆయన సామాన్యుల మనిషి. మిరుమిట్లు గొలిపే అభివృద్ధి నీడన నలిగే చీకటిబతుకుల పక్షానే ఆయన పోరాటం. మహానగరం కడుపులో దాగిన పల్లెటూరు అతను. పదవులెన్ని చూసినా పెద్దమ్మ కొడుకే. నేల విడిచి సాముచేయని భూమి పుత్రుడే. అందుకే జనార్దనరెడ్డిని అన్ని పార్టీల వారూ ఆర్ద్రంగా స్మరించుకుంటున్నారు. శనివారం జరిగే ఆయన అంతిమయాత్రను కాంగ్రెస్‌ పార్టీ, ప్రభు త్వం, జనార్దనరెడ్డి అభిమానులు పెద్దఎత్తున జరుపనున్నారు.

No comments: