Friday, December 28, 2007

ప్రజల మనిషి అనడానికి , Andhra Jyothi, 29th Dec, 07

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ప్రాంతంలో ఒక్కసారి తిరగండి. అక్కడి టీ బంకుల్లో తేరిపార చూడండి. సెలూన్లను పరిశీలించండి. రోడ్డుపక్కనున్న చెప్పుల షాపులో తొంగి చూడండి. పాన్‌ షాపుల్ని పరిశీలించండి. చాలావాటిల్లో ఒక ఫొటో కనిపిస్తుంది. చిరునవ్వుతో రిబ్బ న్‌ కత్తిరిస్తున్న పి.జనార్దన్‌రెడ్డి... పక్కన నవ్వుతూ నిలబడ్డ కొట్టు యజ మాని, ఇతర జనం. పీజేఆర్‌ జనం నాయకుడు అనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
కూకట్‌పల్లి-అమీర్‌పేట దారిలో ట్రాఫిక్‌ స్తంభించింది. ఎవరికి వారు హారన్లు కొడుతున్నారు. కాస్త సందు దొరికితే ముందుకు దూరి పోతున్నారు. అంతలో... కారులోంచి ఖద్దరు కట్టుకున్న ఓ నాయకుడు దిగాడు. ఆయనతోపాటు అనుచరులూ వచ్చారు. అప్పటికప్పుడు రంగంలోకి దిగారు. ట్రాఫిక్‌ను ఓ గాడిన పెట్టారు. పరిస్థితి అదుపు లోకి వచ్చాకే ఆ నేత అక్కడి నుంచి కదిలారు. ఆ నాయకుడు పీజేఆర్‌. సమస్య చిన్నదైనా... ఆయన తనదారి తాను చూసుకునే రకం కాదని చెప్పడానికి ఇంతకంటే రుజువు అవసరమా?
నగరంలోని సంపన్న ప్రాంతంలో అదో మురికివాడ. అక్కడ ప్రభు త్వ భూమిలో బడుగులు గుడిసెలు వేసుకున్నారు. అవన్నీ ఆక్రమణ లు అన్నారు అధికారులు. తొలగించేందుకు మందీ మార్బలంతో వ చ్చారు. గుడిసెపై విరుచుకుపడేందుకు గునపాలు సిద్ధంగా ఉన్నాయి. అంతలోనే అక్కడ పీజేఆర్‌ ప్రత్యక్షమయ్యారు. 'గుడిసెపై మొదటి గునపం ఎవరు వేస్తే, అదే గునపం వారి గుండెలో దిగుతుంది' గర్జిం చాడు పీజే ఆర్‌. అధికారులు వెనుదిరిగారు. 'పీజేఆర్‌ పేదల దేవుడు' అంటే అతిశయోక్తి ఏముంది?
నగరంలో ప్రమాదం జరిగింది. ప్రైవేటు స్కూలు వ్యాన్‌ ఓ మహిళ ను ఢీకొంది. ఆమె అక్కడికక్కడే చనిపోయింది. స్థానికుల ఆందోళన మొదలైంది. ట్రాఫిక్‌ జామ్‌. ఉద్రిక్తత. అంతలో పీజేఆర్‌ అక్కడికి వచ్చా రు. బాధితుల పక్షాన నిలబడ్డారు. స్కూలు యాజమాన్యంతో మాట్లా డారు. మృతురాలి కుటుంబానికి డబ్బు ఇప్పించారు. ప్రభుత్వంకంటే ముందు సమస్యను పరిష్కరించారు. సమస్యల పరిష్కారంలో జనా ర్దన్‌రెడ్డి చొరవ గురించి చెప్పేందుకు ఇంతకు మించి ఉదాహరణ ఏముంటుంది?

No comments: